హుజురాబాద్లో టీఆర్ఎస్ వ్యూహం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్లో టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఎంచుకుందా? గత ఉపఎన్నికలకు భిన్నంగా పార్టీలో సీనియర్లను రంగంలోకి దించుతున్నారా? ఆసక్తి రేకిత్తిస్తోన్న గులాబీ శిబిరం ఎత్తుగడలను ఈ స్టోరీలో చూద్దాం.
హుజురాబాద్పై పూర్తిస్థాయి పట్టుకోసం దృష్టి
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రాటజీ పక్కాగా ఉంటుంది. ఉపఎన్నికల్లో అంతకు మించిన వ్యూహాలు అధికార పార్టీ సొంతం. ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్లోనూ అలాంటి వ్యూహాలకే పదునుపెడుతోంది గులాబీ పార్టీ. ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చే నాటికే.. హుజురాబాద్ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతోందట.
మండలస్థాయిలో ఇంఛార్జుల పని మొదలైంది!
ఇప్పటికే మండలాల వారీగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంఛార్జ్లను నియమించింది టీఆర్ఎస్. పార్టీ పిలుపు అందుకున్న నాయకులు.. తమకు అప్పగించిన ప్రాంతాలకు వెళ్లిపోయారు. అక్కడ కాలు పెడుతూనే ఎన్నికల ప్రణాళికల్లో మునిగిపోయారట. గ్రామస్థాయిలో ఉపఎన్నికకు టీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నిత్యం వారితో మాట్లాడటం.. ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేందుకు చేపట్టాల్సి పనులపై దిశానిర్దేశం చూస్తున్నట్టు సమాచారం.
ఉద్యమనాయకుల ద్వారానే ఈటలకు కౌంటర్
బీజేపీ నుంచి బరిలో దిగాలని చూస్తోన్న ఈటల రాజేందర్.. పదే పదే తాను ఉద్యమకారుడినని చెప్పుకొంటున్నారు. టీఆర్ఎస్లో తనను విమర్శించేవాళ్లంతా పార్టీలోకి మధ్యలో వచ్చినవాళ్లేనని తిప్పికొడుతున్నారు. ఈ విషయంలో ఈటలకు గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించిందట టీఆర్ఎస్. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారికితోడుగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన టీఆర్ఎస్ నేతలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, అక్కడ మోహరింప చేయనున్నట్టు తెలుస్తోంది.
మరింత మంది ఉద్యమ నాయకులు సిద్ధం
ఈ వ్యూహంలో భాగంగానే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్తోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులను హుజురాబాద్ పంపబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినోద్కుమార్ ఆల్రెడీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఉపఎన్నిక ప్రచారం ఊపందుకున్న తర్వాత ఉద్యమ నాయకులు మరికొంత మంది వెళ్తారని.. ఇందుకోసం జాబితా కూడా సిద్ధమైందని తెలుస్తోంది. టీఆర్ఎస్లోని ఉద్యమ నాయకులు పెద్ద సంఖ్యలో హుజురాబాద్లో మోహరిస్తే ఈటల మాటలకు గట్టిగా కౌంటర్ ఇవ్వొచ్చని అనుకుంటోంది అధికారపార్టీ శిబిరం.
పదునెక్కుతున్న టీఆర్ఎస్ గెలుపు వ్యూహాలు
ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికలను మంత్రి హరీష్రావు, మాజీ ఎంపీ వినోద్కుమార్ ఇద్దరూ పర్యవేక్షిస్తున్నారు. గెలుపు వ్యూహాలను పదునెక్కిస్తున్నారు. దీంతో గతంలో జరిగిన ఉపఎన్నికలకంటే హుజురాబాద్ ఉపపోరు రసవత్తరంగా సాగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!