OTR: తెలంగాణ CMOలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ అసలు వ్యూహమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ సీఎంవోలో ప్రక్షాళన పర్వాన్ని పూర్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. ప్రభుత్వం ఏర్పడ్డ రెండున్నరేళ్ల కాలంలోనే ఇంతటి భారీ మార్పులు జరగడంతో బ్యూరోక్రసీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత విశ్వాసపాత్రులుగా పేరు తెచ్చుకుని, కీలక సబ్జెక్టులను పర్యవేక్షించిన ఐదుగురు అధికారులను ఒకేసారి పక్కన పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎస్ అధికారి షానవజ్ ఖాసిం, ఐఏఎస్ అధికారిణి సంగీత, చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డిలతో పాటు శ్రీనివాస రాజులను సీఎంఓ బాధ్యతల నుంచి తప్పించింది ప్రభుత్వం. అయితే వీరందరికీ లూప్ లైన్ కాకుండా, ఇతర విభాగాల్లో గౌరవప్రదమైన పోస్టులే కేటాయించారు. అయినప్పటికీ అసలు సీఎంఓ నుంచి ఎందుకు తప్పించారనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కొంతకాలంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక ప్రాజెక్టుల ఫైళ్ల క్లియరెన్స్లో తీవ్ర జాప్యం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారట. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సరైన సమన్వయం కుదరకపోవడం, ముఖ్యమంత్రి ఆశించిన వేగంతో ఫైళ్ళు డెలివరీ చేయలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అటు ప్రజాక్షేత్రంలో, ఇటు పాలనలో దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి.. అధికారుల అలసత్వాన్ని ఏమాత్రం సహించేది లేదనే బలమైన సంకేతాన్ని ఈ ప్రక్షాళన ద్వారా పంపినట్టు విశ్లేషిస్తున్నారు. ఈ మార్పు వెనుక రాజకీయ వ్యూహాలు కూడా గట్టిగానే ఉన్నట్లు భావిస్తున్నారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, మళ్లీ తానే ముఖ్యమంత్రి కావాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రాబోయే రోజుల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టించాలని డిసైడ్ అయ్యారు. అందుకే సీఎంఓను మరింత చురుకైన, అనుభవజ్ఞులైన అధికారులతో పునర్వ్యవస్థీకరిస్తున్నారు. మొత్తానికి తప్పించిన అధికారులు తప్పు చేశారా? లేక సీఎం అంచనాలను అందుకోలేకపోయారా? అన్నది పక్కన పెడితే.. ఈ ‘సీఎంఓ క్లీన్ అప్’ మాత్రం తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్.
Also Read
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన శ్రీనివాస్రాజుకు కీలకమైన రెరా బాధ్యతలు అప్పగించడం వెనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో దూకుడు పెంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక అజిత్రెడ్డిని పక్కకు తప్పించడం వెనుక సీనియర్ ఐఎస్ఎస్లు కొంతమంది కారణంగా చెబుతున్నారు. తమకన్నా తక్కువ క్యాడర్ అధికారి కావడంతో వచ్చిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో అనివార్యంగా అజిత్రెడ్డిని పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!