తెలంగాణలోని కొందరు సీనియర్ ఐఏఎస్ల లబోదిబో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
>> వడ్డించేవాడు మనవాడే అయితే ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు. తేడా వచ్చిందో కడుపు మాడ్చుకోవాల్సిందే. తెలంగాణలో కొందరు సీనియర్ ఐఏఎస్ల పరిస్థితి కూడా అలాగే ఉందట. ప్రాధాన్యం లేని పోస్టుల్లోనే రిటైరైపోతున్నారు. కళ్లముందే జూనియర్లు కీలక పోస్టుల్లో ఉంటే.. తమకీ దుస్థితి ఏంటని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారట.
లూప్లైన్లోనే సీనియర్ ఐఏఎస్ల పదవీ విరమణ!
Also Read
అనుభవం ఆధారంగా సీనియర్ IASలు కీలక పోస్టుల్లో కొనసాగుతారు. కొందరైతే రిటైర్మెంట్ టైమ్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. కానీ.. తెలంగాణలో తమ పరిస్థితి భిన్నంగా ఉందని వాపోతున్నారట పలువురు సీనియర్ ఐఏఎస్లు. సీనియారిటీ ఉన్నా.. ప్రాధాన్యం లేని పోస్టుల్లో కొనసాగాల్సి వస్తోందని..అక్కడే రిటైర్ కావాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. రిటైర్మెంట్ చివరి రోజుల్లో పనిష్మెంట్ ఇస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే కొందరు అధికారులు లూప్లైన్లో పోస్టుల్లోనే పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ప్రాధాన్యం లేని పోస్టుల్లో ఉన్నవారి పరిస్థితి అంతేనని అనుకుంటున్నారట. దీనిని అవమానంగా భావిస్తున్నారట కొందరు ఐఏఎస్లు.
సీనియర్ ఐఏఎస్లపై అధికారుల్లో చర్చ!
ఇటీవల రిటైర్ అయిన IASలలో బీపీ ఆచార్య, జగదీశ్వర్, రాజేశ్వర్ తివారీ, బీఆర్ మీనా ఉన్నారు. ఒకప్పుడు వీరంతా ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన వారే. పదవీ విరమణ దగ్గరకు వచ్చే సరికి ఫ్రేమ్ నుంచి ఫేడ్ అవుట్ అయ్యారు. అలాగే ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. ఇదే విధంగా సర్వీస్ ముగించుకునే ఐఏఎస్లు ఎవరనే దానిపై ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న శాలినీమిశ్రా సాధారణ పరిపాలన విభాగంలో పనిలేని స్థానంలో ఉన్నారు. ఆమెకు మంచి పోస్ట్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ వరకు సర్వీస్ ఉంది. సీఎస్ కావాలని ఆశపడ్డ మరో సీనియర్ ఐఏఎస్ అదర్ సిన్హాను EPTRI డీజీగా బదిలీ అయ్యారు. ఈయన వచ్చే ఏడాది మార్చిలో రిటైర్ అవుతారు. ప్రస్తుతం స్టేట్ ఫైనాన్స్ కమిషన్లో కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇలాంటి సీనియర్లపై కథలు కథలుగా చెప్పుకొంటున్నారట అధికారులు.
సర్వీస్ ఉన్నవారు మంచి పోస్టింగ్ల కోసం ఎదురుచూపులు!
ఏప్రిల్లో రిటైర్ కాబోతున్న సీనియర్ ఐఏఎస్ చిత్రా రామచంద్రన్కు ఒక్కో బాధ్యతను తగ్గిస్తూ ప్రస్తుతం విద్యాశాఖకు పరిమితం చేశారు. గతంలో CMOలో, ఆరోగ్య శాఖలో పనిచేసిన మరో ఐఏఎస్ శాంతి కుమారి అటవీశాఖకు వెళ్లక తప్పలేదు. HMDA కమిషనర్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ చిరంజీవులను MCHRDకి బదిలీ చేశారు. ఇదే విధంగా మరికొందరు ఐఏఎస్లు.. సెక్రటేరియట్లో సీనియర్ ఉద్యోగులు చేసే పోస్టుల్లో భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. ఇంకా సర్వీస్ ఉండటంతో.. భవిష్యత్లో తమకు మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు.
సీఎంకు నచ్చక కొందరు.. సీఎస్తో పడక మరికొందరు..!
ఇలా లూప్ లైన్లో ఉన్న ఐఏఎస్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారి ట్రాక్ రికార్డు బాగానే ఉన్నా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయకపోవడం, కొందరు పనితీరు సీఎంకు నచ్చక, తనకంటే జూనియర్ అయిన సీఎస్ సోమేశ్ కుమార్తో పడక.. నాన్ ఫోకల్ పోస్టింగ్స్లో పనిచేస్తున్నారనే అభిప్రాయం అధికారవర్గాల్లో ఉందట. దీంతో ఐఏఎస్ కావడం ఒక ఎత్తు.. మంచి పోస్టు పట్టడం మరో ఎత్తులా మారిందని చెవులు కొరుక్కుంటున్నారట సీనియర్లు.
- Tags
- Senior IAS officers
- TRS
తాజావార్తలు
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!