Cheteshwar Pujara: టీ20 వరల్డ్కప్ తుది జట్టులో ఆ ఇద్దరూ ఉండాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheteshwar Pujaga Gives His Verdict On Rishabh Pant vs Dinesh Karthik: టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరికి చోటు దక్కితే బాగుంటుందన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో సీనియర్ ఆటగాళ్లు సైతం, ఎవరిని తుది జట్టుకి ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. తాజాగా భారత వెటరన్ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు. వరల్డ్కప్ తుది జట్టులో పంత్, దినేశ్ కార్తిక్ ఇద్దరూ ఉండాలని అన్నాడు. 5, 6, 7వ స్థానాల్లో ఎవర్ని ఎంపిక చేయాలన్న ప్రస్తావన వస్తే.. తాను వరుసగా పంత్, హార్దిక్ పాండ్యా, కార్తీక్కు అవకాశం ఇస్తానన్నాడు. భారత బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారాలన్నాడు. ఇక భారత్ అదనపు బౌలింగ్ ఎంపిక కావాలంటే.. పంత్ స్థానంలో దీపక్ హుడాను ప్లేయింగ్ ఎలెవెల్లోకి తీసుకుంటే బాగుంటుందన్నాడు. ఒకవేళ అతడ్ని తుది జట్టులో ఆడించినట్లైతే, ఐదో స్థానంలో బ్యాటింగ్కి పంపితే బాగా ఆడుతాడని పుజారా చెప్పుకొచ్చాడు.
కాగా.. వరల్డ్కప్ తుది జట్టులో పంత్, దీపక్లలో ఎవరికి చోటిస్తే బాగుంటుందన్న విషయంపై చాలా రోజుల నుంచే చర్చలు జోరుగా సాగుతున్నాయి. వన్డే, టెస్టుల్లో పంత్ అదరగొడుతున్నాడు కానీ.. అదే జోరుని టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. ఆసియా కప్లోనూ ఇతనికి ఆడే అవకాశాలొచ్చినా, తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక దినేశ్ కార్తీక్ విషయానికొస్తే.. మొన్న జరిగిన ఐపీఎల్ నుంచి ఇతను ఫుల్ ఫామ్లో ఉన్నాడు. తనకు అవకాశం లభించినప్పుడల్లా బ్యాట్ను ఝుళపించాడు. కీపర్గానూ అదరగొట్టాడు. కాకపోతే, ఇతనికి ఆసియా కప్లో ఆడేందుకు పెద్దగా అవకాశాలు రాలేదు. అవకాశాలొచ్చినా రిషభ్ పెద్దగా రాణించలేదు కాబట్టి.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నది హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే చెతేశ్వర్ పుజారా పై విధంగా స్పందించాడు. అలాగే.. భువనేశ్వర్ కుమార్ని కూడా టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో తీసుకోవాల్సిందేనని, అతడో టాప్ క్వాలిటీ బౌలర్ అని కితాబిచ్చాడు.
Also Read
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
- India vs Afghanistan: భారత్తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
- Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!