Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీసీఐ సెలక్షన్ కమిటీ అఫ్గానిస్థాన్తో జరగబోయే రాబోయే సిరీస్ల కోసం భారత వన్డే, టెస్టు జట్లను అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో వరుసగా క్రికెట్ ఆడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్ నుంచి పూర్తిగా విశ్రాంతి కల్పించారు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కేవలం టీ20 ఫార్మాట్కు మాత్రమే ఫిట్గా ఉన్నాడని, అందుకే అతడిని టెస్టు మ్యాచ్కు పరిగణనలోకి తీసుకోలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు.
వన్డే జట్టు విశేషాలు..
మూడు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టుకు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ జట్టులో కొనసాగుతున్నారు. అయితే.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు ఈ వన్డే జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లు కీపింగ్ బాధ్యతలు చూసుకోనున్నారు. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే వంటి దేశవాళీ ప్రతిభావంతులకు వన్డే జట్టులో పిలుపు లభించింది.
Also Read
- Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
టెస్టు జట్టు విశేషాలు..
అఫ్గాన్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం 15 మందితో కూడిన సరికొత్త జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. వన్డేల మాదిరిగానే టెస్టు జట్టుకు కూడా శుభ్మన్ గిల్కే సారథ్య బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. వన్డేల్లో చోటు కోల్పోయిన రిషభ్ పంత్ టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. యువ సంచలనాలు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్లకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో కుల్దీప్, సుందర్లతో పాటు మానవ్ సుతార్కు అవకాశం లభించింది. పేస్ బాధ్యతలను సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చూసుకోనున్నారు.
టెస్టు జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!