T20 World Cup: క్రికెట్ హిస్టరీలోనే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ రెండు దేశాల ఆట కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తుంటారు. అయితే, టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగే మ్యాచ్ను పాకిస్తాన్ బాయ్కాట్ చేసింది. బంగ్లాదేశ్కు భారత్లో ఆడేందుకు నిరాకరించిన తర్వాత ఐసీసీ బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది. బంగ్లాకు మద్దతుగా భారత్తో కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ను పాక్ బహిష్కరించింది.
రూ. 4500 కోట్ల నష్టం:
అయితే, ఇది మొత్తం టోర్నీకే పెద్ద దెబ్బగా మారింది. టోర్నీలోని అన్ని మ్యాచుల కన్నా భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్కే ఎక్కువ ఆదాయం వస్తుంది. టోర్నీకి నిధులు సమకూర్చేది, బ్రాడ్కాస్ట్ విలువను పెంచేది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ మొత్తం అంచనా విలువ సుమారుగా రూ. 4500 కోట్లు. ఏ క్రికెట్ మ్యాచ్కు కూడా ఇంత విలువ లేదు. 10 సెకన్ల ప్రకటనకే రూ. 22-40 లక్షలు ఉంటుంది. బ్రాడ్ కాస్టింగ్, స్పాన్సర్లు, టికెట్లు, బెట్టింగ్ అన్ని మ్యాచ్ చుట్టూనే తిరుగుతాయి. ఈ మ్యాచ్ లేకపోతే టోర్నీనే ఆర్థికంగా కుదేలు అవుతుంది.
భారత్కు కూడా నష్టమే:
బ్రాడ్ కాస్టర్లకు ప్రకటనల ద్వారా వచ్చే రూ. 300 కోట్లు నష్టం వాటిల్లుతుంది. బ్రాడ్కాస్టర్లు ఇప్పుడు ఐసీసీ వద్ద రీబేట్ కోరే హక్కు ఉంటుంది. పెద్ద మ్యాచ్ రద్దు కావడంతో కమర్షియల్ విలువ దెబ్బతింటుంది. ఐసీసీకి ఆదాయం తగ్గుతుంది. చిన్న దేశాల బోర్డులకు వెళ్లే డబ్బు తగ్గుతుంది. భారత్ సుమారుగా రూ. 200 కోట్లు నష్టపోతుంది. భారత్ ఈ నష్టాన్ని తట్టుకోగలదు.
ప్రమాదంలో పాక్ క్రికెట్:
అసలు సమస్య పాకిస్తాన్కే ఉన్నాయి. పీసీసీకి ఐసీసీ నుంచి 5.75 శాతం ఆదాయం ప్రతీ ఏడాది వస్తుంది. ప్రతీ ఏడాది 34.51 మిలియన్ డాలర్లను అందుకుంటోంది. అయితే, ఇప్పుడు పాక్ స్వచ్ఛందంగా మ్యాచ్ను బాయ్కాట్ చేయడంతో ఇన్సూరెన్స్ ఉండదు, చట్టపరమైన చర్యలు, జరిమానాలు, చెల్లింపుల నిలుపుదల, కేసులనున ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా పాక్ క్రికెట్ మొత్తం అస్తిత్వ సంక్షోభంలో చిక్కుకుంటుంది. ఒక్క మ్యాచ్ మిస్ చేసుకుంటే, పాక్ మ్యాచ్లు రిస్క్ అసెట్గా మారుతాయి. భవిష్యత్తులో బ్రాడ్ కాస్ట్ డీల్స్ తక్కువ విలువ ఉంటుంది. స్పాన్సర్లు వెనకడుగు వేస్తారు, ఐసీసీలో పాక్ బోర్డు ప్రభావం తగ్గిపోతుంది.