Revanth : రెడ్లకు పగ్గాలు ఇవ్వాలన్న రేవంత్ వ్యాఖ్యలపై పార్టీలో దుమారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నాటకలో జరిగిన రెడ్డి సామాజికవర్గం సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన కామెంట్స్ చుట్టూ కాంగ్రెస్లో చర్చతోపాటు రచ్చ రచ్చ అవుతోంది. రెడ్లకు పగ్గాలు అప్పగించాలన్న ఆయన కామెంట్స్పై కాంగ్రెస్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై సీరియస్గా స్పందించిన వీ హన్మంతరావు PACలో చర్చిస్తామని ప్రకటించారు. VH లోలోన రగిలిపోతున్నా… పార్టీ నేతలు ఎవరూ మీడియా ముందుకు వెళ్లొద్దన్న రాహుల్గాంధీ సూచనలతో వేచి చూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్రెడ్డి మాత్రం కామ్గా ఉండలేదు. పీసీసీ చీఫ్ రేవంత్పై ఘాటైన విమర్శలు చేశారు.
పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కాంగ్రెస్ చరిత్ర తెలియదు.. చరిత్ర తెలుసుకుంటే మంచిది అని రేవంత్పై గట్టిగానే ఫైర్ అయ్యారు మహేశ్వర్రెడ్డి. అయితే రేవంత్ వ్యాఖ్యలతోపాటు.. మహేశ్వర్రెడ్డి చేసిన కామెంట్స్పైనా AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అభ్యంతరం వ్యక్తం చేశారట. గాంధీభవన్లో కూర్చుని .. పీసీసీ చీఫ్కు వ్యతిరేకంగా పార్టీ అంతర్గత అంశంపై మహేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడటంపై ఠాగూర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్కు చెందిన ఓ నాయకుడికి ఫోన్ చేసి.. అసలేం జరుగుతోంది.. ? అంతా మీ ఇష్టమేనా? అని చిందులు తొక్కారట ఠాగూర్. రేవంత్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు ఉంటే.. వాటిని నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పాలి కానీ.. పార్టీ నాయకులే దానిపై మీడియాకు ఎలా ఎక్కుతారు? పార్టీని ఎలా పలుచన చేస్తారు అని ప్రశ్నలు సంధించారట. ఇంతలోనే ఈ ఎపిసోడ్పై బయటకొచ్చిన లేఖ కలకలం రేపింది.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి లేఖ రాశారు. కర్నాటకలో చేసిన కామెంట్స్ను తప్పుపడుతూనే.. వైఎస్ ఒక్కరి వల్లే 41 సీట్లు వచ్చాయని చెబితే.. అది రాహుల్, సోనియాగాంధీలను అవమానించడమేనని యాష్కీ ఫైర్ అయ్యారు. YS సీఎం అయినప్పుడు DS పాత్ర లేదా అని ప్రశ్నలు సంధించారాయన. ఈ లేఖ గురించి తెలియగానే పార్టీ ఇంఛార్జ్ ఠాగూర్ ట్విట్ చేశారు. కాంగ్రెస్ అంతర్గత అంశాలపై మీడియా ముందుకు వెళ్లొద్దని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాలను ఆ ట్వీట్కు జత చేసి.. అందరినీ హద్దుల్లో ఉండాలని చెప్పకనే చెప్పారు ఠాగూర్.
మొత్తానికి రెడ్ల పంచాయితీ కాంగ్రెస్లో కొత్త రగడకు బీజం వేసింది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో రోడ్డెక్కేందుకు నాయకులు రెడీ అయ్యారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం సైతం గుర్రుగా ఉంది. రేవంత్ కామెంట్స్పైనా హైకమాండ్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. మరి.. కొత్త పంచాయితీ కాంగ్రెస్లో ఎలాంటి సెగలు రేపుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!