IND vs ENG 3rd T20: ‘సర్పంచ్ సాబ్’ సత్తాకు పరీక్ష.. ఆ స్టార్స్ రాణించకుంటే అంతే సంగతులు!
- భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టీ20
- భారత జట్టులో కీలక మార్పులు
- 'సర్పంచ్ సాబ్' సత్తాకు పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Faces Captaincy Test: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఈరోజు రాత్రి మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్ల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. టీమ్ మేనేజ్మెంట్ కూర్పులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్కు మరోసారి నిరాశ తప్పదు.
ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ జోడీ కొనసాగనుంది. రెండో టీ20లో వైభవ్ తన అరంగేట్ర మ్యాచ్లో దూకుడు బ్యాటింగ్తో ఆకట్టుకోవడంతో టీమ్ మేనేజ్మెంట్ అతడిపై విశ్వాసం ఉంచింది. దీంతో సంజు శాంసన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. బుడ్డోడి నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక వర్మలు బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఉంది. అలానే శివమ్ దూబే కూడా కీలక పరుగులు చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read
- Sanju Samson: సంజు శాంసన్కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
- IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
- Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ.. మహిళల క్రికెట్కు చిరునామా.. చరిత్రలోనే గొప్ప ఆల్రౌండర్!
- Vaibhav Sooryavanshi Debut: వైభవ్కు ఒకటే చెప్పాం.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు జరగనున్నాయి. స్పిన్నర్ రవి బిష్ణోయ్ను తప్పించి యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ను తిరిగి తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పేస్ దళంలో యాదవ్తో పాటు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు కొనసాగనున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి జోడీ కొనసాగనుంది. ముఖ్యంగా వరుణ్ ఇటీవల అద్భుత ఫామ్లో లేకపోవడం భారత జట్టుకు మైనస్ అయింది. తన వైవిధ్యమైన స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడితే టీమిండియాకు తిరుగుండదు.
ఈ మ్యాచ్ భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు కూడా ఎంతో కీలకంగా మారింది. సిరీస్లో ఇంకా విజయాన్ని నమోదు చేయని భారత్కు మూడో టీ20 ‘డూ ఆర్ డై’ మ్యాచ్లా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్లో నిలబడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘సర్పంచ్ సాబ్’ కెప్టెన్సీ సత్తాకు పరీక్షగా నిలవనుంది. అలానే స్టార్ రాణించకుంటే.. ఈ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపనుంది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd T20: ‘సర్పంచ్ సాబ్’ సత్తాకు పరీక్ష.. ఆ స్టార్స్ రాణించకుంటే అంతే సంగతులు!
-
రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
-
Explainer: అమెరికా వర్సెస్ ఇజ్రాయెల్..అస్త్రంగా ఇండియా! నెక్ట్స్ ఏం జరగనుంది?
-
O Sukumari OTT Deal: ‘ఓ..! సుకుమారి’కి ఓటీటీలో క్రేజ్.. రిలీజ్కు ముందే రైట్స్ ఫిక్స్!
-
Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!