Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money as Prasad: సాధారణంగా మనం దేవాలయానికి వెళ్తే తీర్థప్రసాదాలుగా లడ్డూలు, పులిహోర లేదా పండ్లు ఇస్తారు. కానీ మన దేశంలోనే కొన్ని ఆలయాల్లో మాత్రం ప్రసాదానికి బదులుగా డబ్బులు ఇస్తారు. ఇది నిజమే.. ఇక్కడికి వచ్చే భక్తులకు కరెన్సీ నోట్లు, బంగారు నగలను ప్రసాదంగా అందిస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. తమిళనాడులోని వరుసైన ‘కరుప్పసామి’ ఆలయం, మధ్యప్రదేశ్లోని ‘మహాలక్ష్మి’ ఆలయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా.. ఈ ఆలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం ఇవ్వడమే కారణం. ఈ ఆలయాల విశిష్టత ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
తమిళనాడు: కోరిన కోర్కెలు తీర్చి.. డబ్బులు ఇచ్చే కరుప్పసామి
తమిళనాడులోని తేని జిల్లా, కడమలైకుండు సమీపంలోని కొండ ప్రాంతంలో ఉంది కరుప్పసామి ఆలయం. ఇక్కడి ప్రధాన దైవం ‘పద్దెనిమిదో మెట్టు’ రక్షకుడైన కరుప్పసామి. కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యే వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే న్యాయం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలో ఈ ఆలయం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడానికి ప్రధాన కారణం ‘నగదు ప్రసాదం’ పంపిణీ. అవును.. ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా మిఠాయిలకు బదులుగా కరెన్సీ నోట్లను ఇస్తారు. భక్తుల కష్టాలను తీర్చి, వారికి తిరిగి ఆర్థిక అండగా నిలవడమే దేవుని సంకల్పమని ఇక్కడి పూజారులు చెబుతుంటారు.
Also Read
- Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ 'సీక్రెట్స్' పాటించాల్సిందే!
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
రత్లాం (మధ్యప్రదేశ్): రూ.100 కోట్ల అలంకరణలో మహాలక్ష్మి
మధ్యప్రదేశ్లోని రత్లాం నగరంలోని మానక్ చౌక్ వద్ద ఉన్న మహాలక్ష్మి ఆలయం సిరిసంపదలకు నిలయం. ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం, దీపావళి సమయంలో మాత్రం ఒక అద్భుత లోకంలా మారుతుంది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు జరిగే దీపావళి వేడుకల్లో భాగంగా, ఈ ఆలయ గర్భాలయాన్ని భక్తులు సమర్పించిన నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాలతో అలంకరిస్తారు. ఈ అలంకరణ విలువ అక్షరాలా రూ.100 కోట్లు దాటుతుందని అంచనా. పూర్వం రత్లాం మహారాజు రతన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. దీపావళి సమయంలో భక్తులు తమ నగదును, నగలను ఇక్కడ అమ్మవారి చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారి సంపద రెట్టింపు అవుతుందని భక్తుల విశ్వాసం. ఈ వేడుకలు ముగిసిన తర్వాత, భక్తులు సమర్పించిన వాటిని తిరిగి వారికే అప్పగిస్తారు. దీంతో పాటు భక్తులకు కరెన్సీ నోట్లు, నాణేలను ప్రసాదంగా పంచుతారు. మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ రెండు ఆలయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
-
Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్న్యూస్..ఇండియాలో వర్షాలు..!
-
Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
-
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!