టీటీడీ మాజీ ఛైర్మన్ మంత్రి పదవిపై దృష్టి పెట్టారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీలో ఆయన సీనియర్ నేత. సీఎంకి దగ్గరి బంధువు కూడా. కానీ ఆయన ఇప్పుడు సంతృప్తిగా లేరట. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్న ఆయనకు నిరాశే మిగిలింది. ఇప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాలని.. చక్రం తిప్పాలని చూస్తున్న ఆ నేత ఫ్యూచర్ ఎలా ఉంటుందో? ఇంతకీ ఎవరాయన?
2014లో ఒంగోలు ఎంపీగా గెలిచారు
Also Read
అధికార పార్టీ వైసీపీలో టీటీడీ తాజా మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్చగా మారారు. ఆయనకు మళ్లీ టీటీడీ బాధ్యతలు అప్పగిస్తారని ఒకవైపు చర్చ నడుస్తోంది. ఆయన మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నారట. ఆ విధంగా వైవీ సుబ్బారెడ్డి రాజకీయ భవిష్యత్పై వైసీపీలో చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి.. సీఎం జగన్కి బాబాయ్. గతంలో వైఎస్ఆర్ వెంటఉంటూ పాలిటిక్స్ నడిపారు. వైఎస్ మరణం తరువాత జగన్కి అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు వైవీ. పార్టీ అధికారంలో లేకపోయినా.. ఒంగోలు పార్లమెంట్లో తనదైన ముద్ర వేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహంలో భాగంగా సుబ్బారెడ్డిని పక్కన పెట్టి టీడీపీ నుండి వచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి టికెట్ ఇచ్చింది వైసీపీ. దీంతో అసంతృప్తిగానే ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకొన్నారు.
read also : ఏపీ రాజకీయాలపై సిసిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
అనుచరులకు న్యాయం చేయలేకపోతున్నానని ఫీలింగ్
ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోనైనా, కేంద్రంలోనైనా ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని వైవీ భావించారు. కానీ సీఎం జగన్.. బాబాయ్ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. రెండేళ్లపాటు టీటీడీ చైర్మన్గా ఉన్నారాయన. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడంతో తన అనుచరులకు న్యాయం చేయలేక పోతున్నానని వైవీ ఫీలవుతున్నారట.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం
గతంలో ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలు వైవీ సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి. జిల్లాలో ఆయనకు ఒకవర్గం కూడా ఏర్పాటైంది. టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత ఆయన జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా.. ఆయన వర్గానికి పదవులు దక్కడం లేదని బాధపడుతున్నారట వైవీ. టీటీడీ ఛైర్మన్ పదవీకాలం పూర్తి కావడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారట. అయితే వైవీకి మరోసారి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కుతుందని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆయన మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉందని తన అనుచరుల వద్ద చెబుతున్నారట.
మంత్రి పదవిపై దృష్టి పెట్టారా?
రాజ్యసభ స్థానంపైనా ఫోకస్ ఉందా?
సీఎం జగన్ అవకాశం ఇస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని వైవీ చెబుతున్నారట. రెండున్నరేళ్లలో కేబినెట్లో మార్పులు ఉంటాయని సీఎం జగన్ గతంలోనే చెప్పడంతో వైవీ దృష్టి మంత్రి పదవిపై పడిందని అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం ఉండటంతో రాజ్యసభ స్థానంపై కూడా ఆయన దృష్టి సారించారని టాక్. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్గా కొనసాగుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వైవీ ప్రయత్నిస్తుండటంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అన్న చర్చ హాట్ టాపిక్గా మారింది. సుబ్బారెడ్డి అనుకున్నట్టుగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అధికార చక్రం తిప్పుతారా…లేక అబ్బాయి జగన్ చెప్పినట్టే విని తిరిగి టీటీడీ బాధ్యతలు తీసుకుంటారా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!