YCP :అక్కడి వైసీపీలో ఎప్పుడు వివాదాలేనా..? నేతల మధ్య పరిస్థితులు కుదురుకోలేదా.? l O
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్నికల సమయంలో కలిసి సాగిన నేతలు ప్రస్తుతం చెరోదారి అయ్యారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మధ్య అస్సలు పడటం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేయబోనని బూచేపల్లి చెప్పడంతో మద్దిశెట్టికి ఛాన్స్ ఇచ్చింది పార్టీ. ఆ సమయంలో ఇద్దరి మధ్య సఖ్యత ఉంది. కానీ.. తర్వాతే మార్పు వచ్చింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. బ్యానర్లు చించివేత, శిలాఫలకాల ధ్వంసం.. పార్టీ ఆఫీసులపై దాడి.. కరపత్రాల పంపిణీ సెగలు రేపాయి. బూచేపల్లి తల్లి వెంకాయమ్మ జడ్పీ ఛైర్మన్గా ఉండటంతో దర్శి వైసీపీలో ప్రస్తుతం రెండు పవర్ సెంటర్లు కొనసాగుతున్నాయి.
దర్శి నగర పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో రెండు వర్గాలు శాంతించినట్టు కనిపించినా.. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల అత్యుత్సాహం బూచేపల్లి, మద్దిరెడ్డి వర్గాల మధ్య విభేదాలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ కాలేజీలో విద్యార్థులు జనసేన జెండాలు ప్రదర్శించడం.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గొడవలు చెలరేగి… పోలీసుల కేసు వరకు వెళ్లాయి. ముగ్గురిపై కేసు పెట్టగా.. వారిలో ఒకరు జనసేన నేత అయితే.. ఇంకొకరు బూచేపల్లి అభిమానిగా గుర్తించారట. దీంతో తమకు సంబంధం లేకపోయినా.. తమవారిపై కేసు పెట్టారని బూచేపల్లి వర్గీయులు రచ్చ రచ్చ చేశారు. కౌంటర్ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు వాటిని పట్టించుకోలేదట. దీనిపై బూచేపల్లి వర్గీయులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు కూడా దిగారు.
Also Read
దర్శి నియోజకవర్గంలో మండలానికో ఇంఛార్జ్ను నియమించుకున్నారట ఎమ్మెల్యే. పనులు కావాల్సిన ముఖ్య నేతలు సైతం వారి వద్దకే వెళ్లాలని చెప్పడంతో ఎమ్మెల్యే వైఖరి నచ్చని వాళ్లు బూచేపల్లి శిబిరంలో చేరిపోతున్నారట. ఇక్కడి పరిణామాలపై వైసీపీ పెద్దలు కూడా ఒక కన్నేసినట్టు సమాచారం. సీఎంకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే మద్దిశెట్టిని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆ ఘటనపై సీఎంవో సీరియస్గా స్పందించడం వల్లే.. వివాదం కేసుల వరకు వెళ్లిందని చెవులు కొరుక్కుంటున్నారట.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నా బూచేపల్లి వర్గీయులు దూరంగానే ఉంటున్నారట. రెండు వర్గాల మధ్య ఉప్పు నిప్పులా ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదట పోలీసులకు. మరి.. సమస్యను సర్దుబాటు చేసేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..