యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుండి భారత జట్టు నిష్క్రమించిన తర్వాత విశ్రాంతి అనే పదం బాగా తెరపైకి వచ్చింది. అది లేకనే భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో సరిగా ప్రదర్శన చేయలేదు అని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై ఆటగాళ్ల ఒత్తిడిని అంచనా వేసి.. ఎవరికి ఎప్పుడు విశ్రాంతి అవసరమో బీసీసీఐనే నిర్ణయించనున్నట్లు… ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమించబోతున్నట్లు సమాచారం. ఆ కమిటీలో భారత కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఒక సభ్యుడిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏ ఆటగాడు ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు, ఎంత కాలం బయో బబుల్లో గడుపుతున్నాడు అనేది చూసి… ప్రతి ఆటగాడికి విశ్రాంతిని ఇచ్చేలా చూడటం ఈ కమిటీ పని అనేది తెలుస్తుంది.