India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్?.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే!
- సూపర్ ట్రాక్ రికార్డు ఉన్నా సూరీడు ఔట్
- టీమిండియా టీ20 కెప్టెన్గా సర్పంచ్ సాబ్
- చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India New T20 Captain is Shreyas Iyer: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టు బాధ్యతలు చేపట్టిన సూరీడు.. జట్టును తనదైన శైలిలో ముందుకు నడిపించాడు. కెప్టెన్గా అతడి రికార్డు అద్భుతంగా ఉంది. సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే సూపర్ ట్రాక్ రికార్డు ఉన్నా.. సూరీడి భవితవ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజా నివేదికల ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ సూర్య ఫామ్పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఇటీవల అతడు పరుగుల చేసేందుకు ఇబ్బంది పడుతుండటం, ఐపీఎల్ 2026లో కూడా నిరాశపరిచే ప్రదర్శన చేయడం ఈ నిర్ణయానికి కారణం అని పేర్కొన్నాయి. ఐపీఎల్లో ఇరగదీస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకురావడమే కాకుండా.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 తర్వాత జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల నుంచే అయ్యర్కు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.
Also Read
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- India vs Afghanistan: భారత్తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
- Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
భారత జట్టులో కొత్త ఉత్సాహం తీసుకురావాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్ ముందంజలో ఉన్నాడట. త్వరలోనే ‘సర్పంచ్ సాబ్’ టీమిండియా కొత్త కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశముందని సమాచారం. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. జట్టుకు తొలి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు అందించడంతో పాటు తొమ్మిది ఇన్నింగ్స్ల్లో 333 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనే అతడిని మరలా భారత జట్టులోకి తీసుకొస్తోంది. శ్రేయస్ చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో కనీసం బ్యాటర్గా అయినా చోటు దక్కించుకుంటాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున 10 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేయడం విమర్శలకు దారి తీసింది. అదే సమయంలో సూర్యకుమార్ కొంతకాలంగా మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. ఆ నొప్పితోనే మ్యాచ్లు ఆడుతున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. కెప్టెన్గా సూరీడి రికార్డు అద్భుతంగా ఉన్నా.. బ్యాటర్గా తేలిపోవడమే అతడిపై వేటుకు కారణం అవుతుంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!