Work From Home: ఇన్ఫోసిస్కి ఇష్టం.. టీసీఎస్కి కష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Work From Home: ఐటీ రంగంలో అగ్రగామి సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు ఇన్ఫోసిస్ కొత్త సంవత్సరంలో తమ ఉద్యోగులకు సరికొత్త ఆఫర్ ప్రకటించాయి. అయితే.. ఆ ఆఫర్.. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఆమోదయోగ్యం అనిపిస్తుండగా టీసీఎస్ ఉద్యోగులకు మాత్రం హార్డ్గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగులు వర్క్ ఫ్రం ఆఫీస్ చేయాల్సిందేనని టీసీఎస్ కంపెనీ తేల్చిచెబుతుండగా.. వర్క్ ఫ్రం హోం అయినా పర్లేదంటూ ఇన్ఫోసిస్ అనుమతిస్తోంది. ఇన్ఫోసిస్కి ఇండియాలో దాదాపు 45 వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు కంపల్సరీగా వర్క్ ప్లేస్కి వచ్చి రిపోర్ట్ చేయాల్సిన పనిలేదని ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ పేర్కొన్నారు.
Also Read
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
Telangana Government: హైదరాబాద్లో మోడ్రన్ హాస్పిటల్స్ నిర్మాణ కాంట్రాక్టులు
వర్కర్లు ఆఫీసుకు ఆన్ టైమ్ రావాల్సిందేనని టీసీఎస్ సంస్థ.. రెండో మాటే లేదన్నట్లుగా.. నిక్కచ్చిగా చెబుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ మాత్రం తమ ఉద్యోగులకు ఇలాంటి కండిషన్లేమీ లేవనే అర్థం వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యానించటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సుదూర ప్రాంతాల్లో ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ తక్షణం ఆ పని విధానానికి స్వస్తి చెప్పాలని టీసీఎస్ స్పష్టంగా చెబుతోంది. అనారోగ్యంతో బాధపడేవాళ్లు.. ఫిట్నెస్ విషయంలో అనీజీగా అనిపించేవాళ్లు డాక్టర్ సర్టిఫికెట్లను సమర్పించాలని, వాటిని కంపెనీ మెడికల్ బోర్డ్ చెక్ చేసి తగిన నిర్ణయం తీసుకుంటుందని టీసీఎస్ వివరించింది.
కంపెనీ మెడికల్ బోర్డు ఓకే అంటే ఆయా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయటానికి అభ్యంతరం లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తెలిపింది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో వరదలొచ్చిన సమయంలో వర్క్ ఫ్రం హోం అనే అంశంపై ఐటీ దిగ్గజ సంస్థలు ఇలా భిన్నాభిప్రాయలను వ్యక్తం చేయటం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలాఉండగా.. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసినా తమకు సమ్మతమేనని చెప్పిన ఇన్ఫోసిస్.. మూన్ లైటింగ్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తుండటం గమనించాల్సిన విషయం. మూన్ లైటింగ్ సరికాదంటూ విమర్శించిన ఈ కంపెనీ.. ఏక కాలంలో ఒకటికి మించి బాధ్యతల్లో తలమునకలైన ఉద్యోగులను గతేడాది కొలువుల నుంచి తీసేసిన సంగతి తెలిసిందే.
అయితే.. మూన్ లైటింగ్ మరియు వర్క్ ఫ్రం హోం.. ఈ రెండింటి వల్ల కలిగే లాభనష్టాల మీద జరుగుతున్న చర్చ మధ్యలో ఉండగానే ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకోవటం చెప్పుకోదగిందే. బెంగళూరులోని ఐటీ హబ్ మొత్తం వరదల్లో చిక్కుకోవటంతో రవాణా వ్యవస్థ స్థంభించింది. అందుకే ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రం హోంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉద్యోగుల మనసు గెలుచుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. అసలు.. ఐటీ కంపెనీలకు అత్యుత్తమ వర్క్ ఫ్రం హోం పాలసీ ఏదీ అనే ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలేమో అని విశ్లేషకులు అంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!