NTV Telugu Site icon

రోహిత్‌ శర్మ సారథిగా రాణిస్తాడు: గంగూలీ

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్థానంలో సెలక్టర్లు రోహిత్‌ శర్మను టీంఇండియా సారథిగా నియమించిన విషయం తెల్సిందే.. ఇప్పటికే రోహిత్‌ ముంబై ఇండియన్స్‌ సారథిగా ఐదు టైటిల్‌ను ఆ జట్టుకు అందించాడు. రోహిత్‌ శర్మపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీంఇండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ రాణించగలడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌కు మంచి రికార్డు ఉందని తెలిపారు. ఆసియా కప్‌లోనూ టీంఇండియాకు సారథిగా వ్యవహరించి గెలిపించాడు. విరాట్‌ కోహ్లీ, బుమ్రా లాంటి సీనియర్‌ ఆటగాళ్లు లేకున్నా యువ ఆటగాళ్లతో జట్టును ముందకు నడింపించాడని గంగూలీ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన బిగ్‌ టోర్నమెంట్లలో రోహిత్ సక్సెస్‌ అయ్యాడు. అతడికి ఇప్పుడు మంచి టీం ఉంది భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్టు గంగూలీ చెప్పారు.