Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money as Prasad: సాధారణంగా మనం దేవాలయానికి వెళ్తే తీర్థప్రసాదాలుగా లడ్డూలు, పులిహోర లేదా పండ్లు ఇస్తారు. కానీ మన దేశంలోనే కొన్ని ఆలయాల్లో మాత్రం ప్రసాదానికి బదులుగా డబ్బులు ఇస్తారు. ఇది నిజమే.. ఇక్కడికి వచ్చే భక్తులకు కరెన్సీ నోట్లు, బంగారు నగలను ప్రసాదంగా అందిస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. తమిళనాడులోని వరుసైన ‘కరుప్పసామి’ ఆలయం, మధ్యప్రదేశ్లోని ‘మహాలక్ష్మి’ ఆలయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా.. ఈ ఆలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం ఇవ్వడమే కారణం. ఈ ఆలయాల విశిష్టత ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
తమిళనాడు: కోరిన కోర్కెలు తీర్చి.. డబ్బులు ఇచ్చే కరుప్పసామి
తమిళనాడులోని తేని జిల్లా, కడమలైకుండు సమీపంలోని కొండ ప్రాంతంలో ఉంది కరుప్పసామి ఆలయం. ఇక్కడి ప్రధాన దైవం ‘పద్దెనిమిదో మెట్టు’ రక్షకుడైన కరుప్పసామి. కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యే వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే న్యాయం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలో ఈ ఆలయం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడానికి ప్రధాన కారణం ‘నగదు ప్రసాదం’ పంపిణీ. అవును.. ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా మిఠాయిలకు బదులుగా కరెన్సీ నోట్లను ఇస్తారు. భక్తుల కష్టాలను తీర్చి, వారికి తిరిగి ఆర్థిక అండగా నిలవడమే దేవుని సంకల్పమని ఇక్కడి పూజారులు చెబుతుంటారు.
Also Read
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
- Meaning of Life: ఎందుకు పుట్టాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవితానికి అసలు అర్థం ఇదేనా?
- SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
రత్లాం (మధ్యప్రదేశ్): రూ.100 కోట్ల అలంకరణలో మహాలక్ష్మి
మధ్యప్రదేశ్లోని రత్లాం నగరంలోని మానక్ చౌక్ వద్ద ఉన్న మహాలక్ష్మి ఆలయం సిరిసంపదలకు నిలయం. ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం, దీపావళి సమయంలో మాత్రం ఒక అద్భుత లోకంలా మారుతుంది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు జరిగే దీపావళి వేడుకల్లో భాగంగా, ఈ ఆలయ గర్భాలయాన్ని భక్తులు సమర్పించిన నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాలతో అలంకరిస్తారు. ఈ అలంకరణ విలువ అక్షరాలా రూ.100 కోట్లు దాటుతుందని అంచనా. పూర్వం రత్లాం మహారాజు రతన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. దీపావళి సమయంలో భక్తులు తమ నగదును, నగలను ఇక్కడ అమ్మవారి చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారి సంపద రెట్టింపు అవుతుందని భక్తుల విశ్వాసం. ఈ వేడుకలు ముగిసిన తర్వాత, భక్తులు సమర్పించిన వాటిని తిరిగి వారికే అప్పగిస్తారు. దీంతో పాటు భక్తులకు కరెన్సీ నోట్లు, నాణేలను ప్రసాదంగా పంచుతారు. మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ రెండు ఆలయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!