IND vs WI: రోహిత్, దినేశ్ వీరవిహారం.. విండీస్ ముందు భారీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies T20I First Match First Innings: బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్లు వీరవిహారం చేశారు. ఇద్దరూ కలిసి వెస్టిండీస్ బౌలర్లతో ఫుట్బాల్ ఆడేసుకున్నారు. ఎడాపెడా షాట్లు బాదుతూ ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత్ బరిలోకి దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(44 బంతుల్లో 64) , సూర్యకుమార్ (24) కాసేపు నిలకడగా రాణించారు. తొలి వికెట్కు 44 పరుగులు జోడించారు. సూర్యకుమార్ ఔటయ్యాక వెనువెంటనే టీమిండియా వికెట్లు కోల్పోయింది. ఓవైపు రోహిత్ శర్మ నెట్టుకొస్తుంటే, మరోవైపు వికెట్స్ పడుతున్నాయి. అప్పుడొచ్చాడు దినేశ్ కార్తిక్.. విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 41 పరుగులు చేశాడు. దినేశ్ ఆడిన ఈ భీకర ఇన్నింగ్స్ కారణంగా భారత్ 190 పరుగుల మార్క్ని అందుకోగలిగింది.
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
ఇక వెస్టిండీస్ బౌలింగ్ విషయానికొస్తే.. అల్జారి జోసెఫ్ 2 వికెట్లు తీయగా.. ఒబెడ్ మెక్కాయ్, జేసన్ హోల్డర్, అకీల్ హుసేన్, కీమో పాల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఒక్క అకీల్ మాత్రమే 4 ఓవర్లు వేసి 14 పరుగులిస్తే.. మిగతా వాళ్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా.. జోసెఫ్ (46) , హోల్డర్ (50) బౌలింగ్లో భారత ఆటగాళ్లు చితక్కొట్టేశారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!