Vishaka East Politics : ఆ నియోజకవర్గం వైసీపీలో టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీలో వర్గపోరుపై నేరుగా అధినేతకే ఫిర్యాదు చేశారట ఆ ఇంఛార్జ్. ఇప్పుడేం జరుగుతుంది? తాడేపల్లికి పిలుస్తారా? మందలిస్తారా.. మార్గం చూపుతారా? ఆ నియోజకవర్గం వైసీపీలో టెన్షన్ పీక్స్కు చేరుకుంటోందా? లెట్స్ వాచ్..!
ఉమ్మడి విశాఖజిల్లాలో వైసీపీకి అంతర్గత రాజకీయాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. పాయకరావుపేట, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో కుమ్ములాటలు కొలిక్కి వచ్చాయని ఊపిరిపీల్చుకుంటే ఇప్పుడు “ఈస్ట్”లో హైఓల్టేజ్ మొదలైంది. కొన్ని సంఘటనలపై ఇంఛార్జ్ విజయనిర్మల నేరుగా సీఎంగాకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. రెండు పేజీల లేఖలో ముఖ్య నాయకులు, వార్డు కార్పొరేటర్ల పనితీరు, అవినీతిని ప్రస్తావించినట్టు భోగట్టా. దీంతో హైకమాండ్ నుంచి ఎటువంటి రియాక్షన్ వుంటుందో అని అంతా కలవర పడుతున్నారట.
Also Read
ఇటీవల వాహనమిత్ర పంపిణీ కోసం భారీ సభ నిర్వహించారు. ఇంఛార్జ్గా విజయనిర్మల పెట్టిన అన్ని ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ఈస్ట్ రాజకీయాల్లో పరిణామాలు మరింత వేగంగా మారాయి. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబును తూర్పులో ఎదుర్కోవాలంటే వైసీపీ నేతలు ఐక్యంగా కదలాలన్నది అధినాయకత్వం ఆలోచన. కానీ.. గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. విజయనిర్మల కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యంపై మిగిలిన గ్రూపులు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇంఛార్జ్గా ఆమెను తొలగించాలనే డిమాండ్తో తెరచాటు వ్యవహారాలు ఊపందుకున్నాయట. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, మేయర్ హరివెంకట కుమారి, విజయనిర్మల గ్రూపులు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నాయి.
పార్టీ పెద్దలకు పితూరీలు పెరగడంతోపాటు వైసీపీ కార్పొరేటర్లలో సైతం చీలిక వచ్చింది. పరిస్థితి చెయ్యి దాటకుండా ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి.. మూడు వర్గాలను వేర్వేరుగా పిలిపించి మాట్లాడారు. కలిసి పనిచేయకపోతే కఠిన వైఖరి తప్పదని హెచ్చరించారు కూడా. ఈ క్రమంలోనే విజయనిర్మల నేరుగా సీఎంకు ఫిర్యాదు చెయ్యడం చర్చగా మారింది. దీనికంటే ముందు ఆసక్తికరమైన పరిణామాలు జరిగినట్టు భోగట్టా. ఇటీవల విశాఖకు వచ్చిన ఇంఛార్జ్ మంత్రి విడదల రజనీతో తూర్పు ఇంఛార్జ్ విజయనిర్మల సమావేశం అయ్యారు. అంతర్గత కుమ్ములాటలు, టికెట్ రాకుండా అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయట. ఈ విషయంలో తనకు ఎదురైన అనుభవాలను మంత్రి రజనీ విజయనిర్మలతో షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చిలకలూరిపేటలో వాటిని ఎలా ఎదుర్కోన్నదీ చెప్పారట. ఆ మీటింగ్ తర్వాత విజయనిర్మల వ్యూహం మార్చినట్టు సమాచారం. నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారనే చర్చ జరుగుతోంది. కీలకమైన నియోజకవర్గం విషయంలో గ్రూప్ రాజకీయాలను హైకమాండ్ సీరియస్గా తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. నేరుగా అధినేత దగ్గరకే పంచాయితీ వెళ్లడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. అందరి లెక్కలూ తేలే సమయం దగ్గర పడిందని అనుకుంటున్నారట.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!