Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Kurnool District Ysrcp Mlas

Off The Record: వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కాజ్ వే చిచ్చు..

Published Date :February 2, 2023 , 10:10 pm
By Sudhakar Ravula
Off The Record: వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కాజ్ వే చిచ్చు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: కర్నూలు జిల్లా కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల సరిహద్దుల మధ్య హంద్రి నదిపై కాజ్‌వే, రహదారి నిర్మాణం… ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టింది. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మధ్య ఈ వంతెన నిర్మాణం విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ పంచాయితీని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్చాల్సి వచ్చిందట. కోడుమూరు మండలం గోరంట్ల- పత్తికొండ నియోజకవర్గం ఎస్.హెచ్. ఎర్రగుడి మధ్య హంద్రీనదిపై 330 మీటర్ల పొడవునా కాజ్ వే, కొత్తపల్లి వరకు 5.9 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 21 కోట్లతో భూమిపూజ చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఈ కాజ్‌ వే వల్ల పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలంలో 12 గ్రామాల ప్రజలకు… బళ్లారి, కోడుమూరు, కర్నూలు వెళ్లేందుకు సుమారు 16 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. స్కూలు, కాలేజీలు, ఆసుపత్రి, రైతుల పంటల రవాణాకు ఈ కాజ్ వే నిర్మాణం అవసరమని జగన్ పాదయాత్ర సమయంలో కృష్ణగిరి మండల ప్రజలు కోరారట. అధికారంలోకి వస్తే ఈ వంతెన నిర్మిస్తామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారట. ఆ మేరకు నిధులు మంజూరు చేసి భూమి పూజ చేశారట. ఈ కాజ్ వే కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాలకు సగం సగం వస్తుంది.

Read Also: Off The Record: సిట్టింగులలో ఎంతమందికి టిక్కెట్లు? కొత్తవారికి అవకాశం ఉంటుందా?

అయితే అంతకుముందే… హంద్రి నదిపై కాజ్ వే నిర్మాణానికి భూమి పూజ తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పంచాయితీ పెట్టుకున్నారట. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించింది తానంటే.. కాదు తానే అని పేచీకి దిగారట. తానే మంజూరు చేయించుకున్నానని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పట్టుబట్టారు. ప్రతిపాదనలు కూడా కోడుమూరు నుంచే పంపించామని సుధాకర్ వాదనగా ఉంది. అయితే పత్తికొండ నియోజకవర్గంలోని 12 గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని పాదయాత్ర సమయంలో జగన్‌కు చెప్పి హామీ కూడా తీసుకున్నామనీ, ఈ బ్రిడ్జి అవసరం, ఉపయోగం తమ నియోజకవర్గ ప్రజలకే ఎక్కువగా ఉందనీ పత్తికొండ ఎమ్మెల్యే వాదించారట. జిల్లా అధికారులు కూడా ఈ ఇద్దరి పంచాయితీతో తలలు పట్టుకున్నారట. చివరికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని… కోడుమూరు నియోజకవర్గం గోరంట్ల వద్ద భూమి పూజ చేసేలా ఒప్పించారని టాక్.

Read Also: Off The Record: రేవంత్ రెడ్డి పాదయాత్ర వేదిక ఎందుకు మారింది? సయోధ్య కుదరలేదా?

కాజ్ వే నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి… శిలాఫలకంపై తన పేరు చిన్న అక్షరాలతో కావాలనే రాయించారని కినుక వహించారట. భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయే ప్రయత్నం చేశారట. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని… ఎమ్మెల్యే శ్రీదేవికి నచ్చజెప్పి సభలో మాట్లాడి వెళ్లాలని కోరారట. ఇప్పటికే కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌కు… తన నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌ కోట్ల హర్షతో తరుచూ ఏదోఒక విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతోనూ సుధాకర్‌ వివాదం తెచ్చుకున్నారనే చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదానికి కారణం బ్రిడ్జి మాత్రమే కాదని, వేరే కారణాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గీయులే గుసగుసలాడుతున్నారు. మరి అసలు కారణాలేంటో తెలియాలంటే… వేచిచూడాల్సిందే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kodumuru
  • Kurnool
  • MINISTER BUGGANA
  • off the record
  • Pathikonda

తాజావార్తలు

  • Call Off Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తాత్కాలికంగా సమ్మె బ్రేక్..! ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్..

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

  • Highest Grossing Indian Movies: 2 తెలుగు సినిమాలు సహా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ సినిమాలివే!

  • Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions