Site icon NTV Telugu

Off The Record: విప్ ల నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తులు

Otr T Cong

Otr T Cong

తెలంగాణ ప్రభుత్వం తాజాగా విప్‌లను నియమించింది. వాటి విషయంలో ఇప్పుడు పార్టీ పరమైన రచ్చ మొదలైంది. ఆశావహులు భారీగా ఉండటం, నిరాశ పడటం సహజ పరిణామమే అయినా… ఇప్పుడో కొత్త వాదన కాంగ్రెస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. పదవుల పంపకాల్లో అంతా కొత్తగా వచ్చిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని, కష్టకాలంలో అండగా ఉండి జెండా మోసిన వాళ్ళకు మొండి చేయి చూపిస్తున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. నమ్ముకుని ఉన్న వాళ్ళకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు కొందరు నాయకులు. ఇక తాజా పదవుల పంపకాలతో ఓల్డ్ కాంగ్రెస్ నేతలు కుత‌కుత‌లాడిపోతున్నారట. ఇత‌ర పార్టీల నుండి కాంగ్రెస్‌లోకి వ‌చ్చినోళ్ళకే అన్నీ దక్కితే ఇక పార్టీ వాదులుగా మేమెందుకని అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా విప్‌ పదవులు దక్కిన వాళ్ళలో టిడిపి నుండి వ‌చ్చిన విజ‌య‌ర‌మ‌ణారావు, బీఆర్‌ఎస్‌ నుండి వ‌చ్చిన వీరేశం, రెండు పార్టీలు మారిన యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి ఉన్నారని, దీని ద్వారా నా.కత్వం ఎలాంటి సంకేతాలు పంపుతోందంటూ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు కూడా గుసగుసలాడుకుంటున్నార.

Read Also: Hyderabad: 120 గజాల స్థలం కోసం.. అక్క అని కూడా చూడలేదు.. దారుణం..

కొందరైతే… ఇంకో అడుగు ముందుకేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా… సీక్రెట్ మీటింగులు పెట్టిన వారికి అవకాశం ఇస్తున్నారంటూ విమర్శిస్తున్నట్టు సమాచారం. పార్టీని,
నాయకుడిని నమ్ముకుని పని చేస్తున్న మమ్మల్ని పక్కన పెడుతున్నారు. వ్యతిరేకంగా మాట్లాడితేనే పదవులు వస్తాయన్న ఇండికేషన్ ఇస్తున్నారంటూ ఓ నాయకుడు నిట్టూర్పులు విడిచారు. ప్రభుత్వ విప్ లుగా నియమించిన వాళ్ళు… ఇప్పటి వరకు ప్రతిపక్షం నుండి వచ్చే విమర్శలకు కానీ… ప్రభుత్వం విధానాలపై కానీ పెద్దగా ఫోకస్ చేసింది కూడా తక్కువే. అటు సామాజిక సమీకరణల అంచనా వేసుకున్నా… ఓసీలకే పెద్దపీట వేశారన్న అభిప్రాయం ఉంది. ఇటీవల జరిగిన నియామకాల్లో సీఎం రేవంత్ రెడ్డి తన టీంను పూర్తి స్థాయిలో సెట్ చేసుకున్నారు. రాజ్యసభ సీటు విషయంలో కూడా తన మార్క్ చూపించారు. ఐతే పాతవాళ్ళను పక్కన పెట్టారన్న సంకేతాలు మాత్రం కరెక్ట్‌ కాదన్నది గాంధీభవన్‌ టాక్.

Exit mobile version