తెలంగాణలో రెండు ఉద్యోగ సంఘాలకే ప్రాధాన్యం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యోగ సంఘాలు చురుకుగా పనిచేశాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా అంతే యాక్టివ్గా ఉన్నాయి. కానీ.. ఆ రెండు సంఘాలకే ప్రాధాన్యం ఇవ్వడంపై.. మిగతావాళ్లు కత్తులు నూరుతున్నారట. ఉద్యమంలో పాల్గొన్నవారిపై ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రెండు ఉద్యోగ సంఘాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా?
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్నలా తమ పరిస్థితి మారిందని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొన్ని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం అన్ని సంఘాలను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అసలు రాష్ట్రంలో ఇన్ని సంఘాలు అవసరమా అని అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలలో ఒకటి రెండింటికి మాత్రమే ప్రాధాన్యం దక్కుతోంది.
మండిపడుతున్న ఇతర ఉద్యోగ సంఘాలు..!
పీఆర్సీపై వివిధ ఉద్యోగ సంఘాలను పిలిచి అభిప్రాయాలు తీసుకున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అప్పుడే కొన్ని సంఘాలను పిలవకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సీఎస్తో సమావేశాలకు వెళ్లిన మరికొన్ని సంఘాలు వ్యతిరేకంగా మాట్లాడాయి. దీంతో ఉద్యోగ సంఘాల తీరుపై నాడు చర్చ జరిగింది. ఉద్యోగ అంశాలపై టీజీవో, టీఎన్జీవో నేతలను.. టీచర్ల సమస్యలపై PRTU నేతలను మాత్రమే పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ వైఖరిపై ఇతర సంఘాలు మండిపడుతున్నాయి.
తెలంగాణలో ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వలేదట..!
తాజాగా రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఉద్యోగ విభజన గైడ్లైన్స్ ఫైనల్ చేసే విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేవలం రెండు ఉద్యోగ సంఘాలనే పిలిచి చర్చించారు. ఉద్యోగ కేటాయింపు సందర్భంగా ఏదైనా సమస్యలు వస్తే టీజీవో, టీఎన్జీవోలతోపాటు గుర్తింపు పొందిన యూనియన్లతో చర్చించాలని గైడ్లైన్స్లో ప్రస్తావించింది ప్రభుత్వం. ఈ వైఖరి మిగతా సంఘాలకు పుండుమీద కారం చల్లినట్టు అయిందట. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రెండు సంఘాలే పాల్గొన్నాయా? అని ప్రశ్నిస్తున్నాయి. పైగా తెలంగాణ వచ్చాక ఒక్క సంఘానికి కూడా గుర్తింపు ఇవ్వలేదని.. అసలు ఆ ప్రక్రియే చేపట్టకుండా గుర్తింపు సంఘాలు అని ప్రస్తావించడం ఆశ్చర్యంగా ఉందని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు ఉన్న సంఘాలకు తెలంగాణలో కూడా గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్ పెండింగ్లో ఉందని గుర్తు చేస్తున్నాయి. ఇదే అంశంపై ఒక సంఘం.. సీఎస్కు లేఖ కూడా రాసింది.
వివక్ష వెనక కుట్ర ఉందని అనుమానం..!
ఉద్యోగ సంఘాలపట్ల వివక్ష వెనక కుట్ర ఉండొచ్చన్నది కొందరి అనుమానం. రెండు సంఘాలకే ప్రాధాన్యం ఇస్తే.. మిగతా యూనియన్లు క్రమంగా ఉనికి కోల్పోయి.. నిర్వీర్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపైనే ఆయా సంఘాల మధ్య గ్యాప్ వస్తున్నట్టు సమాచారం. ఒకరినొకరు సందేహించుకునే పరిస్థితి వస్తోందట.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: టాప్ బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్.. కానీ బుడ్డోడినే వణికించిన ‘ఆ ఒక్కడు’ ఎవరంటే?
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..