SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SuperShe Island: ప్రపంచంలో కేవలం మహిళలు మాత్రమే నివసించగల ఒక ప్రదేశం ఉందంటే నమ్ముతారా.. నమ్మాల్సిందే ఎందుకంటే అలాంటి ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది. అక్కడ కేవలం స్త్రీలు మాత్రమే నివసిస్తారు. ఈ ప్రదేశంలో పురుషులు అడుగు కూడా పెట్టలేరు. ఇంతకీ ఆ ప్రత్యేక ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా.. ఫిన్లాండ్కు సమీపంలో బాల్టిక్ సముద్రంలో ఉంది. నిజానికి ఇక్కడ ఒక అద్భుతమైన సూపర్ షీ ఐలాండ్ దాగి ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన ఏకాంత ప్రదేశాలలో ఒకటిగా ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది.
ఇది ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ద్వీపం. ఇక్కడ పురుషులకు ప్రవేశం లేదు. ఈ ప్రత్యేకమైన 8.4 ఎకరాల ద్వీపాన్ని కేవలం మహిళల కోసం మాత్రమే ఒక విలాసవంతమైన వెల్నెస్ రిట్రీట్గా ఏర్పాటు చేశారు. ఇది స్త్రీలకు విశ్రాంతి తీసుకోవడానికి, రీప్రెష్ కావడానికి, తమతో తాము ఏకాంతంగా గడపటానికి సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. దీనిని 2017లో క్రిస్టినా రోత్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. సూపర్ షీ అధికారిక వెబ్సైట్ నివేదికల ప్రకారం.. ఈ ఐలాండ్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఇదొక ఉద్యమం. మహిళల కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని సృష్టించాలనే నిర్ణయం, స్పృహతో ఏర్పాటు చేసిందే ఈ సూపర్ షీ ఐలాండ్. ఈ ప్రత్యేక స్థలంలో మహిళలు వారి ఒత్తిళ్లను పోగొట్టుకొని, తమతో తాము ఏకాంతంగా ఉండేందుకు అనేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
Also Read
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
మహిళలకు మాత్రమే ఎందుకంటే..
నిజానికి ఈ ఐలాండ్ అనేది కేవలం మహిళకు మాత్రమే ఎందుకు.. సరిగ్గా ఈ ప్రశ్నే.. ఈ ప్రదేశాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా నిలుపుతుంది. నిజానికి ఈ ద్వీపం ఇతర పర్యాటక ప్రదేశాల కన్నా భిన్నమైనది. ఇక్కడ కేవలం ఒక స్థలాన్ని బుక్ చేసుకొని సందర్శించడం కుదరదు. ఈ ద్వీపంలో పర్యటించాలనుకునే మహిళలు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి, ఎంపికైన తర్వాత మాత్రమే వారు ఇక్కడ బస చేయగలరు. ఈ కారణంగా ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ప్రయాణ అనుభవాలలో ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి విడిదిలో ఒకేసారి కేవలం 10 మంది మహిళలకు మాత్రమే వసతి కల్పిస్తారు. ఈ ద్వీపంలో యోగా, ధ్యానం, స్వచ్ఛమైన దృశ్యాల మధ్య హైకింగ్, బాల్టిక్ సముద్రంలో కయాకింగ్, వెల్నెస్ వర్క్షాప్లు, వంట తరగతులు, డిజిటల్ డిటాక్స్, మైండ్ఫుల్నెస్ సెషన్ల వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. రోత్ ఈ ద్వీపం యాజమాన్యాన్ని పొందినప్పుడు, నిర్మాణ కార్మికులను మాత్రమే దీనిలోకి అనుమతించారు. ఈ ద్వీపం కేవలం ఒక విలాసవంతమైన విహార ప్రదేశం మాత్రమే కాదని, హెల్తీ టూరిజం, చైతన్యవంతమైన జీవనంపై పెరుగుతున్న ప్రపంచ దృష్టిని ప్రతిబింబించే ప్రస్తుత సాంస్కృతిక ధోరణిలో ఇది కూడా ఒక భాగం అని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!