WTC Prize Money: WTC ఛాంపియన్స్, రన్నరప్కు రికార్డు బద్దలు కొట్టే ప్రైజ్ మనీ.. ఐసీసీ ప్రకటన
- WTC ఛాంపియన్స్, రన్నరప్కు రికార్డు బద్దలు కొట్టే ప్రైజ్ మనీ..
- వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Prize Money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీని ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC).. WTC ఛాంపియన్స్ మరియు రన్నరప్లకు రికార్డు బద్దలు కొట్టే ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్టు వెల్లడించింది.. దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ప్రైజ్ పూల్ను ఐసీసీ ఈ రోజు ప్రకటించింది.. 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) విజేతలకు 3.6 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే.. భారత కరెన్సీ ప్రకారం.. 30.79 కోట్ల రూపాయలు అందజేయనుంది.. ఇది గత ఎడిషన్ల ప్రైజ్ మనీ కంటే రెట్టింపు.. ఇక, రన్నరప్కు 2.1 మిలియన్ల యూఎస్ డాలర్లు.. అంటే ఇండియా కరెన్సీలో 17.96 కోట్లు లభిస్తాయి, ఇది గత సంవత్సరం ఓడిపోయిన ఫైనలిస్టులు 2023లో పొందిన డబ్బు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషంగా చెప్పుకోవాలి..
Read Also:Karnataka: క్రికెట్ బాల్ కోసం టీచర్ని కత్తితో పొడిచిన వ్యక్తి..
Also Read
- Babar Azam: పాక్ క్రికెట్లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..
- Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
- FIFA World Cup 2026: ఫుట్బాల్ ఫ్యాన్స్కు బిగ్ షాక్.. టికెట్లను ధరలు భారీగా పెంచిన FIFA.. సామాన్యులకు దూరమేనా..?
- IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్లు ఏవో తెలుసా..
అయితే, జూన్ 11వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు లండన్లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.. 2023లో భారత క్రికెట్ జట్టును ఓడించి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా అప్పట్లో 1.6 మిలియన్లు యూఎస్ డాలర్లు సంపాదించగా, రన్నరప్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 800,000 యూఎస్ డాలర్లు అందుకుంది. అయితే, “టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఐసీసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..
Read Also: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో..?
డబ్ల్యూటీసీ సైకిల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంక మరియు పాకిస్తాన్లపై 2-0 స్వదేశీ సిరీస్ విజయాలతో అత్యున్నత స్థాయిలో ముగించింది, 69.44 శాతం పాయింట్లు సాధించింది.. ఇక, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో ముగించగా, ఎక్కువ సమయం పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా 50.00తో ముగించింది. టీమిండియా WTC ఫైనల్ ఆడకపోవడం ఇదే మొదటిసారి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను, ముఖ్యంగా లార్డ్స్లో కాపాడుకునే అవకాశం లభించడం పట్ల మేం చాలా గర్వపడుతున్నాం… గత రెండు సంవత్సరాలుగా ఫైనల్కు చేరుకోవడానికి చాలా కష్టపడి పనిచేసిన వారందరికీ ఇది నిదర్శనం, ఇది మనందరికీ గొప్ప గౌరవం అని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ పేర్కొన్నారు.. ఇక, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడుతూ, టెస్ట్ క్రికెట్ యొక్క ప్రాముఖ్యతను అందరూ అర్థం చేసుకుంటారు.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆటలో ఒక కీలకమైన ఫార్మాట్.. ఈ మెగా మ్యాచ్కు లార్డ్స్ సరైన వేదిక.. అంతేకాదు.. ఆస్ట్రేలియాపై మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అని వెల్లడించారు..
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!