IPL 2023 : ఐపీఎల్ లో సగం మ్యాచ్ లు ఫినిష్.. పాయింట్ల పట్టికలో వాటి స్థానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ లో తొలి దశ మ్యాచ్ లు నిన్నటితో ( ఏప్రిల్ 25 ) పూర్తయ్యాయి. లీగ్ లో పాల్గొంటున్న మొత్తం 10 జట్లు ఇప్పటి వరకు ఏడేసి మ్యాచ్ లు ఆడాయి. 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ( 0.662 ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ సైతం 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. చెన్నైతో పోలిస్తే కాస్త రన్ రేట్ ( 0.580 ) తక్కువగా ఉన్న కారణంగా సెకండ్ స్థానంలో ఉంది. ఇక ఏడు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ ( 0.844 ), లక్నో సూపర్ జెయింట్స్ ( 0.547 ), ఆర్సీబీ ( -0.162 ) వరుసగా3 నుంచి 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి. 7 మ్యాచ్ ల్లో మూడింట గెలిచిన ముంబై (-0.620) ఏడులో, 7 మ్యాచ్ ల్లో తలో 2 మ్యాచ్ ల్లో నెగ్గిన కేకేఆర్ (-0.186), సన్ రైజర్స్ హైదరాబాద్ (-0.725), ఢిల్లీ క్యాపిటల్స్ (-0.961) .. 8,9,10 స్థానాల్లో ఉన్నాయి.
Also Read : KTR: ఆ రెండు రోజులు జాగ్రత్త.. ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఆదేశాలు

Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో పాల్గొంటున్న 10 జట్లు 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. అన్ని జట్లు సొంత మైదానంలో 7 మ్యాచ్ లు, ప్రత్యర్థి వేదికలపై 7 మ్యాచ్ లు ఆడతాయి. ఓ జట్టు ఇతర గ్రూప్ లోని ప్రతి జట్టుతో రెండేసీ మ్యాచ్ లు ఆడుతుంది. అలాగే సొంత గ్రూప్ లోని మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది.
గ్రూప్ ఏ : ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్
గ్రూప్ బీ : చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్
Also Read : Smuggled Gold: ముంబై విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్.. బంగారం విలువ ఎంతంటే
ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడిన అనంతరం లీగ్ మ్యాచ్ లు పూర్తవుతాయి ( మే 21 ) పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్ లో ఉండే జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మొదటి క్వాలిఫయర్ లో ( మే 23 ).. మూడు, నాలుగు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ లో ( మే 24 ) తలపడతాయి. క్యాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో ( మే 26 ) పోటీపడుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు మే 28న క్యాలిఫయర్-1లో గెలిచిన జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.

తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!