Off The Record : లొంగిపోయారా..? లేక అరెస్ట్ అయ్యారా..? మావోయిస్టు నేతల కేసులో కొత్త ట్విస్ట్..!
- మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారా? అరెస్ట్ చేశారా?
- దేవ్జీ, రాజిరెడ్డి లొంగిపోయినట్టు పోలీసుల ప్రెస్మీట్
- మాది లొంగుబాటు కాదు, అరెస్ట్ అంటున్న ఇద్దరు నాయకులు
- తమ సమక్షంలోనే చెబుతున్నా పోలీసులు ఎందుకు కామ్గా ఉన్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ, మల్లారెడ్డి లొంగిపోలేదా? వాళ్ళని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారా? అదే నిజమైతే… ఎందుకు లొంగుబాటు చూపించారు. సీఎం సమక్షంలో లొంగిపోవడం అంతా పోలీసుల సృష్టేనా? హఠాత్తుగా దేవ్, రాజీరెడ్డి తాము లొంగిపోలేదు, అరెస్ట్ అయ్యామని ఎందుకు చెబుతున్నారు? ఇందులో మతలబు ఏంటి? మావోయిస్ట్ అగ్ర నేతలైన దేవ్జీ , రాజిరెడ్డి అరెస్ట్ అయ్యారా? లేక పోలీసులకు లొంగిపోయారా అన్న సందేహాలు కొత్తగా తలెత్తుతున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. నిజంగానే వాళ్ళని అరెస్ట్ చేస్తే… లొంగుబాటుగా ఎందుకు చిత్రించారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో ఈ ఇద్దరు నేతలతో పాటు పలువురు మావోయిస్ట్లు లొంగిపోయినట్టు భారీ ప్రెస్మీట్ పెట్టి మరీ మీడియాకు వివరించారు. దాంతో… నిజంగానే లొంగిపోయారని అంతా అనుకున్నారు.
అయితే… అసలు ట్విస్ట్ ఆ తర్వాతే వెలుగు చూసింది. రెండు రోజులుగా పోలీసుల సమక్షంలోనే మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్న దేవ్జీ, రాజీరెడ్డి మాత్రం తమది లొంగుబాటు కాదు, అరెస్ట్ అని చెబుతున్నారు. ఆపరేషన్ కగార్ కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న క్రమంలో అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. రాజిరెడ్డిని హన్మకొండలో, దేవ్జీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారని ప్రచారం చేసుకుంటున్నారు. ముందు తామే లొంగుబాటును చూపించిన పోలీసులు, అదే.. తిరిగి తమ సమక్షంలోనే తాము లొంగిపోలేదు, అరెస్ట్ చేశారని నక్సలైట్ నాయకులు చెబుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. దీంతో పోలీసులు ఎందుకు ఈ ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read
దేవ్జీ, రాజిరెడ్డి పార్టీని విభేదించి ముందుగానే బయటకు వచ్చి పోలీసుల ఆదేశాలతో పనిచేస్తున్నారని అంతకుముందు మావోయిస్ట్ పార్టీ నుండి ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న కమ్రంలో మావోయిస్ట్ పార్టీలో లుకలుకలు, విరుద్ద ప్రకటనలు, పరస్పర ఆరోపణలు, విమర్శలతో కూడిన ప్రకటనలు వచ్చిపడ్డాయి. కగార్ మొదలైనప్పటి నుంచి మావోయిస్టు అగ్ర నేతల్లో ఒకరైన మల్లోజులకు ప్రాణభయం పట్టుకుందని, అందుకే తమకు తెలియకుండా మహారాష్ట్ర ప్రభుత్వంతో టచ్లోకి వెళ్లిపోయి ఆయన లొంగిపోయారని కూడా ఒక వర్గం చెప్పింది. అలాగే ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తామని మల్లోజులు ఇచ్చిన స్టేట్మెంట్ పార్టీకి తీరని నష్టం చేసిందని. ఆ ప్రకటనతోనే చాలామంది ఆయుధాలతో వచ్చి లొంగిపోయారంటూ ఎదురుదాడి సైతం జరిగింది.
మొత్తం మీద ఈ ఇద్దరు నేతల వ్యవహర శైలిపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తున్నందున నష్టనివారణ చర్యల్లో భాగంగా లొంగిపోలేదు , అరెస్ట్ అయ్యామనే భావన ప్రజల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. అందుకు పోలీసులను ఒప్పించి ఈ అరెస్ట్ ప్రచారానికి రెండు రోజులుగా మీడియాను ఉపయోగించుకుంటున్నారని లెఫ్టిస్ట్లు కొంతమంది చెబుతున్నారు. మావోయిస్ట్ల గొడవ ఎలా ఉన్నా..ఇద్దరు అగ్రనేతలు, ఇతర మావోయిస్ట్లు లొంగిపోయినట్లు ప్రకటించిన పోలీసులు, ఇప్పడు అదే నక్సలైట్లు లొంగిపోలేదు అరెస్ట్ చేశారని చెబుతున్నా ఎందుకు కామ్గా ఉంటున్నారన్నది బిగ్ క్వశ్చన్. దీనికి తెలంగాణ పోలీసులే సమాధానం చెప్పాలి.
- Tags
- Maoist leaders
- OTR
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!