Rudi Koertzen Passes Away: అంతర్జాతీయ క్రికెట్ మాజీ అంపైర్ రూడీ కోర్ట్జెన్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rudi Koertzen Passes Away: దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ మాజీ అంపైర్ రూడీ కోర్ట్జెన్(73) కారు ప్రమాదంలో మరణించారు. సిక్స్ను చూపాలంటే వేలు నెమ్మదిగా పైకి లేపడంలో కోర్ట్జెన్ పేరుగాంచాడు. రివర్డేల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణాన్ని కుమారుడు రూడీ కోర్ట్జెన్ జూనియర్ ధ్రువీకరించారు. నెల్సన్ మండేలా బే వద్ద గోల్ఫ్ ఆడి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగింది.
1981లో అంపైరింగ్ని చేపట్టి, 1992లో పోర్ట్ ఎలిజబెత్లో భారత్ -దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్లో నిలిచిన కోర్ట్జెన్, 331 అంతర్జాతీయ మ్యాచ్లకు అఫీషియల్గా పనిచేశాడు, 2010లో రిటైర్ అయ్యే వరకు ఈ రికార్డును కొనసాగించాడు. దిగ్గజ ఆటగాడు డేవిడ్ షెపర్డ్ తర్వాత 150 కంటే ఎక్కువ వన్డేలకు అంపైర్గా వ్యవహరించిన చరిత్రలో అతను రెండవ అంపైర్ అయ్యాడు. స్టీవ్ బక్నార్ తర్వాత 200 టెస్టుల్లో నిలిచిన రెండవ అంపైర్ కూడా అయ్యాడు. 2022లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల సభ్యులలో ఆయన ఒకరు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లలో అంపైరింగ్ చేసిన కోర్ట్జెన్ రికార్డును బద్దలు కొట్టిన అలీమ్ దార్ తన మాజీ సహోద్యోగికి హృదయపూర్వక నివాళి అర్పించాడు. ఆయన మృతిపట్ల క్రికెటర్లు, అంపైర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2011లో చిన్నస్వామిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన చివరి అధికారిక మ్యాచ్.
Also Read
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
- Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
- Shahrukh Khan: చరిత్ర సృష్టించిన 'షారుఖ్' నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
Serena Williams: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్!
కోర్ట్జెన్ 2002లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించారు. దాదాపు ఎనిమిదేళ్లు ఈ హోదాలో కొనసాగారు. మొత్తం తన కెరీర్లో 397 మ్యాచ్లకు ఆన్ ఫీల్డ్ అండ్ టీవీ అంపైర్గా ఉన్నారు. ఇందులో 128 టెస్టులు, 250 వన్డేలు, 19 టీ-20లు ఉన్నాయి.ృఈ దిగ్గజ అంపైర్ కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన 2007 వన్డే ప్రపంచకప్ ఫైనల్ను.. వెలుతురు సరిగా లేకున్నా నిర్వహించారన్న ఆరోపణ ఉంది. ఐసీసీ నిబంధనను అతిక్రమించిన కారణంగా.. అదే ఏడాది తన సొంత దేశంలో జరిగిన తొలి టీ-20 ప్రపంచ కప్లో ఐసీసీ కోర్ట్జెన్ను పక్కన పెట్టింది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!