Dussehra: దసరా స్పెషల్.. అమ్మవారి గొప్పదనం తప్పక తెలుసుకోవాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dussehra: ఈ సృష్టిని నడిపిస్తున్నది త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను కన్న మూర్తి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి. ప్రేమను పంచడంలో అమ్మ, తప్పును సరిద్దిద్దడంలో గురువు, ఈ సృష్టిని కనుసైగలతో శాసించగల ఆదిపరాశక్తికి తారతమ్యాలు లేవు. అందరిని ఒకే తీరుగా చూస్తుంది. అమ్మకి ఆగ్రహం అనుకుంటున్నారు చాలంది. కానీ బిడ్డలను అనుగ్రహించడం వాళ్ళకి అనురాగం పంచడం మాత్రమే తెలుసు ఆ మహాశక్తికి. అందుకే జగజనని అంటారు ఆ తల్లిని. అంటే ఈ జగత్తు అంతటికి అమ్మ ఆదిపరాశక్తి. ఆమె ఈ విశ్వంలోని ప్రతి జీవిని తన బిడ్డగానే చూస్తుంది, అమ్మకి పక్షపాతం ఉండదు. అనడానికి ఈ కథనే ఉదాహరణ. పూర్వం భోజ మహారాజు ఆస్థానంలో దండి, భవభూతి, కాళిదాసు అనే ముగ్గురు దిగ్గజ కవులు ఉండేవారు. ఆ ముగ్గురు కవులు పాడిత్యంలో ఒకరిని మించిన వారు ఇంకొకరు. అయితే ఒకనాడు భోజ మహారాజుకు వారిలో ఎవర్ని ‘మహాకవి’ అని సంబోధించాలి? అనే సందేహం కలిగింది.
Read also:Skanda : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ రిలీజ్ కాబోతున్న స్కంద…?
Also Read
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
- Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
ఈ చిక్కు ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు. ఈ ముగ్గురు పాండిత్యాన్ని పరీక్షించి బేరీజు వేయగల ఉద్దండులు ఎవరు లేరు. కనుక ఈ సందేహాన్ని ఆ ఉజ్జయినీ మహంకాళినే తీర్చాలి అని ఆ తల్లి పైనే భాధ్యతను ఉంచాడు. ఆ తల్లినే నా సందేహాన్ని నివృతి చెయ్యాలని ముగ్గురినీ వెంటబెట్టుకుని ఆలయానికి వెళ్లాడు. తన సందేహాన్ని మూల మూర్తికి నివేదించాడు. కొద్దిసేపటికి ‘కవిర్దండి’ అనే పలుకులు వినిపించాయి. నిజమే, కవి అంటే.. దండే! అనంతరం ‘భవభూతిస్తు పండితః’.. పాండిత్యమంటే భవభూతిదే అనే పలుకూ వెలువడింది. అయితే తన గురించి ఎం చెప్పలేదని కాళిదాసుకు కోపం కట్టలు తెంచుకుంది. పట్టరాని ఆవేశంతో భరించలేని వేదన దుఃఖంగా మారగా వస్తున్న ఏడుపును ఆపుకోవడం వల్ల స్వరం దగ్ధంగా మారింది. అయిన తీవ్ర స్వరంతో మరి మరి నేనెవర్నే? అని ఆ తల్లిని నిలదీసాడు.
Read also:Cyclone Tej: పెరగనున్న తేజ్ తుఫాను తీవ్రత.. ఈ రాష్ట్రానికి ముప్పు
మాట్లాడితే అమ్మ వారి మీద లాలాజలం తుంపర్లు ఎక్కడ పడతాయో అని ఆ గంగా జనుకుడు సైతం చేయి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అమ్మతో మాట్లాడడానికి అందరూ భయపడతారు. కానీ కాళిదాసు అమ్మని ఏకవచనమ్ తో పిలిచినా అమ్మ శాంత మూర్తి కనుక బిడ్డ తప్పుగా మాట్లాడిన ఓర్పుగా.. నువ్వే నేను నేనే నువ్వు ఇందులో నీకు ఎలాంటి సందేహం వద్దు అని ఒక్క మాటలో సమాధానం ఇచ్చింది. ‘నీ అక్షరం.. బీజాక్షరం’ అని చెప్పకనే చెప్పింది. ఆ మాటకు కాళిదాసు హృదయం ద్రవించింది. కన్నీళ్లతో ఆ తల్లి పాదాల పైన పాడ్డారు. ఎదుటి మనిషి చేసిన తప్పును తప్పు అని నొప్పించకుండా చెప్పే శక్తి ఒక ప్రేమకే ఉంది. ఆ ప్రేమకి నిదర్శనం ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ ఆదిపరాశక్తి. ఆర్తి తో అమ్మ అంటే చాలు పలుకుతుంది ఆ పరమేశ్వరి.
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!