Ushashri Charan : ఆ మంత్రికి కునుకు లేకుండా చేస్తుంది ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ushashri Charan : ఆ మంత్రి నియోజకవర్గంలో ఎంత చెబితే అంత. కానీ.. సొంత గూటిలో అంతేస్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. ఇంతలో కావాలని చేశారో ఏమో.. కొత్త ప్రచారం మొదలై.. అమాత్యుల వారికి కనుకు లేకుండా చేస్తోందట. ఆ మినిస్టర్ ఎవరో.. ఆ గోల ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం.
ఉషాశ్రీచరణ్. ఏపీ స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి. కల్యాణదుర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ మూడేళ్లకాలంలో ప్రత్యర్థులతోపాటు.. స్వపక్ష నాయకులు పైచెయ్యి సాధించాలని చూశారు. ఈ రగడ పీక్స్లో ఉన్న సమయంలోనే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలో మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేశారు ఉషాశ్రీచరణ్. ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం కల్యాణదుర్గంలో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు మంత్రి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ప్రచారం మినిస్టర్ను కలవర పెడుతోందట. దాని చుట్టూనే ప్రస్తుతం నియోజకవర్గంలో.. మంత్రి శిబిరంలో హాట్ హాట్ చర్చ సాగుతోంది.
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
ఉషాశ్రీచరణ్ కల్యాణదుర్గం వదిలేసి వచ్చే ఎన్నికల్లో హిందూపురం వెళ్లిపోతారనేది ఆ ప్రచార సారాంశం. అదీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్షణాల్లోనే నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారిపోయింది కూడా. హిందూపురం ఎందుకు వెళ్లిపోతున్నారో కూడా ఆ ప్రచారంలో విశ్లేషిస్తుండటంతో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. కల్యాణదుర్గం వైసీపీలో మంత్రి యాంటీ గ్రూప్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆమెకు కల్యాణదుర్గంలో సహకరించే పరిస్థితి లేదట. అందుకే హిందూపురం వెళ్లిపోతున్నారని ఊదరగొట్టేస్తున్నారు. హిందూపురంలో ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, పార్టీ సీనియర్ నేత నవీన్ నిశ్చల్కు పడటం లేదు. ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు. అందుకే ఉషాశ్రీచరణ్ను అక్కడి పంపుతారని ఆ ప్రచారంలో వెల్లడిస్తున్నారు. ఇందులో సాధ్యా సాధ్యాలు ఎలా ఉన్నప్పటికీ మంత్రి శిబిరం మాత్రం చాలా గుర్రుగా ఉందట.
కల్యాణదుర్గం వైసీపీలో తానంటే గిట్టని వాళ్లే ఈ ప్రచారం చేస్తున్నారనేది మంత్రి ఉషాశ్రీచరణ్ వాదన. కల్యాణదుర్గం వదిలేది లేదని.. హిందూపురం వెళ్లేదీ లేదని చెబుతున్నారట. హిందూపురంలో సామాజికవర్గం పరంగా కానీ.. ప్రాంతాల పరంగా లెక్కలేసుకున్నా.. ఉషాశ్రీచరణ్కు సెట్ కాని పరిస్థితి. అందుకే పార్టీ ఆమెను అక్కడికి పంపబోదని చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తొలుత మంత్రి లైట్ తీసుకున్నా.. చర్చ జోరందుకోవడంతో పెదవి విప్పక తప్పలేదు.
తనకు రాజకీయంగా అవకాశం కల్పించింది.. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది కల్యాణదుర్గమే కాబ్టటి.. నియోజకవర్గాన్ని వదిలి వెళ్లేది లేదని ఉషాశ్రీచరణ్ చెబుతున్నారట. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మోద్దని ఆమె కోరుతున్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి కొందరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని.. వాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మండిపడుతున్నారు. మొత్తానికి హిందూపురం ప్రచారం బయటకు ఎలా వచ్చిందో కానీ.. మంత్రి ఉషాశ్రీచరణ్ స్పందించక తప్పలేదు. ఈ గందరగోళానికి కారణమైన వాళ్లు ఎవరా అని మినిస్టర్ ఆరా తీస్తున్నారట. మొత్తానికి మూడేళ్లుగా నియోజకవర్గంలో ఇబ్బందులను ఎదుర్కొన్నది ఒక తీరు అయితే.. ఇప్పుడు మంత్రిగా ఫేస్ చేస్తున్న సవాళ్లు మరో ఎత్తు అన్నట్టుగా మారిపోయిందట.
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?