Value Gold : ఆంధ్రప్రదేశ్ లో అత్యంత విశ్వసనీయ బంగారం కొనుగోలు సంస్థ వాల్యూ గోల్డ్ బ్రాంచ్ ల విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వసనీయ బంగారు ఆభరణాల కొనుగోలు సంస్థ క్యాప్స్ గోల్డ్ యొక్క విభాగం అయిన వాల్యూ గోల్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఏడు కొత్త బ్రాంచ్ లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. విశాఖపట్టణంలోని గాజువాక, జగదాంబ, గోపాలపట్నం, మధురవాడ ప్రాంతాల్లో, విజయవాడలోని ఎంజీ రోడ్డు, భవానీపురంలో, కర్నూల్ లోని ఇందిరా నగర్ లో విస్తరించనున్నట్లు పేర్కొంది. క్యాప్స్ గోల్డ్ నుంచి వారసత్వంగా పొందిన సమగ్రత, పారదర్శకతను అనుసరిస్తూ వాల్యూ గోల్డ్.. బంగారానికి తక్షణ నగదు, తాకట్టు బంగారం విడుదల మరియు ఖచ్చితమైన, సాంకేతిక ఆధారిత మూల్యాంకనాలతో వినియోగదారులకు మంచి వెసులుబాటు కల్పించనుంది. ఈ ప్రారంభం భారతదేశం అంతటా తమ నమ్మకమైన ఆర్థిక సహాయం మరియు కస్టమర్-ఫస్ట్ సేవలను విస్తరించాలనే కంపెనీ దీర్ఘదృష్టికి ఒక ముఖ్యమైన మైలురాయిని నిలుస్తుంది.
1901 నుంచి భారతదేశంలో అత్యంత పేరు పొందిన బంగారం కొనుగోలు సంస్థ అయిన క్యాప్స్ గోల్డ్ యొక్క విభాగమైన వాల్యూ గోల్డ్.. పారదర్శకత, ఖచ్చితత్వం మరియు ఆటోమేటెడ్ ప్రక్రియతో బంగారం కొనుగోలుకు సరికొత్త ఒరవడి చుట్టింది. వాల్యూగోల్డ్.. బంగారం కొనుగోలు, తాకట్టు బంగారం విడుదలలో నైపుణ్యం కలిగి ఉండడంతో పాటు తక్షణ, వేగవంతమైన నగదు చెల్లింపుపై దృష్టి సారిస్తుంది.
Also Read
- Aura Dental : హైదరాబాద్లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
- Padmam Silver Jewellery: అనకాపల్లిలో పద్మం సిల్వర్ జువెలరీ ఘనంగా ప్రారంభం
వాల్యూ గోల్డ్ డైరెక్టర్ అభిషేక్ చందా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్లో వాల్యూ గోల్డ్ యొక్క విశ్వసనీయ సేవలను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. గత రెండు సంవత్సరాలలో, మేము తెలంగాణలో 10,000 మందికి పైగా వినియోగదారులకు సేవలు అందించాము. ఈ విస్తరణ మా అభివృద్ధికి మరో అడుగు కానుంది. బంగారం కొనుగోలు వంటి ఆర్థిక నిర్ణయాల్లో నమ్మకమైన, పారదర్శక అనుభవాన్ని వినియోగదారులకు అందించేందుకు మేం ఎల్లప్పుడూ కృషి చేస్తాం.” అని అన్నారు.
గత రెండు సంవత్సరాలలో, వాల్యూ గోల్డ్ గణనీయమైన వృద్ధిని సాధించింది. నాలుగు బ్రాంచ్ లుగా మొదలై గత ఆరు నెలల్లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 15 కొత్త బ్రాంచ్ లను ప్రారంభించింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19 బ్రాంచ్ లను కలిగి ఉంది. రాబోయే రెండు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 40 నుంచి 50 కొత్త బ్రాంచ్లను ప్రారంభించి దక్షిణ భారతదేశం అంతటా తన విశ్వసనీయ సేవలను మరింత విస్తరించడంపై దృష్టి సారిస్తోంది.
వాల్యూ గోల్డ్ డైరెక్టర్ అఖిల్ చందా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్లోకి విస్తరించడం.. మా బంగారం విక్రయాన్ని మరింత అందుబాటులోకి తెచ్చి, విశ్వసనీయంగా చేయాలనే లక్ష్యాన్ని బలపరుస్తుంది. వాల్యూ గోల్డ్లో వినియోగదారుడితో చెప్పే ప్రతీ మాట.. పారదర్శకత, గౌరవం, మరియు విలువతో కూడి ఉంటుంది.” అని అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి మరియు వాల్యూ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్ అనసూయ భరద్వాజ్ హాజరయ్యారు. నమ్మకం, సాధికారత, మరియు ప్రామాణికతను సూచించే బ్రాండ్ గా వాల్యూ గోల్డ్ ను సమర్థించారు.
ఈ కార్యక్రమానికి వాల్యూ గోల్డ్ సీఈఓ భరద్వాజ్ పంపట్వార్ సహా డైరెక్టర్లు హాజరయ్యారు. 
తాజావార్తలు
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!