Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Special Stories Bjp Special Focus On 144 Mp Seats

BJP Focus on 144 MP Seats: ఎంపీ సీట్లపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌. అందుకే.. ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’.

Published Date :July 5, 2022 , 12:16 pm
By Akkirala Kondala Rao
BJP Focus on 144 MP Seats: ఎంపీ సీట్లపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌. అందుకే.. ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’.
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. మూడోసారి కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదల ప్రదర్శిస్తోంది. తదుపరి (2024) సాధారణ ఎన్నికల దిశగా అప్పుడే కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. మొదటి దశలో దేశవ్యాప్తంగా 144 లోక్‌సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా సెగ్మెంట్లలో పార్టీని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన’ అనే పేరుతో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ అమలుచేస్తారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా 3, 4 లోక్‌సభ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేస్తారు. ఈ క్లస్టర్లకు ఇన్‌ఛార్జ్‌లుగా కేంద్ర మంత్రులను నియమిస్తారు. మొత్తం 40 మంది కేంద్ర మంత్రులకు ఈ బాధ్యతలను అప్పగిస్తారు. ఆయా కేంద్ర మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు(ఎంపీలు) ఎంపిక చేసిన లోక్‌సభ నియోజకవర్గాల్లో క్రమంతప్పకుండా పర్యటించాలి. పర్యటనలో మూడు రోజులపాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బస చేయాలి.

Also Read

  • Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
  • Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
  • Kedarnath: కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్కంద పురాణంలో ఉన్న అసలు రహస్యం ఇదే!
  • Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి

read also: Rains: ముంబయిని వణికిస్తున్న వరుణుడు.. మరోసారి భారీ వర్షసూచన

కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించటంతోపాటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడతారు. పార్టీ రాష్ట్ర శాఖ నుంచి కూడా ఒక ఇంఛార్జ్‌ ఇందులో పాల్గొంటారు. రేపు (బుధవారం) జరిగే పార్టీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో ఈ ‘ప్రవాస్‌ యోజన’పై చర్చించనున్నారు.

హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలతోపాటు పరేడ్‌ మైదానంలో ఘనంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ ఫుల్‌ సక్సెస్‌ అయిన నేపథ్యంలో ఆ స్ఫూర్తితో, రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ మరిన్ని కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రజాప్రతినిధులు, నాయకులు, మంత్రులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజల, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని ప్రధాని మోడీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు ప్రసంగంలో ఉద్భోదించిన విషయం తెలిసిందే.

దీంతో ఆయన సూచనలను, సలహాలను వెంటనే అమలుచేసేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రజానుకూల విధానాలను రూపొందించాలన్నా, సుపరిపాలన అందించాలన్నా ఈ స్థాయి కసరత్తు అవసరమని అర్థంచేసుకుంది. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు లేకపోయినా ఆ టెంపోని పార్టీ కేడర్‌లో మెయిన్‌టెయిన్‌ చేయటానికి బీజేపీ హైకమాండ్‌ అన్ని చర్యలూ చేపడుతోంది. అందులో భాగమే ఈ ‘పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన’ అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Telangana: దంచికొడుతున్న వాన‌లు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 144 MP Seates
  • bjp
  • Parliament Pravas Yojana
  • Special Focus

తాజావార్తలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..

  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?

  • RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం

  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions