Udayagiri Assembly constituency :ఆ నియోజకవర్గంలో టికెట్ కోసం స్పీడందుకున్న అధికార పార్టీ నేతల కదలికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udayagiri Assembly constituency : ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కదలికలు స్పీడ్ అందుకున్నాయి. ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా పావులు కదిపేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే.. వివిధ సమీకరణాలను ముందు పెట్టుకుని టికెట్ కోసం గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి. ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు సాధించారని అనుకున్నా.. 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. స్థానిక నేతలకు.. చంద్రశేఖర్రెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక.. టికెట్ల కేటాయింపు ఆ విభేదాలను మరింత పెంచాయి. ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి తీరుకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే రోడ్డెక్కి ధర్నాలు చేశారు. చివరకు పార్టీ పదవులను సైతం తనకు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై వైసీపీ పెద్దలకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.
Also Read
ప్రస్తుతం అవకాశం చిక్కితే చాలు.. ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి. చాలా మంది వ్యతిరేకంగా ఉండటంతో ఎమ్మెల్యేలో కూడా అసహనం పెరుగుతోందట. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా.. లేదంటే తన పని తాను చేసుకుంటానని ఇటీవల చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. టికెట్పై ధీమా లేకపోవడం వల్లే ఎమ్మెల్యే అలాంటి ప్రకటనలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ఛాన్స్ ఇస్తే బరిలో దిగేందుకు పార్టీ నేతలు సై అంటున్నారు. పనిలో పనిగా పావులు కదిపేస్తున్నారు.
IVRS పద్దతి ద్వారా కొన్ని సంస్థలు ఉదయగిరిలో సర్వేలు చేపట్టాయి. ఉదయగిరిలో ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అని ఆ సర్వేలో ప్రశ్నించడంతో.. చంద్రశేఖర్రెడ్డిని మార్చేస్తారని అనుకుంటున్నారట. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్రెడ్డి, వైసీపీ నేత కావ్య కృష్ణారెడ్డిలు ఉదయగిరిపై గట్టిగానే ఫోకస్ పెట్టారట. వైసీపీ మండలస్థాయి నాయకులతో కావ్య కృష్ణారెడ్డి తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గంలో తన ట్రస్ట్ ద్వారా సేకా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ విధంగానూ పరిచయాలు పెరగడంతో.. రాజకీయంగా అనుకూల పరిస్థితులు సృష్టించుకునే పనిలో ఉన్నారట.
మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్రెడ్డి కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఉదయగిరిపై ఈసారి మనసు పారేసుకున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలను తరచూ కలిసి మాట్లాడుతున్నారు. ఆ మధ్య జరిగిన ఉదయగిరి వైసీపీ ప్లీనరీకి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు కూడా. వీళ్లే కాదు.. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి సైతం ఉదయగిరి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారట. పార్టీలో తనకు పరిచయం ఉన్న పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తంమీద ఉదయగిరిలో వైసీపీ నేతలు ఏ ముగ్గురు కలిసినా.. టికెట్ కోసం పోటీ పడుతున్న వారి గురించే చర్చ జరుగుతోంది. మరి.. పార్టీ ఆలోచనలేంటో చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!