Off The Record: ముద్రగడకు లైన్ క్లియరైందా?
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడానికి లైన్ క్లియర్ అయినట్టేనా? డైరెక్ట్గా వెళ్ళి ఫ్యాన్ కింద సేదదీరకుండా ఆయనకు అడ్డుపడుతున్న పరిస్థితులు ఏవి? తాను తిరిగి పొలిటికల్గా యాక్టివ్ అవడంతో పాటు పద్మనాభం పెట్టుకున్న మరో టార్గెట్ ఏంటి? ఆ విషయంలో వైసీపీ నాయకత్వపు వైఖరి ఎలా ఉంది?
ముద్రగడ వైసీపీలో చేరడానికి లైన్ క్లియరైందా?
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఇన్నాళ్ళు తుని రైలు దగ్ధం కేసు ఉంది. 2016లో తుని దగ్గర రైలు తగలబెట్టిన కేసులో ఆయన పేరు కూడా ఉంది. ఆ కేసును ఇటీవల కోర్ట్ కొట్టేయడంతో తిరిగి పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు ఆయన. ముద్రగడ చివరిసారిగా 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.అంతకు ముందు సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా… 2004లో అక్కడ ఓటమితో ఇక జీవితంలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయబోనని బీష్మించుకు కూర్చున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా ఏ పార్టీ వైపు చూడలేదు ఆయన. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి ఓపెన్ ఆఫర్లు వచ్చినా కేసు కొట్టేసిన తర్వాతేనని చెబుతూ వచ్చారట. ఇప్పుడు ఆ మేటర్ క్లియరైనందున తిరిగి యాక్టివ్ అవడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారట. మనసులో మాట చెప్పకపోయినా… టిడిపి, జనసేనల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. బీజేపీ, కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న స్థితిలో అటువైపు చూసే అవకాశం లేదు. అంతిమంగా ఆయన ఫ్యాన్ కింద సేదదీరడానికే సిద్ధమవుతున్నారట.
Also Read
చిన్న కొడుకు గిరిబాబు రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారా?
వైసీపీలో తనతో పాటు చిన్న కుమారుడు గిరిబాబు కూడా సీటు ఇవ్వాలని గతంలో డిమాండ్ పెట్టారు ముద్రగడ పద్మనాభం.. అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కొడుకుని మాత్రం ఎన్నికల్లో పోటీ చేయిస్తే చాలని అనుకుంటున్నారు ఆయన. ప్రత్తిపాడులో తాను పోటీ చేయనని ఇప్పటికే చెప్పాను కాబట్టి కుటుంబ సభ్యులను కూడా అక్కడకు పంపకూడదని అనుకుంటున్నారట.. 2009లో ట్రయాంగిల్ ఫైట్ కారణంగా పిఠాపురంలో స్వల్ప తేడాతో ఓడిపోయారు ముద్రగడ. అందుకే.. గిరిబాబును అక్కడి నుంచే బరిలో దింపే ఆలోచన ఉందట. కానీ…పార్టీలోకి రమ్మని ఆహ్వానించే వరకు ఓకేగానీ… సీటు విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే ఉద్దేశ్యంలో లేదట వైసీపీ. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
పిఠాపురంలో ఏం జరుగుతోంది?
రాష్ట్రం మొత్తం మీద కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి… ప్రస్తుతం అక్కడ వైసీపీ నుంచి పెండెం దొరబాబు ఉన్నారు.. గతంలో ఇక్కడి నుంచే పీఆర్పీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్లు చూసుకుని… సాధ్యా సాధ్యాలను పరిశీలించాకే చెబుతామని ముద్రగడకు వర్తమానం అందినట్టు చెప్పుకుంటున్నారు. గట్టి పోటీ ఇచ్చి జయాపజయాలను ప్రభావితం చేయగల అభ్యర్థి కోసమే వైసీపీ వెదుకుతోందన్నది పార్టీ వర్గాల మాట. పార్టీ ఇమేజ్తో సంబంధం లేకుండా వ్యక్తిగత కరిష్మా ఉన్న అభ్యర్ధులవైపు మొగ్గుతోందట వైసీపీ. అందుకే.. ఒకవేళ ముద్రగడ కుమారుడికి సీటు ఇవ్వడం సాధ్యం కాకుంటే…వేరే విధంగా న్యాయం చేస్తామని చెప్తోంది వైసీపీ నాయకత్వం.
మొత్తానికి పొలిటికల్ స్క్రీన్ పై మళ్ళీ కనిపించడానికి ముద్రగడ ప్రయత్నాలు చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం. వైసీపీ కూడా ఆయనకు ఎర్ర తివాచీ పరిచినట్టే పరిచి ప్లస్లు, మైనస్ల లెక్కలు వేస్తోంది. పద్మనాభం కూడా తనకంటే… కుమారుడి రాజకీయ భవిష్యత్ ముఖ్యం కనుక ఏదో రూపంలో అతన్ని బరిలో దింపి పొలిటికల్గా సెట్ చేయాలని చూస్తున్నారట. పద్మనాభం ప్రయత్నాలు…వైసీపీ కూడికలు, తీసివేతలు అంతిమంగా ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
- Tags
- ap
- mudragada
- off the record
- YSRCP
తాజావార్తలు
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
-
AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
-
Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!