Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money as Prasad: సాధారణంగా మనం దేవాలయానికి వెళ్తే తీర్థప్రసాదాలుగా లడ్డూలు, పులిహోర లేదా పండ్లు ఇస్తారు. కానీ మన దేశంలోనే కొన్ని ఆలయాల్లో మాత్రం ప్రసాదానికి బదులుగా డబ్బులు ఇస్తారు. ఇది నిజమే.. ఇక్కడికి వచ్చే భక్తులకు కరెన్సీ నోట్లు, బంగారు నగలను ప్రసాదంగా అందిస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. తమిళనాడులోని వరుసైన ‘కరుప్పసామి’ ఆలయం, మధ్యప్రదేశ్లోని ‘మహాలక్ష్మి’ ఆలయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా.. ఈ ఆలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం ఇవ్వడమే కారణం. ఈ ఆలయాల విశిష్టత ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
తమిళనాడు: కోరిన కోర్కెలు తీర్చి.. డబ్బులు ఇచ్చే కరుప్పసామి
తమిళనాడులోని తేని జిల్లా, కడమలైకుండు సమీపంలోని కొండ ప్రాంతంలో ఉంది కరుప్పసామి ఆలయం. ఇక్కడి ప్రధాన దైవం ‘పద్దెనిమిదో మెట్టు’ రక్షకుడైన కరుప్పసామి. కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యే వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే న్యాయం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలో ఈ ఆలయం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడానికి ప్రధాన కారణం ‘నగదు ప్రసాదం’ పంపిణీ. అవును.. ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా మిఠాయిలకు బదులుగా కరెన్సీ నోట్లను ఇస్తారు. భక్తుల కష్టాలను తీర్చి, వారికి తిరిగి ఆర్థిక అండగా నిలవడమే దేవుని సంకల్పమని ఇక్కడి పూజారులు చెబుతుంటారు.
Also Read
- Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
- Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
- Sky Burial: విచిత్రమైన అంత్యక్రియలు.. ఆ దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న భయంకరమైన సంప్రదాయం!
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
రత్లాం (మధ్యప్రదేశ్): రూ.100 కోట్ల అలంకరణలో మహాలక్ష్మి
మధ్యప్రదేశ్లోని రత్లాం నగరంలోని మానక్ చౌక్ వద్ద ఉన్న మహాలక్ష్మి ఆలయం సిరిసంపదలకు నిలయం. ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం, దీపావళి సమయంలో మాత్రం ఒక అద్భుత లోకంలా మారుతుంది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు జరిగే దీపావళి వేడుకల్లో భాగంగా, ఈ ఆలయ గర్భాలయాన్ని భక్తులు సమర్పించిన నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాలతో అలంకరిస్తారు. ఈ అలంకరణ విలువ అక్షరాలా రూ.100 కోట్లు దాటుతుందని అంచనా. పూర్వం రత్లాం మహారాజు రతన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. దీపావళి సమయంలో భక్తులు తమ నగదును, నగలను ఇక్కడ అమ్మవారి చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారి సంపద రెట్టింపు అవుతుందని భక్తుల విశ్వాసం. ఈ వేడుకలు ముగిసిన తర్వాత, భక్తులు సమర్పించిన వాటిని తిరిగి వారికే అప్పగిస్తారు. దీంతో పాటు భక్తులకు కరెన్సీ నోట్లు, నాణేలను ప్రసాదంగా పంచుతారు. మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ రెండు ఆలయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!