ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు సెలక్ట్ చేసిన భారత జట్టుపైన చాలా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ ఎంపికల పైనే ఎక్కువ చర్చలు జరిగాయి. అయితే వారిద్దరూ ఈ ప్రపంచ కప్ మ్యాచ్ లలో కేవలం గత ఖ్యాతితో ఆడుతున్నారు అని మాజీ క్రికెటర్ దిలీప్ దోషి అన్నారు.
వీరిద్దరూ గతంలో భారత జట్టుకు చాలా మ్యాచ్ లలో విజయాలు అందించారు. ఆ కారణంగానే ఈ ప్రపంచ కప్ మ్యాచ్ లలో ఉన్నారు. ఇక ఈ టోర్నీలో అశ్విన్ ప్రతి మ్యాచ్ లో ఆడాలన్నారు. అతను ఉంటే జట్టు బౌలింగ్ లో చాలా బలం పెరుగుతుంది అని చెప్పాడు. అలాగే శార్దూల్ ఠాకూర్ కూడా తుది జట్టులో ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య ఆడిన మ్యాచ్ లలో బ్యాట్ తోను బాల్ తోను మంచి ప్రదర్శన కనబరిచాడని తెలిపాడు.