అప్పట్లో అన్న… ఇపుడు ఒరేయ్… ఆ నాయకుడి మాటల్లో మార్పు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఎమ్మెల్యే తీరు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. మొదటి సారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వెంటనే ఎమ్మెల్యేగా గెలవటమే కాదు….రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన ఘనత ఆయనకే దక్కింది. ఎన్నికల ముందేమో అందర్నీ అన్నా అని ఆప్యాయంగా పలకరించినా, ఆ ఎమ్మెల్యే మాటల్లో ఇప్పుడు ఆ మర్యాద కనపడకపోవడంతో…. అప్పుడలా.. ఇప్పుడిలా అని నేతలు గుసగుసలాడుతున్నారట.
కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం రాజకీయ పరంగా రాష్ట్రంలో గుర్తింపు కలిగిన నియోజకవర్గం. రూపాయికి బొమ్మా బొరుసు ఉన్నట్లు జమ్మలమడుగు రాజకీయాలలో మాజీ మంత్రులు ఆది నారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి లు ఉండేవారు. అయితే ఇప్పుడదంతా గతం… నిన్నమొన్నటి వరకు ఆయన పేరు సరిగ్గా చాలా మంది ప్రజలకు కూడా తెలియదు. వైద్యవృత్తిలో ఉంటూ రాజకీయాలలోకి అడుగుపెట్టారు డాక్టర్ సుధీర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ లో సీనియర్ నాయకుడిగా ఉంటూ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర హోం మంత్రి గా చేసి ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి సోదరుడి కుమారుడే సుధీర్ రెడ్డి.
Also Read
2017 సంవత్సరంలో జమ్మలమడుగు లో రాజకీయంగా మార్పులు జరిగాయి. వైసీపీ నుంచి MLA గా గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో రాజకీయాల్లోకి ఎంటరయ్యారు సుధీర్ రెడ్డి. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న నాయకత్వ బాధ్యతలను రాజకీయాలకు కొత్తైనా సుధీర్ రెడ్డికి అప్పగించారు జగన్. నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అయిన సుధీర్ రెడ్డి వస్తూ వస్తూనే అందర్నీ అన్నా…మామా.. బాబాయ్.. తమ్ముడూ అంటూ వరుసలు కలిపేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో కలిసిమెలిసిపోయారు. అప్పటికే నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి జోరుమీదుండటంతో, ఎమ్మెల్యే మర్యాద పిలుపులు కలిసివచ్చి, తక్కువ కాలంలోనే జనంతో కలిసిపోయారు.
కాలం కలిసిరావడంతో కడపజిల్లా లోని మెజారిటీలో ముఖ్యమంత్రి జగన్ తరువాత అధిక మెజారిటీ సుధీర్ రెడ్డి దక్కించుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ MLA సుధీర్ మాట తీరులో చాలా మార్పు వచ్చిందని సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలకు ముందేమో అన్నా అని ఆప్యాయంగా పలకరించిన సుధీర్ రెడ్డి ఈ మధ్య అరేయ్, ఒరేయ్ అంటూ సంభోదిస్తున్నాడని సమాచారం. కనీసం ద్వితీయ శ్రేణి నాయకులకు చిన్న చిన్న పనులు కూడా చేయటం లేదని పనుల సంగతి అటుంచితే కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని బాధపడటం నాయకుల వంతైంది.
ఇప్పటికే ఎమ్మెల్యే తీరుపై రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కేడర్ తో ప్రవర్తిస్తున్న తీరుకు నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎందుకిలా చేస్తున్నారో తెలియక తల పట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..