Rudi Koertzen Passes Away: అంతర్జాతీయ క్రికెట్ మాజీ అంపైర్ రూడీ కోర్ట్జెన్ మృతి
Rudi Koertzen Passes Away: దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ మాజీ అంపైర్ రూడీ కోర్ట్జెన్(73) కారు ప్రమాదంలో మరణించారు. సిక్స్ను చూపాలంటే వేలు నెమ్మదిగా పైకి లేపడంలో కోర్ట్జెన్ పేరుగాంచాడు. రివర్డేల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణాన్ని కుమారుడు రూడీ కోర్ట్జెన్ జూనియర్ ధ్రువీకరించారు. నెల్సన్ మండేలా బే వద్ద గోల్ఫ్ ఆడి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగింది.
1981లో అంపైరింగ్ని చేపట్టి, 1992లో పోర్ట్ ఎలిజబెత్లో భారత్ -దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్లో నిలిచిన కోర్ట్జెన్, 331 అంతర్జాతీయ మ్యాచ్లకు అఫీషియల్గా పనిచేశాడు, 2010లో రిటైర్ అయ్యే వరకు ఈ రికార్డును కొనసాగించాడు. దిగ్గజ ఆటగాడు డేవిడ్ షెపర్డ్ తర్వాత 150 కంటే ఎక్కువ వన్డేలకు అంపైర్గా వ్యవహరించిన చరిత్రలో అతను రెండవ అంపైర్ అయ్యాడు. స్టీవ్ బక్నార్ తర్వాత 200 టెస్టుల్లో నిలిచిన రెండవ అంపైర్ కూడా అయ్యాడు. 2022లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల సభ్యులలో ఆయన ఒకరు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లలో అంపైరింగ్ చేసిన కోర్ట్జెన్ రికార్డును బద్దలు కొట్టిన అలీమ్ దార్ తన మాజీ సహోద్యోగికి హృదయపూర్వక నివాళి అర్పించాడు. ఆయన మృతిపట్ల క్రికెటర్లు, అంపైర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2011లో చిన్నస్వామిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన చివరి అధికారిక మ్యాచ్.
Also Read
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
- LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్ఎస్జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
Serena Williams: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్!
కోర్ట్జెన్ 2002లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు సంపాదించారు. దాదాపు ఎనిమిదేళ్లు ఈ హోదాలో కొనసాగారు. మొత్తం తన కెరీర్లో 397 మ్యాచ్లకు ఆన్ ఫీల్డ్ అండ్ టీవీ అంపైర్గా ఉన్నారు. ఇందులో 128 టెస్టులు, 250 వన్డేలు, 19 టీ-20లు ఉన్నాయి.ృఈ దిగ్గజ అంపైర్ కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన 2007 వన్డే ప్రపంచకప్ ఫైనల్ను.. వెలుతురు సరిగా లేకున్నా నిర్వహించారన్న ఆరోపణ ఉంది. ఐసీసీ నిబంధనను అతిక్రమించిన కారణంగా.. అదే ఏడాది తన సొంత దేశంలో జరిగిన తొలి టీ-20 ప్రపంచ కప్లో ఐసీసీ కోర్ట్జెన్ను పక్కన పెట్టింది.
తాజావార్తలు
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!