IND vs ENG 3rd T20: ‘సర్పంచ్ సాబ్’ సత్తాకు పరీక్ష.. ఆ స్టార్స్ రాణించకుంటే అంతే సంగతులు!
- భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టీ20
- భారత జట్టులో కీలక మార్పులు
- 'సర్పంచ్ సాబ్' సత్తాకు పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Faces Captaincy Test: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఈరోజు రాత్రి మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్ల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. టీమ్ మేనేజ్మెంట్ కూర్పులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్కు మరోసారి నిరాశ తప్పదు.
ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ జోడీ కొనసాగనుంది. రెండో టీ20లో వైభవ్ తన అరంగేట్ర మ్యాచ్లో దూకుడు బ్యాటింగ్తో ఆకట్టుకోవడంతో టీమ్ మేనేజ్మెంట్ అతడిపై విశ్వాసం ఉంచింది. దీంతో సంజు శాంసన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. బుడ్డోడి నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక వర్మలు బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఉంది. అలానే శివమ్ దూబే కూడా కీలక పరుగులు చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read
- Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్లో రెండో రౌండ్కు అర్హత
- KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు జరగనున్నాయి. స్పిన్నర్ రవి బిష్ణోయ్ను తప్పించి యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ను తిరిగి తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పేస్ దళంలో యాదవ్తో పాటు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు కొనసాగనున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి జోడీ కొనసాగనుంది. ముఖ్యంగా వరుణ్ ఇటీవల అద్భుత ఫామ్లో లేకపోవడం భారత జట్టుకు మైనస్ అయింది. తన వైవిధ్యమైన స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడితే టీమిండియాకు తిరుగుండదు.
ఈ మ్యాచ్ భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు కూడా ఎంతో కీలకంగా మారింది. సిరీస్లో ఇంకా విజయాన్ని నమోదు చేయని భారత్కు మూడో టీ20 ‘డూ ఆర్ డై’ మ్యాచ్లా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్లో నిలబడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘సర్పంచ్ సాబ్’ కెప్టెన్సీ సత్తాకు పరీక్షగా నిలవనుంది. అలానే స్టార్ రాణించకుంటే.. ఈ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపనుంది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?