Off The Record: మచిలీపట్నం ఎంపీ సీటుపై వైసీపీలో ఇప్పటి నుంచే చర్చ
- మచిలీపట్నం ఎంపీ సీట్లో ఒక్కసారి మాత్రమే వైసీపీ గెలుపు..
- వచ్చే ఎన్నికల్లో టిక్కెట్పై అప్పుడే చర్చలు..
- నియోజకవర్గంలో కాపు, గౌడ సామాజికవర్గాలు ఎక్కువ..
- 2019లో పార్టీ తరపున కాపు నేత బాలశౌరి గెలుపు..
- 2024లో అదే కాపు సామాజికవర్గం నేత సింహాద్రి చంద్రశేఖర్ ఓటమి..
- గందరగోళ పరిస్థితుల్లో చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు..
- ఈసారి నాన్చకుండా ఓసీనా, బీసీనా ముందే తేల్చమన్న డిమాండ్..
- బీసీలకు ఇచ్చే అంశంపై పార్టీలో సీరియస్ చర్చలు?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మచిలీపట్నం ఎంపీ సీటు విషయమై ఇప్పుడు వైసీపీలో కొత్త చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సింహాద్రి చంద్రశేఖర్ ఓడిపోయారు. అంతకు ముందు 2019లో ఇక్కడి నుంచే ఇదే వైసీపీ నుంచి తరపున పోటీ చేసిన బాలశౌరి విజయం సాధించారు. ప్రస్తుతం జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారాయన. వైసీపీ ఏర్పాటు తర్వాత ఒక్కసారి మాత్రమే బందరులో గెలవగలిగింది. కాపు సామాజికవర్గం ప్రయోగంతో బాలశౌరి రూపంలో ఒకసారి గెలిచి, సింహాద్రి చంద్రశేఖర్ రూపంలో మరోసారి ఓడిపోవడంతో…. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఇవ్వాలన్న అంశంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు స్థానిక వైసీపీ నేతలు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాపు, గౌడ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీ గౌడ సామాజిక వర్గానికి చెందిన కొనకళ్ళ నారాయణకు మూడుసార్లు టిక్కెట్ ఇవ్వగా రెండు విడతలు గెలిచారాయన. 2019లో మూడోసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. వైసీపీ కూడా మొదట బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్థసారధికి టికెట్ కేటాయించింది.
ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోగా… 2019లో కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరికి ఇచ్చారు.ఆయన గెలవడంతో… అదే ఫార్మాట్ను ఫాలో అవుతూ… 2024లో కాపు కులానికే చెందిన సింహాద్రి చంద్రశేఖర్కు ఇచ్చి ఓటమి చవిచూసింది. ఈ పరిస్థితుల్లో… వచ్చే ఎన్నికల్లో బీసీ లేదా ఓసీ… ఏ వర్గానికి టికెట్ ఇవ్వాలన్న అంశంపై ఆల్రెడీ పార్టీలో చర్చ మొదలైంది. అదే సమయంలో గత ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు విషయంలో జరిగిన పొరపాటు గురించి కూడా మాటలు నడుస్తున్నాయట. అప్పట్లో…. ముందు అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ పేరును ప్రకటించింది పార్టీ. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆయన సోదరుడు చంద్రశేఖర్ను బరిలో దింపింది. అభ్యర్థి ఓటమికి కారణాల్లో ఈ గందరగోళం కూడా ఒకటని చెబుతున్నారు వైసీపీ లీడర్స్. అందుకే ఈసారి ఎక్కవ నాన్చకుండా… బీసీనా ఓసీనా అన్నది ముందే తేల్చేసి….ప్రకటించమన్న డిమాండ్ పెరుగుతోంది.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా… ఈసారి వాటిలో ఒక బీసీ, ఒక ఎస్సీ, నాలుగు టిక్కెట్లు ఓసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే… ఎంపీ సీటును బీసీలకు ఇచ్చే అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోందట. ఆకోటాలో.. గత ఎన్నికల్లోనే మాజీ మంత్రి జోగి రమేష్ను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించాలని చర్చ జరిగిందట. కానీ అది ఆచరణలోకి రాలేదు. చివరి నిమిషంలో… సింహాద్రికి టిక్కెట్ ఫైనల్ అయింది. ఈ క్రమంలో ఈసారి బీసీల విషయంలో సీరియస్గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… మీరు టిక్కెట్ ఎవరికైనా ఇవ్వండిగానీ… ఆ ఎవరన్నది ముందే తేల్చండి.. గందరగోళపు నిర్ణయాలతో నష్టపోతున్నామంటూ స్థానిక నాయకులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!