సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితేంటి..?
నేతలు ఒకవైపు …కేడర్ మరోవైపు. ఇక ఎమ్మెల్యేదైతే అసలు ఏ దారో తెలియదు. ఇది అ నియోజక వర్గంలో అధికారపార్టీ పరిస్థితిపై జరుగుతున్న చర్చ. అధికారంలో ఉన్నా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండటంతో అ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజక వర్గం అధికార వైసీపీలో పెద్ద చర్చకు కారణంగా మారింది. ఇక్కడ 2014 లో ఆదిమూలం పోటీచేసి ఓడిపోయారు. అయినా అధిష్ఠానం 2019 ఎన్నికలలోనూ అవకాశం ఇచ్చింది. జిల్లాలోనే అత్యధికంగా 45 వేలకుపైగా మెజారిటీ గెలిచారు. పార్టీసైతం అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడ పార్టీ పరిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారిపోతుందనే ప్రచారం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ జోరుగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల నాటికే పూర్తిగా కంట్రోల్ తప్పిందని లోకల్ కేడర్ కోడై కూస్తోంది.
Also Read
పార్టీ పదవుల కోసం, నామినేటెడ్ పదవుల కోసం నియోజకవర్గంలో మండలాల్లో నాయకుల మధ్య వర్గ పోరు పీక్స్ కి చేరిందంటున్నారు. ఎంపీపీ పదవికోసం ఎంపీటీసీ అభ్యర్థులు వర్గాలుగా విడిపోయారని సమాచారం. ఇన్ని జరుగుతున్నా, ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం ఉన్నా లేనట్లుగానే వ్యవహరిస్తూన్నారట. కనీసం ప్రభుత్వ పథకాల అమల్లోను ఎమ్మెల్యే యాక్టివ్ గా ఉండటం లేదట. ఎమ్మెల్యేని జనం కలవాలంటేనే పెద్ద టాస్క్ గా మారిందట. అయన్ని కలవాలంటే పుత్తూరు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.
ఇక నియోజకవర్గంలో సురుట్టుపల్లి దేవస్థానంలో చైర్మన్, సభ్యుల వ్యవహారం తీవ్ర చర్చకు కారణమైంది. ఎమ్మెల్యే వర్గం, మంత్రి వర్గం గొడవలకు దిగారు. నియోజకవర్గంలోని మండలాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు చేయాలని కేడర్ ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారట. ఎమ్మెల్యే కంటే… నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు …డిప్యూటీ సిఎం నారాయణ స్వామి అనుచరుల పెత్తనం ఎక్కువగా సాగుతోందని ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉందని టాక్. ఈ పరిణామాల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారని, సత్యవేడు, వరదయ్యపాళెం, పిచ్చటూరు, బుచ్చి నాయుడు కండ్రిగలలో అయితే ఈ గోడవలు పీక్స్ లో ఉన్నాయట. ఆ ఎఫెక్ట్ తిరుపతి ఉప ఎన్నికల సమయంలోను కనిపించిందని, దీని కారణంగానే సత్యవేడు నుండి ఎంపీకి ఆశించిన స్థాయిలో మెజారిటీ రాలేదని టాక్. ప్రభుత్వ పథకాలను, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన నేతలు.. ఎవరి స్వలాభం కోసం వారు అసలు బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారట. ఈ వర్గాల గొడవలు చూసిన ఎమ్మెల్యే సైతం తనకెందుకని సైలెంట్ గా ఉంటున్నారని నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు జిల్లా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చాలామంది నాయకులు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చెప్పినా ప్రయోజనం లేకపోగా ఇంకా ఎక్కువ అవడం కొసమెరుపు అంటున్నారు. జిల్లా నేతల్లో, కేడర్ లోను అక్కడ అసలు ఏం జరుగుతుందనే చర్చ జోరుగానే సాగుతోంది. మరి సత్యవేడులో పార్టీని ఎవరు ఎలా గాడిలో పెడతారో అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!