హుజురాబాద్లో టీఆర్ఎస్ వ్యూహం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్లో టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఎంచుకుందా? గత ఉపఎన్నికలకు భిన్నంగా పార్టీలో సీనియర్లను రంగంలోకి దించుతున్నారా? ఆసక్తి రేకిత్తిస్తోన్న గులాబీ శిబిరం ఎత్తుగడలను ఈ స్టోరీలో చూద్దాం.
హుజురాబాద్పై పూర్తిస్థాయి పట్టుకోసం దృష్టి
Also Read
ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రాటజీ పక్కాగా ఉంటుంది. ఉపఎన్నికల్లో అంతకు మించిన వ్యూహాలు అధికార పార్టీ సొంతం. ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్లోనూ అలాంటి వ్యూహాలకే పదునుపెడుతోంది గులాబీ పార్టీ. ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చే నాటికే.. హుజురాబాద్ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతోందట.
మండలస్థాయిలో ఇంఛార్జుల పని మొదలైంది!
ఇప్పటికే మండలాల వారీగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంఛార్జ్లను నియమించింది టీఆర్ఎస్. పార్టీ పిలుపు అందుకున్న నాయకులు.. తమకు అప్పగించిన ప్రాంతాలకు వెళ్లిపోయారు. అక్కడ కాలు పెడుతూనే ఎన్నికల ప్రణాళికల్లో మునిగిపోయారట. గ్రామస్థాయిలో ఉపఎన్నికకు టీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నిత్యం వారితో మాట్లాడటం.. ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేందుకు చేపట్టాల్సి పనులపై దిశానిర్దేశం చూస్తున్నట్టు సమాచారం.
ఉద్యమనాయకుల ద్వారానే ఈటలకు కౌంటర్
బీజేపీ నుంచి బరిలో దిగాలని చూస్తోన్న ఈటల రాజేందర్.. పదే పదే తాను ఉద్యమకారుడినని చెప్పుకొంటున్నారు. టీఆర్ఎస్లో తనను విమర్శించేవాళ్లంతా పార్టీలోకి మధ్యలో వచ్చినవాళ్లేనని తిప్పికొడుతున్నారు. ఈ విషయంలో ఈటలకు గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించిందట టీఆర్ఎస్. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారికితోడుగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన టీఆర్ఎస్ నేతలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, అక్కడ మోహరింప చేయనున్నట్టు తెలుస్తోంది.
మరింత మంది ఉద్యమ నాయకులు సిద్ధం
ఈ వ్యూహంలో భాగంగానే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్తోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులను హుజురాబాద్ పంపబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినోద్కుమార్ ఆల్రెడీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఉపఎన్నిక ప్రచారం ఊపందుకున్న తర్వాత ఉద్యమ నాయకులు మరికొంత మంది వెళ్తారని.. ఇందుకోసం జాబితా కూడా సిద్ధమైందని తెలుస్తోంది. టీఆర్ఎస్లోని ఉద్యమ నాయకులు పెద్ద సంఖ్యలో హుజురాబాద్లో మోహరిస్తే ఈటల మాటలకు గట్టిగా కౌంటర్ ఇవ్వొచ్చని అనుకుంటోంది అధికారపార్టీ శిబిరం.
పదునెక్కుతున్న టీఆర్ఎస్ గెలుపు వ్యూహాలు
ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికలను మంత్రి హరీష్రావు, మాజీ ఎంపీ వినోద్కుమార్ ఇద్దరూ పర్యవేక్షిస్తున్నారు. గెలుపు వ్యూహాలను పదునెక్కిస్తున్నారు. దీంతో గతంలో జరిగిన ఉపఎన్నికలకంటే హుజురాబాద్ ఉపపోరు రసవత్తరంగా సాగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..