BCCI: ఆ ఇద్దరిని ఎందుకు ఎంపిక చేయలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో జూన్లో జరగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కి గాను బీసీసీఐ సెలెక్షన్ కమిటి ఆదివారం 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టుని ప్రకటించింది. ఈ జాబితాలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బాగా రాణించిన రాహుల్ త్రిపాఠిని, సంజూ శాంసన్ని ఎంపిక చేయకపోవడం పట్ల క్రికెట్ ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళని ఎందుకు, ఏ లెక్కన ఎంపిక చేయలేదని బిసీసీఐని నిలదీస్తున్నారు. మాజీలు సైతం ఆ ఇద్దరిని సెలెక్ట్ చేయకపోవడంతో నిరాశను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అంతగా రాణించని రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్లను ఎంపిక చేయడంపై మండిపడుతున్నారు.
కాగా.. ఈ సీజన్లో ఇషాన్ కిషన్ 14 మ్యాచ్ల్లో 32.15 సగటు, 120.11 స్ట్రైక్రేట్తో 418 పరుగులు చేయగా, అందులో 3 అర్ధశతకాలు సాధించాడు. రుతురాజ్ 14 మ్యాచ్ల్లో 26.29 సగటు, 126.46 స్ట్రైక్రేట్తో 374 పరుగులు చేయగా, 3 అర్ధ శతకాలే సాధించాడు. వెంకటేశ్ అయ్యార్ అయితే ఈ సీజన్లో మరీ పేలవ పెర్పార్మెన్స్తో నిరాశపరిచాడు. 12 మ్యాచ్ల్లో 16.55 సగటు, 107.69 స్ట్రైక్రేట్తో 182 పరుగులే చేసిన వెంకటేశ్, ఒకటే అర్ధశతకం సాధించాడు. అయితే.. టీమిండియాకు ఎంపికవ్వని రాహుల్ త్రిపాఠి మాత్రం 14 మ్యాచ్ల్లో మెరుగైన 41.30 సగటు, 158.23 స్ట్రైక్రేట్ 413 పరుగులు సాధించాడు. అందులో 3 అర్ధశతకాలు కొట్టాడు. సంజూ శాంసన్ 14 మ్యాచ్ల్లో 374 పరుగులు చేయగా, రెండు అర్థశతకాలు నమోదు చేశాడు. సగటు 28.77 నామమాత్రంగా ఉన్నా, స్ట్రైక్రేట్ మాత్రం147.24 గొప్పగా ఉంది.
Also Read
- Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
- AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
- Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
- Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్గా రికార్డు..
ఈ నేపథ్యంలోనే వాళ్ళను ఎంపిక చేయకపోవడంపై క్రికెట్ ప్రియులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ట్విటర్లో బీసీసీఐని ఎండగడుతున్నారు. అటు, రాహుల్ త్రిపాఠిని ఎంపిక చేయకపోవడం నిరాశకు గురి చేస్తోందని హర్భజన్ ట్వీట్ చేయగా.. త్రిపాఠి, సంజూలను సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదని హర్ష భోగ్లే ట్వీటాడు. మరోవైపు.. టీమిండియా మాజీ బ్యాట్స్మన్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కూడా ఈ సెలక్షన్పై పెదవి విరిచాడు. ఐదుగురు ఫాస్ట్బౌలర్లు, నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం బాగానే ఉన్నా.. వారందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యపడుతుందా? అని ప్రశ్నించాడు. దినేశ్పై సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తపరిచాడు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!