Kuppam constituency : సీఎం జగన్ వాళ్ళకి చెక్ పెడతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం హోదాలో జగన్ తొలిసారి కుప్పానికి వస్తుంటే.. అక్కడ అధికారపార్టీలో గ్రూపు తగాదాలు పీక్స్కు వెళ్తున్నాయా? పార్టీకి తలనొప్పిగా మారిన ముఠా కుమ్ములాటలకు అధినేత చెక్ పెడతారా? గీత దాటిన వాళ్లకు క్లాస్ తీసుకుంటారా? లెట్స్వాచ్..!
2019 ఎన్నికల సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పటిష్ఠంగా కనిపించిన వైసీపీ.. ప్రస్తుతం గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతోంది. ద్వితీయశ్రేణి నేతల నుంచి మంత్రుల వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి రోజా సొంత నియోజకవర్గాల్లో వారిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. రోజు రోజుకీ సమస్య శ్రుతిమించుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ ముఠా తగాదాల్లో పార్టీ కేడర్ నలిగిపోతోందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుప్పానికి వస్తుండటంతో ఆ వర్గపోరుకు చెక్ పడుతుందనే చర్చ సాగుతోంది.
Also Read
సీఎం జగన్ వెళ్తోంది కుప్పానికే అయినా.. ఉమ్మడి జిల్లా వైసీపీ వ్యవహారాలపైనా అధినేత దృష్టి పెడతారని సమాచారం. కొందరు పార్టీ నేతలు నేరుగా సీఎంకే మొరపెట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారట. మరికొందరైతే ఆకాశ రామన్న ఉత్తరాలు రాశారట. సీఎం జగన్ వెళ్తున్న కుప్పం వైసీపీలోనూ నేతల మధ్య పడటం లేదు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వారి మధ్య రగడ ఇంకా పెరిగింది. కుప్పం వైసీపీ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ ఫొటో లేకుండానే రెస్కో ఛైర్మన్ సెంథిల్కుమార్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి ఫొటో లేకుండా ఇంకొందరు స్థానిక నేతలు బ్యానర్లు వేశారు. సీఎం వస్తున్నందున కుప్పం నేతలు గాడిలో పడతారని పార్టీ పెద్దలు ఆశించారు. కానీ.. ఫ్లెక్సీల దగ్గరే పేచీలకు తెరతీశారు.
ఉమ్మడి జిల్లాలోని జీడీ నెల్లూరు, నగరి, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు, పూతలపట్టులోనూ అక్కడి ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు అస్సలు పడటం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అని సవాళ్లు విసురుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు.. అక్కడ పార్టీ పరిస్థితిపై సమగ్ర సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి.. కుప్పం పర్యటనలో అన్నీ సెట్రైట్ చేస్తారని కేడర్ భావిస్తోందట. ముఖ్యంగా నేతల మధ్య దూరాన్ని తగ్గించడం.. కలిసి సాగకపోతే కష్టమని చెప్పడంతోపాటు కొందరికి అక్షింతలు పడతాయని అనుకుంటున్నారట. అందుకే సీఎం పర్యటనపై వైసీపీ వర్గాల్లో ఆసక్తితోపాటు ఉత్కంఠ పెరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలనేది వైసీపీ టార్గెట్. ఆ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో నేతల మధ్య ఐక్యత లేకపోతే సీఎం జగన్ సీరియస్గా తీసుకుంటారని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ పర్యటన తర్వాత కుప్పం వైసీపీలో మార్పు వస్తుందని.. మరింత వేగంగా పార్టీ కార్యకలాపాలు పెరుగుతాయని ఆశిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!