YCP :అక్కడి వైసీపీలో ఎప్పుడు వివాదాలేనా..? నేతల మధ్య పరిస్థితులు కుదురుకోలేదా.? l O
ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్నికల సమయంలో కలిసి సాగిన నేతలు ప్రస్తుతం చెరోదారి అయ్యారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మధ్య అస్సలు పడటం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేయబోనని బూచేపల్లి చెప్పడంతో మద్దిశెట్టికి ఛాన్స్ ఇచ్చింది పార్టీ. ఆ సమయంలో ఇద్దరి మధ్య సఖ్యత ఉంది. కానీ.. తర్వాతే మార్పు వచ్చింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. బ్యానర్లు చించివేత, శిలాఫలకాల ధ్వంసం.. పార్టీ ఆఫీసులపై దాడి.. కరపత్రాల పంపిణీ సెగలు రేపాయి. బూచేపల్లి తల్లి వెంకాయమ్మ జడ్పీ ఛైర్మన్గా ఉండటంతో దర్శి వైసీపీలో ప్రస్తుతం రెండు పవర్ సెంటర్లు కొనసాగుతున్నాయి.
దర్శి నగర పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో రెండు వర్గాలు శాంతించినట్టు కనిపించినా.. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల అత్యుత్సాహం బూచేపల్లి, మద్దిరెడ్డి వర్గాల మధ్య విభేదాలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ కాలేజీలో విద్యార్థులు జనసేన జెండాలు ప్రదర్శించడం.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గొడవలు చెలరేగి… పోలీసుల కేసు వరకు వెళ్లాయి. ముగ్గురిపై కేసు పెట్టగా.. వారిలో ఒకరు జనసేన నేత అయితే.. ఇంకొకరు బూచేపల్లి అభిమానిగా గుర్తించారట. దీంతో తమకు సంబంధం లేకపోయినా.. తమవారిపై కేసు పెట్టారని బూచేపల్లి వర్గీయులు రచ్చ రచ్చ చేశారు. కౌంటర్ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు వాటిని పట్టించుకోలేదట. దీనిపై బూచేపల్లి వర్గీయులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు కూడా దిగారు.
Also Read
దర్శి నియోజకవర్గంలో మండలానికో ఇంఛార్జ్ను నియమించుకున్నారట ఎమ్మెల్యే. పనులు కావాల్సిన ముఖ్య నేతలు సైతం వారి వద్దకే వెళ్లాలని చెప్పడంతో ఎమ్మెల్యే వైఖరి నచ్చని వాళ్లు బూచేపల్లి శిబిరంలో చేరిపోతున్నారట. ఇక్కడి పరిణామాలపై వైసీపీ పెద్దలు కూడా ఒక కన్నేసినట్టు సమాచారం. సీఎంకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే మద్దిశెట్టిని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆ ఘటనపై సీఎంవో సీరియస్గా స్పందించడం వల్లే.. వివాదం కేసుల వరకు వెళ్లిందని చెవులు కొరుక్కుంటున్నారట.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నా బూచేపల్లి వర్గీయులు దూరంగానే ఉంటున్నారట. రెండు వర్గాల మధ్య ఉప్పు నిప్పులా ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదట పోలీసులకు. మరి.. సమస్యను సర్దుబాటు చేసేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!