Team India New Jersey: టీమిండియాకు నో స్పాన్సర్.. కొత్త జెర్సీ ఇదే..
- ఆసియా కప్ టోర్నీలో స్పాన్సర్షిప్ లేకుండానే ఆడనున్న టీమిండియా..
- కొత్త స్పాన్సర్ ఎంపిక ప్రక్రియ పూర్తికాకపోవడమే దీనికి ప్రధాన కారణం..
- టోర్నమెంట్లో అన్ని మ్యాచ్ లకు స్పాన్సర్ లేకుండానే ఆడనున్న భారత్ జట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India New Jersey: ఆసియా కప్ టోర్నీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే, ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ప్లేయర్స్ స్పాన్సర్షిప్ లేకుండానే గ్రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ టోర్నమెంట్లో ఆడే భారత జట్టు జెర్సీపై ఎలాంటి ప్రధాన స్పాన్సర్ పేరు కనిపించడం లేదు. కొత్త స్పాన్సర్ ఎంపిక ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తికాకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి. అయితే, బీసీసీఐ ప్రస్తుతం టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం వేట కొనసాగిస్తుంది. ఇందుకోసం ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. కానీ, ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో, ఆసియా కప్ తర్వాతే కొత్త స్పాన్సర్పై తుది నిర్ణయం వెలువడనుంది. అప్లికేషన్స్ సమర్పించడానికి సెప్టెంబర్ 16ను చివరి తేదీగా ఫిక్స్ చేశారు.
Read Also: Charminar : ట్యాంక్బండ్ కు తరలివస్తున్న భారీ గణనాథులు
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
అయితే, బీసీసీఐ ఈసారి జెర్సీ స్పాన్సర్షిప్ ధరలను భారీగా పెంచినట్లు సమాచారం. రాబోయే మూడేళ్లలో ఈ కాంట్రాక్టుల ద్వారా రూ. 400 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీని ప్రకారం, ద్వైపాక్షిక సిరీస్లలో ఒక్కో మ్యాచ్కు రూ. 3.5 కోట్లు, ఐసీసీ లేదా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో మ్యాచ్కు రూ. 1.5 కోట్లుగా ధరను ఫిక్స్ చేసినట్లు టాక్. గతంలో జెర్సీ స్పాన్సర్షిప్ ధరలు వరుసగా రూ. 3.17 కోట్లు, రూ. 1.12 కోట్లుగా ఉన్నాయి. ఇక, ద్వైపాక్షిక సిరీస్లకు, ఐసీసీ టోర్నీలకు ధరలో తేడా ఉండటానికి ప్రధాన కారణం ఉంది. ద్వైపాక్షిక మ్యాచ్లలో స్పాన్సర్ పేరు జెర్సీ ముందు భాగంలో క్లియర్ గా కనిపిస్తుంది. కానీ, ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచ కప్ లాంటి టోర్నీలలో స్పాన్సర్ పేరును అలా ప్రదర్శించడానికి అవకాశం లేదు. అందుకే ఆ మ్యాచ్లకు తక్కు ధరను నిర్ణయించారు.
Read Also: Vizag: ఇన్స్టాగ్రామ్లో యువతి పోస్ట్ చేసిన ఫోటో మార్పింగ్ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే…
ఇక, కొత్త స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ మరికొన్ని కఠిన రూల్స్ విధించింది. బిడ్డింగ్లో పాల్గొనే కంపెనీలకు బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్తో ఎలాంటి సంబంధం ఉండొద్దని తేల్చి చెప్పింది. అలాగే, సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం కానున్న ఆసియా కప్లో భారత్ తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడబోతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14వ తేదీన పాకిస్థాన్తో, సెప్టెంబర్ 19న ఒమన్తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్లన్నికి టీమిండియా స్పాన్సర్ లోగో లేకుండానే బరిలోకి దిగుతుంది.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!