Bangladesh Cricketers: వరల్డ్ కప్లో ఆడాలని కోరుకున్న బంగ్లా క్రికెటర్లు.. కానీ ప్రభుత్వం చెప్పిందే ఫైనల్!
- ఆందోళనకరంగా బంగ్లాదేశ్ క్రికెటర్ల పరిస్థితి..
- భారత్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్న బంగ్లా జట్టు..
- తాత్కాలిక ప్రభుత్వం ఆదేశాలతోనే వరల్డ్ కప్ నుంచి తప్పుకుందన్న బంగ్లా ప్లేయర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Cricketers: బంగ్లాదేశ్ క్రికెటర్ల పరిస్థితి తీవ్రంగా ఆందోళనకరంగా మారింది. బంగ్లా తాతాల్కి క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్తో సమావేశం అనంతరం జట్టు హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు వారి ముఖాల్లో నిస్సహాయత, నిరాశ స్పష్టంగా కనిపించాయి. తమ భవిష్యత్తును ప్రభుత్వం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఇప్పటికే నిర్ణయించేశాయని వారికి అర్థమైపోయినట్లుగా తెలుస్తుంది. తాత్కాలిక ప్రభుత్వం, బీసీబీ చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరుగుతుందనే ఆశ వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఐసీసీ మాత్రం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసే ప్రకటనను ఈరోజు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
Read Also: Champion : ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రోషన్ ‘ఛాంపియన్’..
Also Read
- SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
- SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
అయితే, ఆసిఫ్ నజ్రుల్తో జరిగిన సమావేశంలో తమ అభిప్రాయాలకు గౌరవం ఇస్తారని బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆశించారు. కానీ, ఈ భేటీ పూర్తిగా భిన్నంగా కొనసాగిందని సమాచారం. ఆటగాళ్ల సమ్మతి తీసుకోవడం కోసం కాకుండా, ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని వారికి తెలియజేయడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను భద్రతా కారణాలు చూపుతూ శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. అయితే, సమావేశంలో ఆటగాళ్లకు కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ, వారి అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని తెలుస్తుంది. ఓ సీనియర్ క్రికెటర్ ఆవేదనతో “మనం ఈ వరల్డ్ కప్ ఆడకపోతే నష్టమంతా మన క్రికెట్కే.. ఇది మా భవిష్యత్తుకు పెద్ద దెబ్బ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Read Also: Road Safety Shields: మీరు మీ ఫ్యామిలీ సేఫ్.. రోడ్లపై మరణాలకు చెక్ పెట్టే 5 సేఫ్టీ షీల్డ్స్!
ఇక, మరో ఆటగాడు మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుంది.. మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే పరిస్థితి అక్కడే లేదని ఆరోపించారు. ఇంకొక క్రికెటర్ మాట్లాడుతూ, ఈ సమావేశం తమ సమ్మతి కోసం కాదని, ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని మాకు తెలియజేయడానికే పిలిచారని స్పష్టం చేశాడు. మాతో చర్చించకుండా ముందే ప్లాన్ సిద్ధం చేసుకుని వచ్చారు.. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆదేశమే.. ఇందులో బీసీబీ చేయగలిగింది ఏమీ లేదు అని వెల్లడించారు. కాగా, చాలామంది బంగ్లాదేశ్ క్రికెటర్లు భారత్లోనే టీ20 వరల్డ్ కప్ ఆడాలని కోరుకున్నారని సమాచారం. కానీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయానికి బీసీబీ కూడా మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం బంగ్లాదేశ్ క్రికెట్కు దీర్ఘకాలంలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!