IND vs PAK: 7 ఏళ్ల తర్వాత భారత్కు పాకిస్తాన్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Pakistan will come to India after 7 Years for World Cup 2023: భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. అహ్మదాబాద్లో అక్టోబరు 5న మెగా సమరం ఆరంభం అయి.. నవంబరు 19న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లో 45 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు, 2 నాకౌట్ మ్యాచ్లు (సెమీ ఫైనల్స్), ఒక ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 48 మ్యాచ్లకు భారత్లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రపంచకప్ మ్యాచ్ల కోసం భారత్ సహా అన్ని దేశాల ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా తన ప్రపంచకప్ 2023 పోరాటాన్ని ప్రారంభిస్తుంది. అక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఇక ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న మ్యాచ్ జరగనుంది. దాయాది జట్లు ప్రపంచంలోనే అత్యధిక కెపాసిటీ ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ప్రపంచకప్ 2023 కోసం పాకిస్తాన్ జట్టు ఏడేళ్ల విరామం తర్వాత భారత్లో అడుగుపెట్టనుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
- SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
- Viral: బిగ్ షాకింగ్... స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
- Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్..
పాకిస్థాన్ చివరిసారిగా టీ20 ప్రపంచకప్ 2016 కోసం భారత్ గడ్డపైకి వచ్చింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో భారత్తో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఇప్పటివరకు కూడా భారత్కు రాలేదు. ప్రపంచకప్ 2023 పుణ్యమాని ఏడేళ్ల తర్వాత భారత గడ్డపైకి అడుగుపెట్టనుంది. ఇరు దేశాల మధ్య బేధాభిప్రాయాల కారణంగా గత కొంత కాలంగా భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే దాయాది దేశాలు తలపడుతున్నాయి.
2016 టీ20 ప్రపంచకప్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (26), అహ్మద్ షెహజాద్ (25) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో సురేష్ రైనా, రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా తలో వికెట్ పడగొట్టారు. 119 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో పూర్తిచేసింది. విరాట్ కోహ్లీ (55 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదాడు. మొహ్మద్ సమీ 2 వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Big Pay Hike: టీచర్లకు గుడ్న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!
తాజావార్తలు
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
-
AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!