తెలంగాణలో BRS పార్టీ యాక్టివిటీ మరింత పెంచనుందా? కారుకు రిపేరు చేసి గేరు మార్చాలని డిసైడయ్యిందా? ఎర్రవల్లిలో జరిగే సమావేశంలో గులాబీ బాస్ మరమ్మత్తులు చేసి పొలిటికల్ రేస్కు కారును సిద్దం చేస్తారా? తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. ఒకవైపు బెంగాల్ ఫార్ములాతో బీజేపీ దూకుడు పెంచుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సైలెంట్గా ఉన్న కారు.. ఇప్పుడు గేరు మార్చాల్సిన సమయం వచ్చిందని డిసైడ్ అయ్యారు అధినేత కేసీఆర్. బీజేపీ దూకుడుతో పార్టీలో కొత్త టెన్షన్ మొదలు కాకముందే నేరుగా అధినేతనే రంగంలోకి దిగారు. ఈనెల 12న మంగళవారం ఎర్రవెల్లి నివాసం వేదికగా హై లెవల్ మీటింగ్ జరగబోతోంది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన కీలక నేతలు హాజరుకాబోతున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశంలో ఆయన తీసుకునే నిర్ణయాలపై పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
విజువల్స్
ఎర్రవెల్లి సమావేశం సాధారణ సమావేశం కాదంటున్నాయి పార్టీ శ్రేణులు. సుమారు పదేళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతంపై కీలక దృష్టి పెట్టారని చెబుతున్నారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను నేతలకు వివరించబోతున్నారట కేసీఆర్. సభ్యత్వ నమోదు నుంచి ఇన్ఛార్జుల నియామకం దాకా అన్నింటినీ ప్రక్షాళన చేయబోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న సభ్యత్వ నమోదును తక్షణమే ప్రారంభించాలని కెసిఆర్ భావిస్తున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారిగా ఇన్చార్జీలను సైతం ప్రకటించబోతున్నారు. రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన నేతలను సభ్యత్వ నమోదు కోసం ఇన్చార్జిలుగా పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ఇన్చార్జిలను నియమించబోతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్… గ్రౌండ్ లెవెల్ లో కొట్లాడాలంటే పార్టీ కమిటీలు వేయాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అందుకోసం పార్టీ నేతలకు ఉత్సాహం కలిగేలా పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేలా కొత్త కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. సాధారణ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం మాత్రమే ఉండటంతో కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాలని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే సభ్యత్వ నమోదు తో పాటు కమిటీల ఏర్పాటు కూడా ఫైనల్ చేయబోతున్నారు. ఎర్రవల్లి సమావేశంలో ఇంకెలాంటి సంకేతాలు ఇస్తారోనని అందరూ వెయిట్ చేస్తున్నారు.
