Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’ ద్వారా మానవాళికి ఎన్నో అద్భుతమైన సూత్రాలను అందించారు. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడటం మాత్రమే కాదు, మన ప్రవర్తన, మాటతీరు కూడా కీలకమని ఆయన ఈ గ్రంథంలో నొక్కి చెప్పారు. ముఖ్యంగా ‘తక్కువ మాట్లాడటం’ (మితభాషిగా ఉండటం) అనేది ఒక వ్యక్తిని విజయపథంలో ఎలా నడిపిస్తుందో చాణక్యుడు వివరించిన తీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాఠం. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Monalisa: ‘‘ మోనాలిసా పారిపోయింది’’.. భర్త ఫర్మాన్ సంచలన వీడియో..
Also Read
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
చాణక్యుని ప్రకారం.. జ్ఞానానికి అసలైన నిదర్శనం మాటలను అదుపులో ఉంచుకోవడమే. తక్కువ మాట్లాడే వారు జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడతారని ఆయన సూచించారు. ఎక్కువగా మాట్లాడేవారు తమ శక్తిని అనవసరమైన చర్చల్లో వృథా చేస్తారు. కానీ తక్కువ మాట్లాడే వ్యక్తులు తమ శక్తిని అంతర్గతంగా దాచుకుని, తమ లక్ష్యాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారు. ఈ ఏకాగ్రత వారిని ఇతరుల కంటే వేగంగా విజయం వైపు నడిపిస్తుంది. తక్కువ మాట్లాడేవారు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి, పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాతే స్పందిస్తారు. వారు మాట్లాడే ప్రతి మాటలో ఒక స్పష్టత, బలం ఉంటాయి. అందుకే సమాజంలో ఇలాంటి వారు మాట్లాడేటప్పుడు ప్రజలు ఎంతో శ్రద్ధగా వింటారు, గౌరవిస్తారు.
“నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది” అన్నట్లుగా.. ఆలోచించకుండా మాట్లాడేవారు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటారు. కానీ నిశ్శబ్దంగా ఉండే వ్యక్తులు ముందుగా విశ్లేషించి స్పందించడం వల్ల అనవసరమైన గొడవలు, మాట జారడం వంటి తప్పులు జరగకుండా కాపాడుకోగలరు. చాణక్యుని రాజనీతిలో వ్యూహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వివేకవంతుడైన వ్యక్తి తన ప్రణాళికలను, రహస్యాలను అందరికీ వెల్లడించడు. తక్కువ మాట్లాడే అలవాటు వల్ల తమ తదుపరి అడుగు ఏంటో శత్రువులకు లేదా ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడవచ్చు. దీనివల్ల మోసపోయే ప్రమాదం తప్పుతుంది. ప్రతిచోటా మాట్లాడటం కంటే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటమే శ్రేయస్కరమని చాణక్యుడు పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, చెప్పే విషయాన్ని అర్థం చేసుకునే స్థితిలో అవతలి వారు లేనప్పుడు, విజ్ఞానం లేని చోట అనవసర చర్చలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం చాలా ముఖ్యం అని చెప్పారు. సమాజంలో గౌరవం పెరగాలన్నా, వ్యక్తిత్వ వికాసం సాధించాలన్నా మితభాషిగా ఉండటం అవసరమని చాణక్య నీతి చెబుతోంది. తక్కువ మాట్లాడితే మాటకే కాదు, మనిషికి కూడా విలువ పెరుగుతుందన్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!