Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titanic Life Jacket: ఎప్పటికీ మునిగిపోదని అందరూ భావించిన ‘టైటానిక్’ నౌక.. 114 ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొని సముద్ర గర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒక అదృష్టవంతురాలు ధరించిన ‘లైఫ్ జాకెట్’ తాజాగా జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. బ్రిటన్కు చెందిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ అనే వేలం సంస్థ నిర్వహించిన ఈ ఆక్షన్లో, ఈ లైఫ్ జాకెట్ 6,70,000 పౌండ్లు (సుమారు రూ.8 కోట్ల పైమాటే) పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంచనాలను మించిన ధర..
ముందుగా ఈ జాకెట్ ధర 2,50,000 పౌండ్ల నుంచి 3,50,000 పౌండ్ల మధ్య ఉంటుందని భావించారు. కానీ వేలంలో దీనికి అనూహ్య స్పందన లభించింది. టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడి, ఇప్పటికీ సురక్షితంగా ఉన్న ఏకైక లైఫ్ జాకెట్ ఇదే కావడం విశేషం. అందుకే దీనిని ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ సేల్’ (తరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం) గా వేలం సంస్థ పేర్కొంది. ఈ లైఫ్ జాకెట్ను లారా మేబెల్ ఫ్రాంకాటెల్లి అనే మహిళా ప్రయాణికురాలు ధరించారు. ఆమె ఆ రోజుల్లో టైటానిక్ నౌకలో ఫస్ట్ క్లాస్లో ప్రయాణిస్తున్నారు. ఆమె ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ లూసీ డఫ్ గోర్డాన్ వద్ద సెక్రటరీగా పనిచేసేవారు. ప్రమాద సమయంలో లారా తన బాస్ దంపతులతో కలిసి ‘లైఫ్ బోట్ నంబర్ 1’ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు.
Also Read
- Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
- Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
- Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ 'సీక్రెట్స్' పాటించాల్సిందే!
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
జాకెట్ ప్రత్యేకతలివే..
బేజ్ రంగులో ఉన్న ఈ లైఫ్ జాకెట్పై లారాతో పాటు ఆ రోజు ఆమెతో కలిసి ప్రాణాలతో బయటపడిన ఇతరుల సంతకాలు కూడా ఉన్నాయి. దీనిని కాన్వాస్ క్లాత్తో చేసిన 12 పాకెట్లలో కార్క్ (చెక్క ముక్కల వంటివి) నింపి తయారు చేశారు. గతంలో దీనిని టైటానిక్ మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచారు. తాజాగా ఒక ప్రైవేట్ కలెక్టర్ దీనిని కొనుగోలు చేశారు. వేలం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రూ ఆల్డ్రిడ్జ్ మాట్లాడుతూ.. “టైటానిక్ మీద 2,200 మంది ప్రయాణికులు ఉంటే, అందులో ప్రతి ఒక్కరిదీ ఒక కథ. ఈ వస్తువుల ద్వారా మేము ఆ కథలను మళ్లీ ప్రపంచానికి గుర్తు చేస్తున్నాము. టైటానిక్ చరిత్రలో ఈ లైఫ్ జాకెట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన వస్తువు” అని తెలిపారు. 1912 ఏప్రిల్ 10న ప్రయాణం మొదలుపెట్టిన టైటానిక్, కేవలం నాలుగు రోజులకే (ఏప్రిల్ 14 రాత్రి) మంచుకొండను ఢీకొంది. ఆ ప్రమాదంలో సుమారు 2,220 మందిలో కేవలం 700 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారు సముద్రంలో ప్రాణాలు విడిచారు.
తాజావార్తలు
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!