T20 World Cup: పాకిస్తాన్ భారత్ మ్యాచ్ బాయ్కాట్.. టోర్నీకే పెద్ద దెబ్బ.. ఎన్ని కోట్ల నష్టం అంటే..
- భారత్తో మ్యాచ్ బహిష్కరించిన పాకిస్తాన్..
- ఒక్క మ్యాచ్తో ఏకంగా రూ. 4500 కోట్ల నష్టం..
- భారత్ నష్టం తక్కువే, ప్రశ్నార్థంగా పాక్ క్రికెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: క్రికెట్ హిస్టరీలోనే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ రెండు దేశాల ఆట కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తుంటారు. అయితే, టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగే మ్యాచ్ను పాకిస్తాన్ బాయ్కాట్ చేసింది. బంగ్లాదేశ్కు భారత్లో ఆడేందుకు నిరాకరించిన తర్వాత ఐసీసీ బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది. బంగ్లాకు మద్దతుగా భారత్తో కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ను పాక్ బహిష్కరించింది.
రూ. 4500 కోట్ల నష్టం:
Also Read
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
అయితే, ఇది మొత్తం టోర్నీకే పెద్ద దెబ్బగా మారింది. టోర్నీలోని అన్ని మ్యాచుల కన్నా భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్కే ఎక్కువ ఆదాయం వస్తుంది. టోర్నీకి నిధులు సమకూర్చేది, బ్రాడ్కాస్ట్ విలువను పెంచేది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ మొత్తం అంచనా విలువ సుమారుగా రూ. 4500 కోట్లు. ఏ క్రికెట్ మ్యాచ్కు కూడా ఇంత విలువ లేదు. 10 సెకన్ల ప్రకటనకే రూ. 22-40 లక్షలు ఉంటుంది. బ్రాడ్ కాస్టింగ్, స్పాన్సర్లు, టికెట్లు, బెట్టింగ్ అన్ని మ్యాచ్ చుట్టూనే తిరుగుతాయి. ఈ మ్యాచ్ లేకపోతే టోర్నీనే ఆర్థికంగా కుదేలు అవుతుంది.
భారత్కు కూడా నష్టమే:
బ్రాడ్ కాస్టర్లకు ప్రకటనల ద్వారా వచ్చే రూ. 300 కోట్లు నష్టం వాటిల్లుతుంది. బ్రాడ్కాస్టర్లు ఇప్పుడు ఐసీసీ వద్ద రీబేట్ కోరే హక్కు ఉంటుంది. పెద్ద మ్యాచ్ రద్దు కావడంతో కమర్షియల్ విలువ దెబ్బతింటుంది. ఐసీసీకి ఆదాయం తగ్గుతుంది. చిన్న దేశాల బోర్డులకు వెళ్లే డబ్బు తగ్గుతుంది. భారత్ సుమారుగా రూ. 200 కోట్లు నష్టపోతుంది. భారత్ ఈ నష్టాన్ని తట్టుకోగలదు.
ప్రమాదంలో పాక్ క్రికెట్:
అసలు సమస్య పాకిస్తాన్కే ఉన్నాయి. పీసీసీకి ఐసీసీ నుంచి 5.75 శాతం ఆదాయం ప్రతీ ఏడాది వస్తుంది. ప్రతీ ఏడాది 34.51 మిలియన్ డాలర్లను అందుకుంటోంది. అయితే, ఇప్పుడు పాక్ స్వచ్ఛందంగా మ్యాచ్ను బాయ్కాట్ చేయడంతో ఇన్సూరెన్స్ ఉండదు, చట్టపరమైన చర్యలు, జరిమానాలు, చెల్లింపుల నిలుపుదల, కేసులనున ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా పాక్ క్రికెట్ మొత్తం అస్తిత్వ సంక్షోభంలో చిక్కుకుంటుంది. ఒక్క మ్యాచ్ మిస్ చేసుకుంటే, పాక్ మ్యాచ్లు రిస్క్ అసెట్గా మారుతాయి. భవిష్యత్తులో బ్రాడ్ కాస్ట్ డీల్స్ తక్కువ విలువ ఉంటుంది. స్పాన్సర్లు వెనకడుగు వేస్తారు, ఐసీసీలో పాక్ బోర్డు ప్రభావం తగ్గిపోతుంది.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!