T20 World Cup: పాకిస్తాన్ భారత్ మ్యాచ్ బాయ్కాట్.. టోర్నీకే పెద్ద దెబ్బ.. ఎన్ని కోట్ల నష్టం అంటే..
- భారత్తో మ్యాచ్ బహిష్కరించిన పాకిస్తాన్..
- ఒక్క మ్యాచ్తో ఏకంగా రూ. 4500 కోట్ల నష్టం..
- భారత్ నష్టం తక్కువే, ప్రశ్నార్థంగా పాక్ క్రికెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: క్రికెట్ హిస్టరీలోనే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ రెండు దేశాల ఆట కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తుంటారు. అయితే, టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగే మ్యాచ్ను పాకిస్తాన్ బాయ్కాట్ చేసింది. బంగ్లాదేశ్కు భారత్లో ఆడేందుకు నిరాకరించిన తర్వాత ఐసీసీ బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది. బంగ్లాకు మద్దతుగా భారత్తో కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ను పాక్ బహిష్కరించింది.
రూ. 4500 కోట్ల నష్టం:
Also Read
- Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
- Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన మైలురాయి.. మూడో భారతీయ క్రికెటర్గా రికార్డు..
- Rohit Yadav: బిగ్ షాక్.. క్రికెటర్ రోహిత్పై రెండేళ్ల నిషేధం..
- BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
అయితే, ఇది మొత్తం టోర్నీకే పెద్ద దెబ్బగా మారింది. టోర్నీలోని అన్ని మ్యాచుల కన్నా భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్కే ఎక్కువ ఆదాయం వస్తుంది. టోర్నీకి నిధులు సమకూర్చేది, బ్రాడ్కాస్ట్ విలువను పెంచేది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ మొత్తం అంచనా విలువ సుమారుగా రూ. 4500 కోట్లు. ఏ క్రికెట్ మ్యాచ్కు కూడా ఇంత విలువ లేదు. 10 సెకన్ల ప్రకటనకే రూ. 22-40 లక్షలు ఉంటుంది. బ్రాడ్ కాస్టింగ్, స్పాన్సర్లు, టికెట్లు, బెట్టింగ్ అన్ని మ్యాచ్ చుట్టూనే తిరుగుతాయి. ఈ మ్యాచ్ లేకపోతే టోర్నీనే ఆర్థికంగా కుదేలు అవుతుంది.
భారత్కు కూడా నష్టమే:
బ్రాడ్ కాస్టర్లకు ప్రకటనల ద్వారా వచ్చే రూ. 300 కోట్లు నష్టం వాటిల్లుతుంది. బ్రాడ్కాస్టర్లు ఇప్పుడు ఐసీసీ వద్ద రీబేట్ కోరే హక్కు ఉంటుంది. పెద్ద మ్యాచ్ రద్దు కావడంతో కమర్షియల్ విలువ దెబ్బతింటుంది. ఐసీసీకి ఆదాయం తగ్గుతుంది. చిన్న దేశాల బోర్డులకు వెళ్లే డబ్బు తగ్గుతుంది. భారత్ సుమారుగా రూ. 200 కోట్లు నష్టపోతుంది. భారత్ ఈ నష్టాన్ని తట్టుకోగలదు.
ప్రమాదంలో పాక్ క్రికెట్:
అసలు సమస్య పాకిస్తాన్కే ఉన్నాయి. పీసీసీకి ఐసీసీ నుంచి 5.75 శాతం ఆదాయం ప్రతీ ఏడాది వస్తుంది. ప్రతీ ఏడాది 34.51 మిలియన్ డాలర్లను అందుకుంటోంది. అయితే, ఇప్పుడు పాక్ స్వచ్ఛందంగా మ్యాచ్ను బాయ్కాట్ చేయడంతో ఇన్సూరెన్స్ ఉండదు, చట్టపరమైన చర్యలు, జరిమానాలు, చెల్లింపుల నిలుపుదల, కేసులనున ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా పాక్ క్రికెట్ మొత్తం అస్తిత్వ సంక్షోభంలో చిక్కుకుంటుంది. ఒక్క మ్యాచ్ మిస్ చేసుకుంటే, పాక్ మ్యాచ్లు రిస్క్ అసెట్గా మారుతాయి. భవిష్యత్తులో బ్రాడ్ కాస్ట్ డీల్స్ తక్కువ విలువ ఉంటుంది. స్పాన్సర్లు వెనకడుగు వేస్తారు, ఐసీసీలో పాక్ బోర్డు ప్రభావం తగ్గిపోతుంది.
తాజావార్తలు
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!