వైసీపీలో పాలకొల్లు సీటు ఎవరిది…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీలో పాలకొల్లు సీటు ఎవరిది? ఎన్నికలకు ఇంకా చాల టైమ్ ఉన్నా.. అధికారపార్టీలో స్థానికంగా ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకుడు తిరిగి వైసీపీ కండువా కప్పుకోవడంతో సమీకరణాలపై ఆసక్తి రేగుతోంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేత పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు టికెట్ తనదే అన్న ధీమాలో కవురు..!
Also Read
కవురు శ్రీనివాస్. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్. పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. కుల సమీకరణాల్లో భాగంగా కవురు శ్రీనివాస్ను వరసగా పదవులు వరిస్తున్నాయి. మొదట ఎంపీపీ తర్వాత DCCB ఛైర్మన్.. ఇప్పుడు జడ్పీ ఛైర్మన్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొల్లులో టీడీపీ గెలవడంతో ఇక్కడ పూర్తిస్థాయిలో పాగా వేయడానికి స్థానిక వైసీపీ నేతలకు పదవులు క్యూ కట్టాయి. అందులో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన కవురు మొదటి వరసలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనదే అన్న ధీమాతో ఆయన ఉన్నారట. ఇంతలో పరిస్థితి మారిపోవడంతో ఆసక్తికర చర్చ మొదలైంది.
ఆచంట టికెట్ రాకపోవడంతో పాలకొల్లుపై కవురు ఫోకస్..!
గుణ్ణం నాగబాబు తిరిగి వైసీపీలోకి రావడంతో కొత్త చర్చ..!
కవురు శ్రీనివాస్.. 2019 ఎన్నికల్లోనే అసెంబ్లీకి పోటీ చేయాలని చూశారు. ఆచంటపై ఆశ పెట్టుకున్నారు కూడా. చివరి నిమిషంలో ఆ సీటు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందారు. అదే ఎన్నికల్లో పాలకొల్లు నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో.. ఈ నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకున్నారు కవురు. అయితే ఆ ఎన్నికల్లో పాలకొల్లు టికెట్ ఆశించారు మరో వైసీపీ నేత గుణ్ణం నాగబాబు. టికెట్ లభించకపోవడంతో వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లిపోయారు నాగబాబు. ఇటీవలే ఆయన తిరిగి వైసీపీలోకి వచ్చారు. తనకు ఇంఛార్జ్ పదవి కట్టబెడతారని నాగబాబు ప్రచారం చేసుకుంటున్నారట. దీంతో పాలకొల్లులో పరిస్థితి మారిందని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
సొంత సామాజికవర్గంలోనే కవురుకు వ్యతిరేకత మొదలైందా?
పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ఎదుర్కోవాలంటే అదే సామాజికవర్గానికి పట్టం కట్టాలనే టాక్ వైసీపీలో మొదలైందట. ఇదే సమయంలో ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్పై శెట్టిబలిజ సామాజికవర్గంలోనే వ్యతిరేకత కనిపిస్తోందని ప్రచారం స్టార్ట్ చేశారు. జడ్పీ ఛైర్మన్ అయ్యాక.. ఆ సామాజికవర్గాన్ని ఆయన అస్సలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. శెట్టిబలిజ సామాజికవర్గం నిర్వహించే కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత వాళ్లను వదిలేసి మిగతా వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్రుగా ఉన్నారట. దాంతో పనులు కావాల్సిన వాళ్లు కవురు దగ్గరకు కాకుండా ఎమ్మెల్యే నిమ్మల దగ్గరకు వెళ్తున్నారట. నిమ్మల దగ్గర నుంచి ఫోన్లు వెళ్లితే.. విపక్ష MLAతో ఎందుకు తలనొప్పి అని వెంటనే పనులు చేసేస్తున్నారట. అదే కవురు ఏదైనా చెబితే.. ఎందుకు చేశారని అధికారులను ప్రశ్నిస్తూ నిమ్మల ధర్నాలకు దిగుతున్నారట.
గుణ్ణం నాగబాబుకు ఇచ్చిన హామీ ఏంటి?
మారిన ఈ పరిస్థితుల్లో కవురు శ్రీనివాస్కు వైసీపీ ఇంఛార్జ్ పదవి ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది. గతంలో ఆచంటను వదులుకున్నట్టే పాలకొల్లును కూడా వదిలేసుకుంటారా అని చెవులు కొరుక్కుంటున్నారట. ఇదే సమయంలో ఇంఛార్జ్ పదవి హామీతోనే గుణ్ణం నాగబాబు తిరిగి పార్టీలోకి వచ్చారనే చర్చ ఓ రేంజ్లో ఉంది. మరి.. వైసీపీలో పాలకొల్లు ఎవరిదో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!