Prakasam District Politics : ఆ నియోజకవర్గ వైసీపీలో పరిస్థితులు ఎప్పుడు అయోమయమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam District Politics : ఆ నియోజకవర్గ వైసీపీలో పరిస్థితులు ఎప్పుడూ అయోమయమేనా? ఇంఛార్జ్గా ఉన్న నేత డైలమాలో ఉన్నారా? పదవి ఉంటుందో లేదో ఆయనకు అర్థం కావడం లేదా? మరో నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా.. ఎక్కడ పీటముడి పడింది? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా నియోజకవర్గం?
బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్గా ఉన్నారు రావి రామనాథం బాబు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన గొట్టిపాటి భరత్ కుమార్ ఓడిపోవడం.. అప్పట్లో అద్దంకిలో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి వెళ్లడంతో భరత్ సైలెంట్ అయ్యారు. దాంతో వైసీపీ అధిష్ఠానం రావి రామనాథం బాబును పర్చూరు ఇంఛార్జిగా నియమించింది. 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ టికెట్ ఇచ్చారు. దాంతో అలిగిన రామనాథంబాబు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికలు ముగిసి ఏడాది గడవక ముందే ఏర్పడిన రాజకీయ పరిస్థితుల్లో దగ్గుబాటి సైలెంట్ అయ్యారు. టీడీపీకి గుడ్బై చెప్పి రావి తిరిగి వైసీపీలోకి రావడం.. ఇంఛార్జ్ కావడం చకచకా జరిగిపోయింది. కానీ.. స్థానిక వైసీపీ నేతలు మాత్రం ఆయన్ని ఓన్ చేసుకోవడం లేదు. టీడీపీలో చేరి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి పెత్తనం ఏంటనేది వారి ప్రశ్న. ఈ వివాదాలు శ్రుతిమించడంతో.. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని అభిప్రాయ పడిన వైసీపీ అధిష్ఠానం పర్చూరు ఇంఛార్జ్ను మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. ఇదే మరోసారి పర్చూరు వైసీపీని డైలమాలో పడేసింది.
Also Read
సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదన్రెడ్డిని ఇంఛార్జ్గా నియమించాలని అనుకున్నారట. అయితే సామాజిక సమీకరణాల కూర్పులో భాగంగా.. కాపులకు ఆ సీటును కేటాయించాలని భావించారట. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను పర్చూరు నుంచి పోటీ చేయాలని కోరడం.. ఆయన తిరస్కరించడం.. తర్వాత కొన్ని షరతులతో బాధ్యతలు తీసుకునేందుకు ముందు రావడం జరిగిందని టాక్. ఈ పరిణామాలు రామనాథంబాబుకు రుచించలేదని సమాచారం. అధిష్ఠానం ఏదో ఒక ప్రకటన చేసేవరకు కామ్గా పార్టీ పనిచేసుకుంటే మంచిదని నిర్ణయించారు రామనాథంబాబు. పార్టీ కోసం తిరుమలకు పాదయాత్ర చేశారు. గడప గడపకు మన ప్రభుత్వంలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే పర్చూరు ప్లీనరీ విషయంలో అనుకున్నంతగా సక్సెస్ కాలేదట.
ఇటీవల కాలంలో నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో వైసీపీ అధిష్ఠానం ఫోకస్ పెడుతోంది. ఆ క్రమంలో పర్చూరు సమస్యను కొలిక్కి తెచ్చి గాడిలో పెట్టాలని చూస్తున్నారట. పర్చూరు ఇంఛార్జ్గా ఎవరిని పెడితే బాగుంటుందో అని మరోసారి చర్చ జరిగిందట. కాపు సామాజికవర్గానికే ఇంఛార్జ్ పదవి ఇస్తే కలిసి వస్తుందని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి పలువురి పేర్లను సిఫారసు చేశారట. అయితే సీఎం జగన్ ఏం ఆలోచిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. మరోసారి ఆమంచితో మాట్లాడి ఆయన్నే ఫైనల్ చేస్తారా? లేక కొత్త వారిని తెరపైకి తెస్తారా అనేది చర్చగా మారింది. అదే జరిగితే రావి రామనాథంబాబు పరిస్థితి ఏంటి అనేది మరో చర్చ.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!