IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ కోసం ప్రత్యేక నాణెం!
- నవంబర్ 14 నుంచి భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్
- కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తొలి టెస్ట్ మ్యాచ్
- టెస్టు సిరీస్ కోసం ప్రత్యేక నాణెం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్ 14 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ నెల 14 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో, 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ మ్యాచ్ మొదలు కానున్నాయి. టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే రెండు టీమ్స్ ముమ్మర సాధన చేస్తున్నాయి. ఈ టెస్ట్ సిరీస్ టాస్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ప్రత్యేక బంగారు నాణెంను తయారు చేయించింది. ప్రత్యేక నాణెం టాస్ సమయంలో ఉపయోగించబడుతుందని క్యాబ్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు.
టాస్ కోసం క్యాబ్ ప్రత్యేకంగా తయారు చేయించిన నాణెం గోల్డ్ కాయిన్. ఈ కాయిన్కు ఒక వైపు భారత జాతిపిత మహాత్మా గాంధీ, మరోవైపు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చిత్రం ఉంటుంది. శాంతి, స్వేచ్ఛ, అహింస మార్గంలో నడిచిన మహనీయులు గాంధీ-మండేలాల గౌరవార్థం ఈ స్పెషల్ కాయిన్ రూపొందించారు. ఈ నాణెంను టెస్ట్ సిరీస్లోని రెండు మ్యాచ్ల్లో టాస్ సందర్భంగా ఉపయోగించనున్నారు. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా గౌరవార్థం 2015 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ను ‘ఫ్రీడమ్ ట్రోఫీ’గా పిలుస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
ఆరు సంవత్సరాల తర్వాత కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. దీంతో టెస్ట్ మ్యాచ్ అయినా అభిమానుల్లో ఎంతో ఆసక్తి పెరిగింది. మొదటి 3 రోజుల టికెట్లు పూర్తిగా అమ్ముడైనట్లు క్యాబ్ కోశాధికారి సంజయ్ దాస్ తెలిపారు. మొదటి 3 రోజులకు ఇప్పటికే 96,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని, మొత్తం 14 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయని చెప్పారు. ఇక ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు దాడి నేపథ్యంలో ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రత కోసం కోల్కతా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..