Akshat Greentech : తెలంగాణలో అక్షత్ గ్రీన్టెక్ భారీ పెట్టుబడులు
- తెలంగాణలో అక్షత్ గ్రీన్టెక్ భారీ పెట్టుబడులు
- దశలవారీగా రూ.2,500 కోట్ల ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రాజెక్ట్
- పీసీబీలు, సెన్సార్లు, హై-ఎండ్ కాంపోనెంట్ల ఉత్పత్తి
- రాష్ట్ర యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshat Greentech : భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రానిక్స్ మిషన్కు తెలంగాణ రాష్ట్రం కీలక మద్దతుగా నిలవనుంది. ఈ దిశగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ విస్తరణకు మరొక కీలక ముందడుగు పడింది. లండన్, తెలంగాణకు చెందిన కైలాస్ ఫ్యామిలీ నేతృత్వంలో ఉన్న అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఈ ఒప్పందం ద్వారా అక్షత్ గ్రీన్టెక్ సంస్థ తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించనుంది. దశలవారీగా సుమారు రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యోచనలో సంస్థ ఉంది. ఈ పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘భారతదేశ ఎలక్ట్రానిక్స్ మరియు కాంపోనెంట్ తయారీ పథకం’ మార్గదర్శకాల ప్రకారం వినియోగించనున్నట్లు వెల్లడించింది.
Also Read
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారే ప్రధాన లక్ష్యంగా అక్షత్ గ్రీన్టెక్ తెలంగాణలో యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా మల్టీ లేయర్ పీసీబీలు, కాపర్ క్లాడ్ లామినేట్లు, సెన్సార్లు, యాంటెనాలు, ట్రాన్స్డ్యూసర్లు వంటి అత్యాధునిక కాంపోనెంట్లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలో హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం మరింత బలోపేతం కానుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
భారీ పెట్టుబడులతో అమలుకాబోయే ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధి వేగం పెరగడంతో పాటు, యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీలో తెలంగాణను దేశంలోనే ఒక ప్రముఖ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలవనుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!