Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titanic Life Jacket: ఎప్పటికీ మునిగిపోదని అందరూ భావించిన ‘టైటానిక్’ నౌక.. 114 ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొని సముద్ర గర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒక అదృష్టవంతురాలు ధరించిన ‘లైఫ్ జాకెట్’ తాజాగా జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. బ్రిటన్కు చెందిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ అనే వేలం సంస్థ నిర్వహించిన ఈ ఆక్షన్లో, ఈ లైఫ్ జాకెట్ 6,70,000 పౌండ్లు (సుమారు రూ.8 కోట్ల పైమాటే) పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంచనాలను మించిన ధర..
ముందుగా ఈ జాకెట్ ధర 2,50,000 పౌండ్ల నుంచి 3,50,000 పౌండ్ల మధ్య ఉంటుందని భావించారు. కానీ వేలంలో దీనికి అనూహ్య స్పందన లభించింది. టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడి, ఇప్పటికీ సురక్షితంగా ఉన్న ఏకైక లైఫ్ జాకెట్ ఇదే కావడం విశేషం. అందుకే దీనిని ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ సేల్’ (తరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం) గా వేలం సంస్థ పేర్కొంది. ఈ లైఫ్ జాకెట్ను లారా మేబెల్ ఫ్రాంకాటెల్లి అనే మహిళా ప్రయాణికురాలు ధరించారు. ఆమె ఆ రోజుల్లో టైటానిక్ నౌకలో ఫస్ట్ క్లాస్లో ప్రయాణిస్తున్నారు. ఆమె ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ లూసీ డఫ్ గోర్డాన్ వద్ద సెక్రటరీగా పనిచేసేవారు. ప్రమాద సమయంలో లారా తన బాస్ దంపతులతో కలిసి ‘లైఫ్ బోట్ నంబర్ 1’ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు.
Also Read
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
- Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
- Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
జాకెట్ ప్రత్యేకతలివే..
బేజ్ రంగులో ఉన్న ఈ లైఫ్ జాకెట్పై లారాతో పాటు ఆ రోజు ఆమెతో కలిసి ప్రాణాలతో బయటపడిన ఇతరుల సంతకాలు కూడా ఉన్నాయి. దీనిని కాన్వాస్ క్లాత్తో చేసిన 12 పాకెట్లలో కార్క్ (చెక్క ముక్కల వంటివి) నింపి తయారు చేశారు. గతంలో దీనిని టైటానిక్ మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచారు. తాజాగా ఒక ప్రైవేట్ కలెక్టర్ దీనిని కొనుగోలు చేశారు. వేలం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రూ ఆల్డ్రిడ్జ్ మాట్లాడుతూ.. “టైటానిక్ మీద 2,200 మంది ప్రయాణికులు ఉంటే, అందులో ప్రతి ఒక్కరిదీ ఒక కథ. ఈ వస్తువుల ద్వారా మేము ఆ కథలను మళ్లీ ప్రపంచానికి గుర్తు చేస్తున్నాము. టైటానిక్ చరిత్రలో ఈ లైఫ్ జాకెట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన వస్తువు” అని తెలిపారు. 1912 ఏప్రిల్ 10న ప్రయాణం మొదలుపెట్టిన టైటానిక్, కేవలం నాలుగు రోజులకే (ఏప్రిల్ 14 రాత్రి) మంచుకొండను ఢీకొంది. ఆ ప్రమాదంలో సుమారు 2,220 మందిలో కేవలం 700 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారు సముద్రంలో ప్రాణాలు విడిచారు.
తాజావార్తలు
-
Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!