Off The Record: కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు పెట్టిన ఓ స్కూల్..
- నిజామాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయ మంజూరు..
- జక్రాన్పల్లి మండలం కలిగోట్లో పెట్టమని ఎంపీ ప్రతిపాదన..
- బోథన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఎంట్రీతో సీన్ ఛేంజ్..
- నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ భూముల్లో పెట్టమన్న ఎమ్మెల్యే..
- రాజకీయం ముదిరి దిష్టి బొమ్మల దహనాలు..
- బీజేపీ, కాంగ్రెస్ వార్గా మారిన నవోదయ ఎపిసోడ్..
- స్కూల్ వచ్చాక మీ గోలేంటని తల్లిదండ్రుల మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నిజామాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ… దాన్ని ఎక్కడ పెట్టాలన్న విషయంలో రాజకీయ రాద్ధాంతం నడుస్తున్నట్టు తెలిసింది. కేంద్రం మంజూరు చేసిన స్కూల్ను తాను సూచించిన ప్రాంతంలో ప్రారంభించమని పట్టుబడుతున్నారట నిజామాబాద్ ఎంపీ అర్వింద్. జక్రాన్ పల్లి మండలం కలిగోట్లో పెట్టాలంటూ… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట ఎంపీ. ఆ మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం కలిగోట్లో ప్రతిపాదిత స్దలాన్ని పరిశీలించింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు దాదాపుగా ఖాయమని అనుకుంటున్న టైంలో… సీన్లోకి వచ్చారు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నవోదయ స్కూల్ను ఆచన్పల్లిలోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ స్ధలంలో ఏర్పాటు చేయాలంటూ తాజాగా ప్రతిపాదనలు పంపారు. దీంతో…ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియక అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఇక ఇక్కడే పొలిటికల్ వార్ కూడా మొదలైపోయింది.
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నవోదయ స్కూల్ను బోధన్ తరలించుకుపోయే ప్లాన్ ఉన్నారంటూ… తీవ్రంగానే టార్గెట్ చేశారు ఎంపీ అర్వింద్. ఇక బీజేపీ శ్రేణులు ఓ అడుగు ముందుకేసి.. మాజీ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఈ వివాదం కాస్తా.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చకు దారితీసింది. నవోదయ విద్యాలయం ఏర్పాటు సంగతేమోగానీ…. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బీజేపీ ఎంపీ అర్వింద్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. బీజేపీ నేతలు బోధన్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుండటం పొలిటికల్ హీట్ను మరింత పెంచుతోంది. ఎంపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నేతలు సైతం ఆందోళనకు సిద్ధమవుతున్నారట. జిల్లాలో సీనియర్ నేత అయిన సుదర్శన రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తున్నా.. స్థానిక హస్తం నేతలు మౌనం దాల్చడంపై కాంగ్రెస్ అధిష్టానం సైతం సీరియస్ అయినట్టు తెలిసింది. పార్టీ పెద్దలు తలంటాక నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కదలిక వచ్చి… కౌంటర్ అటాక్స్కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక్కడ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నది జిల్లా వాసుల దశాబ్దాల డిమాండ్. అలాంటిది.. ఆ డిమాండ్ ను నెరవేరుస్తూ కేంద్రం ఓ విద్యాలయాన్ని మంజూరు చేస్తే.. వీళ్ళిలా పొలిటికల్ పోట్లాటలు పెట్టుకుని రచ్చ చేయడం ఏంటంటూ… మండిపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
అటు ఎంపీ అర్వింద్ మాత్రం ఈ విషయంలో ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అసలు నిజాం షుగర్స్ భూముల్లో నవోదయ విద్యాలయాన్ని పెట్టడం సాధ్యమేనా? సుదర్శన్రెడ్డి సోయి ఉండే మాట్లాడుతున్నారా అంటుూ మండిపడ్డారు. మంత్రి పదవి కోసం కలలుగంటే కనవచ్చుగానీ… దాని కోసం ఇలా రచ్చచేసి పిల్లల భవిష్యత్తో ఆడుకోకూడదని అంటున్నారు. ఇలా… మొత్తంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న నవోదయ చిచ్చు ఎలా చల్లారుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు. పెట్టాలనుకుంటున్నది స్కూల్గనుక ప్రజా ప్రతినిధులు సమష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పొలిటికల్ వార్కు ఫుల్స్టాప్ పెట్టి పిల్లల గురించి ఆలోచించమంటున్నారు తల్లిదండ్రులు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!