Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Tpcc

కొత్త పీసీసీ చీఫ్ తీరుపై కొందరు నేతలు గుర్రు !

Published Date :July 17, 2021 , 5:03 pm
By Lakshmi Narayana
కొత్త పీసీసీ చీఫ్ తీరుపై కొందరు నేతలు గుర్రు !
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్‌లో అంతే…! ఆ పార్టీలో ఇది రొటీన్‌ డైలాగ్‌. కొత్త పీసీసీ చీఫ్‌ వచ్చాక దానికి బ్రేక్‌ పడుతుందని అనుకున్నారట. కానీ.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని నిరూపిస్తున్నారు నాయకులు. ఆ అంశంపైనే ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

రేవంత్‌పై మొదలైన ఫిర్యాదుల పర్వం!

తెలంగాణ కాంగ్రెస్‌లో కయ్యాలు కామన్. ఏ చిన అంశం తెర మీదకు వచ్చినా.. అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్తాయి. కొత్త పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు ఫిర్యాదులు మొదలైనట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో కీలక నాయకులు అలకబూనడాలు షురూ అయ్యింది. ఈ వివాదాలపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట. అసలు విషయం తెలుసుకుని అవునా అని ఆశ్చర్యపోతున్నారట నాయకులు.

ధర్మపురి సంజయ్‌ చేరికపై పార్టీ నేతలు కుతకుత
నిజామాబాద్‌ జిల్లా నేతలకు చెప్పలేదట

ఇటీవల పీసీసీ చీఫ్‌ నివాసంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన ధర్మపురి సంజయ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో వివాదానికి ఈ సమావేశమే కారణం. నిజామాబాద్ జిల్లా నాయకులు.. సంజయ్ చేరికపట్ల కుతకుతలాడుతున్నారు. పీసీసీ చీఫ్‌ తన ఇంటికి సంజయ్‌ను పిలవడంపై.. నిజామాబాద్‌ జిల్లాకే చెందిన పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాష్కీ తప్పు పడుతున్నారు. ధర్మపురి శ్రీనివాస్‌కు కాంగ్రెస్‌ ఎన్నో పదవులు ఇచ్చి గౌరవిస్తే.. పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు గుడ్‌బై చెప్పారని అనుకుంటున్నారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్‌ దెబ్బతిందన్నది వారి ఆరోపణ. DS కుమారుడు సంజయ్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. అలాంటి నాయకులను పార్టీలోకి పిలవడం ఏంటన్నది పార్టీ నేతల ప్రశ్న. పైగా నిజామాబాద్‌ జిల్లా నాయకులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారట. ముఖ్యంగా మధుయాష్కీకి సమాచారం లేదట. ఇది పార్టీ వర్గాల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుందనే ఆవేదన నిజామాబాద్‌ టీమ్‌లో ఉందట. పార్టీలో చేరికలు తప్పుకాకపోయినా.. కనీసం సమాచారం ఇవ్వాలని కొందరు నాయకులు గుర్రుగా ఉన్నారట. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

సోనియా, రాహుల్‌, ఠాగూర్‌లకు ఫిర్యాదు

క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని.. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీ, AICC రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌లకు పంపిన లేఖల్లో ప్రస్తావించడం కీలకంగా మారింది. ధర్మపురి సంజయ్‌, ఎర్ర శేఖర్‌లపై క్రిమినల్‌ కేసులు ఉన్నప్పుడు పార్టీలోకి ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారట. భూపాలపల్లికి చెందిన గండ్ర సత్యనారాయణ చేరిక కూడా ఆ జిల్లా కాంగ్రెస్‌ నాయకులకు సమాచారం లేదట. ఇప్పటికే కొత్త పీసీసీ నియామకంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులంతా తాజా పరిణామాల తర్వాత యాక్టివ్‌ అయినట్టు చెబుతున్నారు.

మధుయాష్కీ నుంచే అసంతృప్తి పర్వం మొదలైందా?

అధిష్ఠానానికి పీసీసీ చీఫ్‌పై చేసిన ఫిర్యాదు గురించి తెలిసిన వెంటనే పార్టీలో కొత్త చర్చ మొదలైంది. రేవంత్‌కు కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాలను రుచి చూపించేందుకు నేతలు నడుం కట్టారని చెవులు కొరుక్కుంటున్నారట. పైగా ఈ అసంతృప్తి పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ నుంచే మొదలు కావడం ఆసక్తిగా మారింది. పదవి చేపట్టే సమయంలో అందరినీ కలుపుకొని వెళ్తా.. సమిష్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు ఏకపక్షంగా వెళ్తున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారట. జిల్లా నేతలకు చెప్పకపోవడం.. అప్పట్లో కాంగ్రెస్‌కు ద్రోహం చేసినవారిని ఎలా ప్రోత్సహిస్తారని పీసీసీ సారథిపై ఒంటికాలిపై లేస్తున్నారట. సో.. కొత్త టీమ్‌పై మొదలైన ఈ అసంతృప్తి సెగ రానున్న రోజుల్లో ఏ విధంగా మలుపు తీసుకుంటుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • off the record
  • telanagana
  • TPCC chief Revanth Reddy

తాజావార్తలు

  • Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్

  • Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో.. మిస్ ఇండియా!

  • YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

  • Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

  • Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి? 

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions