SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SuperShe Island: ప్రపంచంలో కేవలం మహిళలు మాత్రమే నివసించగల ఒక ప్రదేశం ఉందంటే నమ్ముతారా.. నమ్మాల్సిందే ఎందుకంటే అలాంటి ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది. అక్కడ కేవలం స్త్రీలు మాత్రమే నివసిస్తారు. ఈ ప్రదేశంలో పురుషులు అడుగు కూడా పెట్టలేరు. ఇంతకీ ఆ ప్రత్యేక ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా.. ఫిన్లాండ్కు సమీపంలో బాల్టిక్ సముద్రంలో ఉంది. నిజానికి ఇక్కడ ఒక అద్భుతమైన సూపర్ షీ ఐలాండ్ దాగి ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన ఏకాంత ప్రదేశాలలో ఒకటిగా ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది.
ఇది ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ద్వీపం. ఇక్కడ పురుషులకు ప్రవేశం లేదు. ఈ ప్రత్యేకమైన 8.4 ఎకరాల ద్వీపాన్ని కేవలం మహిళల కోసం మాత్రమే ఒక విలాసవంతమైన వెల్నెస్ రిట్రీట్గా ఏర్పాటు చేశారు. ఇది స్త్రీలకు విశ్రాంతి తీసుకోవడానికి, రీప్రెష్ కావడానికి, తమతో తాము ఏకాంతంగా గడపటానికి సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. దీనిని 2017లో క్రిస్టినా రోత్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. సూపర్ షీ అధికారిక వెబ్సైట్ నివేదికల ప్రకారం.. ఈ ఐలాండ్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఇదొక ఉద్యమం. మహిళల కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని సృష్టించాలనే నిర్ణయం, స్పృహతో ఏర్పాటు చేసిందే ఈ సూపర్ షీ ఐలాండ్. ఈ ప్రత్యేక స్థలంలో మహిళలు వారి ఒత్తిళ్లను పోగొట్టుకొని, తమతో తాము ఏకాంతంగా ఉండేందుకు అనేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
Also Read
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
- Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
మహిళలకు మాత్రమే ఎందుకంటే..
నిజానికి ఈ ఐలాండ్ అనేది కేవలం మహిళకు మాత్రమే ఎందుకు.. సరిగ్గా ఈ ప్రశ్నే.. ఈ ప్రదేశాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా నిలుపుతుంది. నిజానికి ఈ ద్వీపం ఇతర పర్యాటక ప్రదేశాల కన్నా భిన్నమైనది. ఇక్కడ కేవలం ఒక స్థలాన్ని బుక్ చేసుకొని సందర్శించడం కుదరదు. ఈ ద్వీపంలో పర్యటించాలనుకునే మహిళలు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి, ఎంపికైన తర్వాత మాత్రమే వారు ఇక్కడ బస చేయగలరు. ఈ కారణంగా ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ప్రయాణ అనుభవాలలో ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి విడిదిలో ఒకేసారి కేవలం 10 మంది మహిళలకు మాత్రమే వసతి కల్పిస్తారు. ఈ ద్వీపంలో యోగా, ధ్యానం, స్వచ్ఛమైన దృశ్యాల మధ్య హైకింగ్, బాల్టిక్ సముద్రంలో కయాకింగ్, వెల్నెస్ వర్క్షాప్లు, వంట తరగతులు, డిజిటల్ డిటాక్స్, మైండ్ఫుల్నెస్ సెషన్ల వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. రోత్ ఈ ద్వీపం యాజమాన్యాన్ని పొందినప్పుడు, నిర్మాణ కార్మికులను మాత్రమే దీనిలోకి అనుమతించారు. ఈ ద్వీపం కేవలం ఒక విలాసవంతమైన విహార ప్రదేశం మాత్రమే కాదని, హెల్తీ టూరిజం, చైతన్యవంతమైన జీవనంపై పెరుగుతున్న ప్రపంచ దృష్టిని ప్రతిబింబించే ప్రస్తుత సాంస్కృతిక ధోరణిలో ఇది కూడా ఒక భాగం అని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!