Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’ ద్వారా మానవాళికి ఎన్నో అద్భుతమైన సూత్రాలను అందించారు. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడటం మాత్రమే కాదు, మన ప్రవర్తన, మాటతీరు కూడా కీలకమని ఆయన ఈ గ్రంథంలో నొక్కి చెప్పారు. ముఖ్యంగా ‘తక్కువ మాట్లాడటం’ (మితభాషిగా ఉండటం) అనేది ఒక వ్యక్తిని విజయపథంలో ఎలా నడిపిస్తుందో చాణక్యుడు వివరించిన తీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాఠం. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Monalisa: ‘‘ మోనాలిసా పారిపోయింది’’.. భర్త ఫర్మాన్ సంచలన వీడియో..
Also Read
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
- Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
చాణక్యుని ప్రకారం.. జ్ఞానానికి అసలైన నిదర్శనం మాటలను అదుపులో ఉంచుకోవడమే. తక్కువ మాట్లాడే వారు జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడతారని ఆయన సూచించారు. ఎక్కువగా మాట్లాడేవారు తమ శక్తిని అనవసరమైన చర్చల్లో వృథా చేస్తారు. కానీ తక్కువ మాట్లాడే వ్యక్తులు తమ శక్తిని అంతర్గతంగా దాచుకుని, తమ లక్ష్యాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారు. ఈ ఏకాగ్రత వారిని ఇతరుల కంటే వేగంగా విజయం వైపు నడిపిస్తుంది. తక్కువ మాట్లాడేవారు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి, పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాతే స్పందిస్తారు. వారు మాట్లాడే ప్రతి మాటలో ఒక స్పష్టత, బలం ఉంటాయి. అందుకే సమాజంలో ఇలాంటి వారు మాట్లాడేటప్పుడు ప్రజలు ఎంతో శ్రద్ధగా వింటారు, గౌరవిస్తారు.
“నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది” అన్నట్లుగా.. ఆలోచించకుండా మాట్లాడేవారు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటారు. కానీ నిశ్శబ్దంగా ఉండే వ్యక్తులు ముందుగా విశ్లేషించి స్పందించడం వల్ల అనవసరమైన గొడవలు, మాట జారడం వంటి తప్పులు జరగకుండా కాపాడుకోగలరు. చాణక్యుని రాజనీతిలో వ్యూహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వివేకవంతుడైన వ్యక్తి తన ప్రణాళికలను, రహస్యాలను అందరికీ వెల్లడించడు. తక్కువ మాట్లాడే అలవాటు వల్ల తమ తదుపరి అడుగు ఏంటో శత్రువులకు లేదా ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడవచ్చు. దీనివల్ల మోసపోయే ప్రమాదం తప్పుతుంది. ప్రతిచోటా మాట్లాడటం కంటే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటమే శ్రేయస్కరమని చాణక్యుడు పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, చెప్పే విషయాన్ని అర్థం చేసుకునే స్థితిలో అవతలి వారు లేనప్పుడు, విజ్ఞానం లేని చోట అనవసర చర్చలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం చాలా ముఖ్యం అని చెప్పారు. సమాజంలో గౌరవం పెరగాలన్నా, వ్యక్తిత్వ వికాసం సాధించాలన్నా మితభాషిగా ఉండటం అవసరమని చాణక్య నీతి చెబుతోంది. తక్కువ మాట్లాడితే మాటకే కాదు, మనిషికి కూడా విలువ పెరుగుతుందన్నారు.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!