Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money as Prasad: సాధారణంగా మనం దేవాలయానికి వెళ్తే తీర్థప్రసాదాలుగా లడ్డూలు, పులిహోర లేదా పండ్లు ఇస్తారు. కానీ మన దేశంలోనే కొన్ని ఆలయాల్లో మాత్రం ప్రసాదానికి బదులుగా డబ్బులు ఇస్తారు. ఇది నిజమే.. ఇక్కడికి వచ్చే భక్తులకు కరెన్సీ నోట్లు, బంగారు నగలను ప్రసాదంగా అందిస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. తమిళనాడులోని వరుసైన ‘కరుప్పసామి’ ఆలయం, మధ్యప్రదేశ్లోని ‘మహాలక్ష్మి’ ఆలయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా.. ఈ ఆలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం ఇవ్వడమే కారణం. ఈ ఆలయాల విశిష్టత ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
తమిళనాడు: కోరిన కోర్కెలు తీర్చి.. డబ్బులు ఇచ్చే కరుప్పసామి
తమిళనాడులోని తేని జిల్లా, కడమలైకుండు సమీపంలోని కొండ ప్రాంతంలో ఉంది కరుప్పసామి ఆలయం. ఇక్కడి ప్రధాన దైవం ‘పద్దెనిమిదో మెట్టు’ రక్షకుడైన కరుప్పసామి. కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యే వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే న్యాయం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలో ఈ ఆలయం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడానికి ప్రధాన కారణం ‘నగదు ప్రసాదం’ పంపిణీ. అవును.. ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా మిఠాయిలకు బదులుగా కరెన్సీ నోట్లను ఇస్తారు. భక్తుల కష్టాలను తీర్చి, వారికి తిరిగి ఆర్థిక అండగా నిలవడమే దేవుని సంకల్పమని ఇక్కడి పూజారులు చెబుతుంటారు.
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
రత్లాం (మధ్యప్రదేశ్): రూ.100 కోట్ల అలంకరణలో మహాలక్ష్మి
మధ్యప్రదేశ్లోని రత్లాం నగరంలోని మానక్ చౌక్ వద్ద ఉన్న మహాలక్ష్మి ఆలయం సిరిసంపదలకు నిలయం. ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం, దీపావళి సమయంలో మాత్రం ఒక అద్భుత లోకంలా మారుతుంది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు జరిగే దీపావళి వేడుకల్లో భాగంగా, ఈ ఆలయ గర్భాలయాన్ని భక్తులు సమర్పించిన నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాలతో అలంకరిస్తారు. ఈ అలంకరణ విలువ అక్షరాలా రూ.100 కోట్లు దాటుతుందని అంచనా. పూర్వం రత్లాం మహారాజు రతన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. దీపావళి సమయంలో భక్తులు తమ నగదును, నగలను ఇక్కడ అమ్మవారి చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారి సంపద రెట్టింపు అవుతుందని భక్తుల విశ్వాసం. ఈ వేడుకలు ముగిసిన తర్వాత, భక్తులు సమర్పించిన వాటిని తిరిగి వారికే అప్పగిస్తారు. దీంతో పాటు భక్తులకు కరెన్సీ నోట్లు, నాణేలను ప్రసాదంగా పంచుతారు. మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ రెండు ఆలయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!