IND vs PAK: 7 ఏళ్ల తర్వాత భారత్కు పాకిస్తాన్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan will come to India after 7 Years for World Cup 2023: భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. అహ్మదాబాద్లో అక్టోబరు 5న మెగా సమరం ఆరంభం అయి.. నవంబరు 19న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లో 45 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు, 2 నాకౌట్ మ్యాచ్లు (సెమీ ఫైనల్స్), ఒక ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 48 మ్యాచ్లకు భారత్లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రపంచకప్ మ్యాచ్ల కోసం భారత్ సహా అన్ని దేశాల ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా తన ప్రపంచకప్ 2023 పోరాటాన్ని ప్రారంభిస్తుంది. అక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఇక ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న మ్యాచ్ జరగనుంది. దాయాది జట్లు ప్రపంచంలోనే అత్యధిక కెపాసిటీ ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ప్రపంచకప్ 2023 కోసం పాకిస్తాన్ జట్టు ఏడేళ్ల విరామం తర్వాత భారత్లో అడుగుపెట్టనుంది.
Also Read
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
పాకిస్థాన్ చివరిసారిగా టీ20 ప్రపంచకప్ 2016 కోసం భారత్ గడ్డపైకి వచ్చింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో భారత్తో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఇప్పటివరకు కూడా భారత్కు రాలేదు. ప్రపంచకప్ 2023 పుణ్యమాని ఏడేళ్ల తర్వాత భారత గడ్డపైకి అడుగుపెట్టనుంది. ఇరు దేశాల మధ్య బేధాభిప్రాయాల కారణంగా గత కొంత కాలంగా భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే దాయాది దేశాలు తలపడుతున్నాయి.
2016 టీ20 ప్రపంచకప్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (26), అహ్మద్ షెహజాద్ (25) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో సురేష్ రైనా, రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా తలో వికెట్ పడగొట్టారు. 119 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో పూర్తిచేసింది. విరాట్ కోహ్లీ (55 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదాడు. మొహ్మద్ సమీ 2 వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Big Pay Hike: టీచర్లకు గుడ్న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!